బాలీవుడ్లో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోయిన్గా ఎదిగిన అమ్మాయి కంగనా రనౌత్. ఐతే పెద్ద రేంజికి వెళ్లాం కదా అని.. గతంలో జరిగిన చేదు అనుభవాలను మరిచిపోయి, అక్కడి పెద్దలతో కలివిడిగా తిరుగుతూ.. మొహర్బానీలు చేస్తూ.. ‘అందరి మనిషి’గా గుర్తింపు పొందడానికి ఆమె ఎప్పుడూ ప్రయత్నించలేదు.
తన ‘గత’ జీవితంలో విలన్లుగా ఉన్న వాళ్లు, తన లాంటి వాళ్లను ఎదగనీయకుండా చేయడానికి ప్రయత్నించే వాళ్లందరినీ టార్గెట్ చేసుకుని ఆమె కొన్నేళ్లుగా రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్లో స్టార్ కిడ్స్ అన్నా.. వారిని ప్రోత్సహించే వాళ్లన్నా కంగనాకు ఎంత మంటో తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆలియా భట్, కరణ్ జోహార్ లాంటి వాళ్లను తరచుగా టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేస్తుంటుంది కంగనా. తాజాగా కరణ్ జోహార్ మరోసారి పడ్డ కంగనా.. ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఐతే కంగనా కొన్నిసార్లు మరీ శ్రుతిమించి పోతుండటంతో ఆమె ఒక న్యూసెన్స్లా తయారవుతోందని విమర్శలు చేసే తటస్థులూ లేకపోలేదు. లెజెండరీ యాక్టర్ నసీరుద్దీన్ షా అలాంటి వ్యాఖ్యలే చేశారు తాజాగా. సగం తెలివితో మాట్లాడే వాళ్ల వ్యాఖ్యలకు విలువ ఉండదని, వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. కంగనా పేరెత్తకుండా ఆమె ఇటీవల చేస్తున్న విమర్శలు, ఆరోపణలను ఉటంకిస్తూ ఓ ఇంటర్వ్యూలో విమర్శలు చేశారు నసీరుద్దీన్.
ఐతే అవతలున్నది ఎంతటి వారైనా తనను విమర్శిస్తే కంగనా ఊరుకునే రకం కాదు. కానీ నసీరుద్దీన్ విషయంలో మాత్రం ఆమె నోరు జారలేదు. ఇంతకుముందు నసీరుద్దీన్ తనను ఎంతగా పొగిడింది.. తన సమకాలీనులైన నెపోటిజం బ్యాచ్తో పోలిస్తే తాను సాధించిన అవార్డులు, ఘనతల గురించి ఎంత గొప్పగా చెప్పిందీ ఆమె గుర్తు చేసింది.
తాను గనుక ప్రకాష్ పదుకొనే లేదా అనిల్ కపూర్ కూతురినైతే ఆయనిలా పొగిడేవాళ్లా అని ఆమె ప్రశ్నించింది. గత ఏడాది నసీరుద్దీన్ను తాను ఇంటర్వ్యూ చేసినప్పటి వీడియోను పోస్ట్ చేసి ఆయనకు ఓ ‘నమస్కారం’ పెట్టింది. నసీరుద్దీన్ను విమర్శించనైతే విమర్శించలేదు కానీ.. ఆమె శత్రువుల జాబితాలోకి ఓ కొత్త పేరు వచ్చినట్లే అని భావిస్తున్నారు.
This post was last modified on August 20, 2020 3:18 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…