బాలీవుడ్లో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోయిన్గా ఎదిగిన అమ్మాయి కంగనా రనౌత్. ఐతే పెద్ద రేంజికి వెళ్లాం కదా అని.. గతంలో జరిగిన చేదు అనుభవాలను మరిచిపోయి, అక్కడి పెద్దలతో కలివిడిగా తిరుగుతూ.. మొహర్బానీలు చేస్తూ.. ‘అందరి మనిషి’గా గుర్తింపు పొందడానికి ఆమె ఎప్పుడూ ప్రయత్నించలేదు.
తన ‘గత’ జీవితంలో విలన్లుగా ఉన్న వాళ్లు, తన లాంటి వాళ్లను ఎదగనీయకుండా చేయడానికి ప్రయత్నించే వాళ్లందరినీ టార్గెట్ చేసుకుని ఆమె కొన్నేళ్లుగా రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్లో స్టార్ కిడ్స్ అన్నా.. వారిని ప్రోత్సహించే వాళ్లన్నా కంగనాకు ఎంత మంటో తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆలియా భట్, కరణ్ జోహార్ లాంటి వాళ్లను తరచుగా టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేస్తుంటుంది కంగనా. తాజాగా కరణ్ జోహార్ మరోసారి పడ్డ కంగనా.. ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఐతే కంగనా కొన్నిసార్లు మరీ శ్రుతిమించి పోతుండటంతో ఆమె ఒక న్యూసెన్స్లా తయారవుతోందని విమర్శలు చేసే తటస్థులూ లేకపోలేదు. లెజెండరీ యాక్టర్ నసీరుద్దీన్ షా అలాంటి వ్యాఖ్యలే చేశారు తాజాగా. సగం తెలివితో మాట్లాడే వాళ్ల వ్యాఖ్యలకు విలువ ఉండదని, వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. కంగనా పేరెత్తకుండా ఆమె ఇటీవల చేస్తున్న విమర్శలు, ఆరోపణలను ఉటంకిస్తూ ఓ ఇంటర్వ్యూలో విమర్శలు చేశారు నసీరుద్దీన్.
ఐతే అవతలున్నది ఎంతటి వారైనా తనను విమర్శిస్తే కంగనా ఊరుకునే రకం కాదు. కానీ నసీరుద్దీన్ విషయంలో మాత్రం ఆమె నోరు జారలేదు. ఇంతకుముందు నసీరుద్దీన్ తనను ఎంతగా పొగిడింది.. తన సమకాలీనులైన నెపోటిజం బ్యాచ్తో పోలిస్తే తాను సాధించిన అవార్డులు, ఘనతల గురించి ఎంత గొప్పగా చెప్పిందీ ఆమె గుర్తు చేసింది.
తాను గనుక ప్రకాష్ పదుకొనే లేదా అనిల్ కపూర్ కూతురినైతే ఆయనిలా పొగిడేవాళ్లా అని ఆమె ప్రశ్నించింది. గత ఏడాది నసీరుద్దీన్ను తాను ఇంటర్వ్యూ చేసినప్పటి వీడియోను పోస్ట్ చేసి ఆయనకు ఓ ‘నమస్కారం’ పెట్టింది. నసీరుద్దీన్ను విమర్శించనైతే విమర్శించలేదు కానీ.. ఆమె శత్రువుల జాబితాలోకి ఓ కొత్త పేరు వచ్చినట్లే అని భావిస్తున్నారు.
This post was last modified on August 20, 2020 3:18 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…