ఊహించని కాంబినేషన్ తో రూపొందిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వచ్చే నెల 7న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో పాయింట్ గురించి చూచాయగా హింట్స్ ఇవ్వడం తప్ప టీజర్ లోనూ స్టోరీని పెద్దగా రివీల్ చేయలేదు. అందుకే అందరి కళ్ళు ట్రైలర్ మీదే ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లార్జ్ పిసిఎక్స్ స్క్రీన్ లో దీని లాంచ్ ఈవెంట్ చేశారు. చాలా గ్యాప్ తో అనుష్క చేసిన ఫుల్ లెన్త్ రోల్ మూవీ కావడంతో స్వీటీ ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నారు. జాతిరత్నాలు తర్వాత అమాంతం ఫాలోయింగ్ పెరిగిన నవీన్ పోలిశెట్టి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాడు.
కథ గుట్టు విప్పేశారు. ఇంజనీరింగ్ చదివినా స్టాండప్ కమెడియన్ గా ఉపాధి చూసుకున్న యువకుడు సిద్దు(నవీన్ పోలిశెట్టి) ఇంట్లో తల్లి తండ్రులు ఎంత పోరు పెడుతున్నా రూటు మార్చుకోడు. పెళ్లి కాకుండానే పిల్లల్ని కనాలని చూస్తున్న లేడీ చెఫ్ అంకిత(అనుష్క శెట్టి)కి ఇతనే కరెక్ట్ ఛాయస్ అనిపిస్తుంది. ముందు ఒప్పుకున్న సిద్దు ఆమెను ప్రేమలో దింపి తర్వాత పెళ్లి చేసుకోవచ్చని ప్లాన్ చేసుకుంటాడు. కానీ అంకిత చాలా సీరియస్ గానే మగ తోడు కోరుకోవడం లేదని తెలిశాక వీళ్ళ జీవితంలో అనూహ్య మార్పులు వస్తాయి. ఈ జంట ప్రయాణం చివరికి ఏ గమ్యం చేరుకుందనేది తెరమీద చూడాలి.
దర్శకుడు మహేష్ బాబు సన్నివేశాలను చాలా క్యూట్ గా రూపొందించాడు. నవీన్ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా వాడుకునేలా డైలాగులు రాసుకున్న తీరు నవ్వులు పూయించింది. పాయింట్ ఊహించని విధంగా కొంత కాంట్రావర్సీగా అనిపిస్తున్నా అనుష్క పాత్ర వెనుక ఉన్న బలమైన కారణాన్ని దాచి పెట్టారు. గోపి సుందర్ నేపధ్య సంగీతం, రధన్ పాటలు ఈ కూల్ అండ్ డిఫరెంట్ స్టోరీకి మంచి ఫీల్ తీసుకొచ్చాయి. నవీన్ పోలిశెట్టి, అనుష్కల మధ్య కెమిస్ట్రీ డిఫరెంట్ గా ఉంటూనే ఆకట్టుకుంది. కంటెంట్ కూడా ఇలాగే ఉంటే మరో కూల్ ఎంటర్ టైనర్ వచ్చే నెలలో హిట్టు కొట్టడానికి సిద్ధమైనట్టే
This post was last modified on August 21, 2023 7:55 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…