సెప్టెంబర్ 7 విడుదల కాబోతున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మీద ప్రేక్షకులకు మెల్లగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. రాబోయే రెండు వారాలు యువి క్రియేషన్స్ నాన్ స్టాప్ ప్రమోషన్లు చేయనుంది. ఇందులో భాగంగా ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, మీట్ ది ప్రెస్ అన్నీ ఉంటాయి. అభిమానుల సమ్మేళనం లాంటివి ప్లాన్ చేయబోతున్నారు. అయితే స్వీటీ అనుష్క మాత్రం వీటిలో భాగం కాబోవడం లేదని ఇన్ సైడ్ టాక్. ఇంతకు ముందే షూట్ చేసిన ఒక వీడియో ముఖాముఖీ తప్ప తనవైపు ప్రత్యక్షంగా హాజరయ్యే సందర్భం ఉండకపోవచ్చని అంటున్నారు.
కారణాలు చెప్పలేదు కానీ టైటిల్ రోల్ లో సగం తన పేరు మీదే ఉన్నా అనుష్క ఇలా దూరంగా ఉండటం అభిమానులను బాధించేదే. ఎందుకంటే స్వీటీని తెరమీద చూసి చాలా కాలమయ్యింది. భాగమతి తర్వాత నిశ్శబ్దం డైరెక్ట్ ఓటిటిలో వచ్చింది. సైరా నరసింహారెడ్డిలో జస్ట్ మెరుపులా ఒక సీన్ చేసింది అంతే. అక్కడి నుంచి తను ఒప్పుకున్న ఒకే ఒక సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. హీరో నవీన్ మాత్రం కాళ్ళకు చక్రాలు కట్టుకుని మరీ జూన్ లోనే కాలేజీలు తిరుగుతూ చాలా ప్రోగ్రాంస్ చేశాడు. ఇప్పుడో పది రోజులు షూటింగులకు బ్రేక్ తీసుకుని పబ్లిసిటీలో భాగమయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు.
జోడిగా నటించిన అనుష్క కూడా పక్కనే ఉంటే బాగుండేది. మరి తర్వాత మనసు మారి కెమెరా ముందుకు వస్తుందో లేదా ఆరోగ్యమో మరో కారణం వల్ల వద్దనుకుంటుందో వేచి చూడాలి. హైప్ సంగతి ఎలా ఉన్నా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి అదే రోజు షారుఖ్ ఖాన్ జవాన్ తో గట్టి పోటీ ఉంది. దాన్ని ధీటుగా ఎదురుకోవాలంటే కంటెంట్ ఓ రేంజ్ లో ఉందనే టాక్ రావాలి. నిర్మాతలు ఆ విషయంలో నమ్మకంగానే ఉన్నారు. ఒక చెఫ్ కి ఒక స్టాండప్ కమెడియన్ కి మధ్య జరిగే స్వీట్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాకు రధన్ సంగీతం సమకూర్చగా పి మహేష్ బాబు దర్శకత్వం వహించారు.
This post was last modified on August 21, 2023 2:34 pm
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…