తెలుగు సినిమా వినోదంలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమాల్లో ఖచ్చితంగా గుర్తొచ్చేవి నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లేశ్వరి. వీటి దర్శకుడిగా కె విజయభాస్కర్ కు చాలా పేరుండేది. సక్సెస్ లో రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సింహ భాగం ఇవ్వాల్సిందే కానీ పేపర్ మీద కంటెంట్ ని అంతే అందంగా తెరకెక్కించిన డైరెక్టర్ ని తక్కువ చేయలేం. ఈ ఇద్దరి కాంబోకి జై చిరంజీవతో బ్రేక్ పడింది. విజయభాస్కర్ చివరి చిత్రం 2013లో వచ్చిన మసాలా. పదేళ్ల గ్యాప్ తర్వాత కొడుకు శ్రీకమల్ ని హీరోగా పరిచయం చేస్తూ జిలేబిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
జిలేబి(శివాని రాజశేఖర్) అనే అమ్మాయి కొన్ని అనూహ్య సంఘటనల వల్ల బాయ్స్ హాస్టల్ లో రహస్యంగా తలదాచుకునే పరిస్థితి తలెత్తుంది. అప్పటికే కమల్(శ్రీకమల్)తో ఉన్న పరిచయమే ఈ సంకట స్థితికి కారణం అవుతుంది. ఆమె ఉన్నట్టు మరో ముగ్గురు కుర్రాళ్లకు తెలిసిపోతుంది. స్థానిక ఎమ్మెల్యే అయిన జిలేబి తండ్రి(మురళీశర్మ) కూతుర్ని వెతికే క్రమంలో జరిగే పరిణామాలు, హాస్టల్ వార్డెన్ ధైర్యం (రాజేంద్రప్రసాద్) ఈ జంటకు ఎలా సహాయం చేశాడనే ప్రశ్నలకు సమాధానాలే జిలేబి స్టోరీ. పాయింట్ కొంచెం వెరైటీగా ఉన్నా ట్రీట్మెంట్ మాత్రం పాత పద్దతిలోనే సాగుతుంది.
పాత్రల పరిచయాలు, అసలు ట్విస్టు తాలూకు ఎస్టాబ్లిష్ మెంట్, హాస్టల్ అల్లరి ఇవన్నీ రెగ్యులర్ గా ఉండటంతో వాటి నుంచి ఆశించిన హాస్యాన్ని విజయభాస్కర్ రాబట్టలేకపోయారు. సీనియర్ ఆర్టిస్టులు అండగా ఉండటం కొంత వరకు ప్లస్ అయ్యింది. సెకండ్ హాఫ్ ఓ మోస్తరుగా పర్వాలేదనిపించినా మొత్తంగా చూసుకుంటే జిలేబిలో చక్కర శాతం తగ్గిపోయి పాకం తగ్గిన పిండిలా మారిపోయింది. మణిశర్మ సంగీతంతో సహా టెక్నికల్ టీమ్ తమ వంతుగా క్వాలిటీ ఇవ్వడానికి ప్రయత్నించారు కానీ ఆశించిన ఫలితం రాలేదు. బలమైన కంబ్యాక్ ఇస్తారనుకున్న దర్శకులు ఇలా ఒక మాములు సినిమా ఇవ్వడం విచిత్రమే.
This post was last modified on August 20, 2023 11:35 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…