మాములుగా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పాలనా వ్యవహారాలకే టైం సరిపోదు. ఇక సినిమాల మాట దేవుడెరుగు. ఎంత ఇష్టమున్నా సరే ప్రజా జీవితం కోసం త్యాగం చేయాల్సి ఉంటుంది. కానీ ఒక్కోసారి ఆ టెంప్టేషన్ నుంచి తప్పించుకోవడం కుదరదు. జైలర్ కు అలాంటి పరిస్థితి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టిస్తున్న రజనీకాంత్ మానియాకు సిఎంలు కూడా మినహాయింపు కాలేకపోతున్నారు. ముందు తమిళనాడు సిఎం స్టాలిన్ ప్రత్యేకంగా చూశారు. వ్యక్తిగతంగా తలైవర్ తో ఉన్న అనుబంధం కన్నా హీరోగా ఆయనంటే ఉన్న ఇష్టం వల్ల వీలు చేసుకుని మరీ షో వేయించుకున్నారు.
తర్వాత కొద్దిరోజులకే కేరళ ముఖ్యమంత్రి విజయన్ పినరయ్ ఇంట్లో కాకుండా అదే పనిగా త్రివేండ్రంలో ఉన్న పివిఆర్ మల్టీప్లెక్సుకు తన కుటుంబంతో వెళ్లి చూశారు. స్టేట్ హెడ్డే వస్తే ఇక థియేటర్ యాజమాన్యానికి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. తాజాగా ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాధ్ జైలర్ ని చూడాలని నిర్ణయించుకున్నారు. హిమాలయ యాత్రను పూర్తి చేసుకున్న రజనీకాంత్ స్వయంగా ఆయనతో కలిసి తన సినిమా చూసేందుకు నిన్న లక్నో చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో కలిసిన మీడియాకు ఈ విషయం రజనినే చెప్పడంతో బయటికి వచ్చింది.
అన్ని వర్గాల ఆడియన్స్ ని జైలర్ ఏ స్థాయిలో రీచ్ అయ్యిందో చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదు. గతంలో రజనీకాంత్ ఎన్నో సినిమాలు విపరీతమైన హైప్ తో రిలీజైనప్పటికీ ఇంతగా సీఎంలు, ఎమ్మెల్యేలు చూసేందుకు ఆసక్తి చూపించలేదు. ప్రస్తుతం అయిదు వందల కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెడుతున్న జైలర్ ఫైనల్ రన్ అయ్యేలోపు తమిళనాడు హయ్యెస్ట్ గా నిలవడం ఖాయమని బయ్యర్లు బల్లగుద్ది చెబుతున్నారు. 2.0 పేరు మీద ఉన్న రికార్డులను జైలర్ బద్దలు కొట్టేలానే ఉంది. తెలుగులోనూ ఇప్పటికే మూడింతల లాభాన్ని ఖాతాలో వేసుకుని జోరు కొనసాగిస్తోంది
This post was last modified on August 19, 2023 12:25 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…