ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోల సినిమాలతో పాటు ఒకప్పటి డబ్బింగ్ లవ్ స్టోరీస్ కూడా తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ డబ్బింగ్ మూవీస్ 3 , ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ , ‘రఘువరన్ బీటెక్’ లాంటి సినిమాలు రిలీజై మంచి వసూళ్లు అందించాయి. ఇప్పుడు ఇదే బాటలో మరో కల్ట్ లవ్ స్టోరీ మళ్ళీ థియేటర్స్ లోకి వస్తోంది. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కొడుకు రవి కిషన్ , సోనియా జంటగా కొన్నేళ్ళ క్రితం వచ్చి సూపర్ హిట్టయిన 7 /G బృందావన్ కాలనీ రీ రిలీజ్ కి రెడీ అవుతుంది.
తాజాగా ఈ సినిమా రీల్ తీసుకొని 4 k కన్వర్షన్ పనులు మొదలు పెట్టారు. డాల్బీ సౌండ్ తో సినిమాను క్వాలిటీ మిస్ అవ్వకుండా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు వెనుక కసరత్తు జరుగుతుంది. యూత్ కి ఫేవరెట్ మూవీ కావడంతో ఈ సినిమా రీ రిలీజ్ కోసం తెలుగు ఆడియన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకూ డేట్ తెలియక ఎనౌన్స్ మెంట్ కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు తాజాగా రిలీజ్ డేట్ అప్ డేట్ అందింది. సెప్టెంబర్ 22 న 7/G బృందావన్ కాలనీ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది.
అయితే వచ్చే నెల సెప్టెంబర్ లో రామ్ ‘స్కంద’ , ప్రభాస్ ‘సలార్’ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. స్కంద సెప్టెంబర్ 15 న రిలీజ్ అవుతుండగా , ప్రభాస్ సలార్ భారీ అంచనాలతో సెప్టెంబర్ 28 న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ రెండు సినిమాల మధ్య బృందావన్ కాలనీ రీ రిలీజ్ గా వస్తుంది. మరి రామ్ సినిమా తర్వాత సలార్ కంటే ముందు వారం ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో ? రీ రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్స్ ను దాటేస్తుందా ? చూడాలి.
This post was last modified on August 19, 2023 1:29 am
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…