Movie News

రామ్, ప్రభాస్ మధ్యలో ‘బృందావన్’

ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోల సినిమాలతో పాటు ఒకప్పటి డబ్బింగ్ లవ్ స్టోరీస్ కూడా తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ డబ్బింగ్ మూవీస్   3 , ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ , ‘రఘువరన్ బీటెక్’ లాంటి సినిమాలు రిలీజై మంచి వసూళ్లు అందించాయి. ఇప్పుడు ఇదే బాటలో మరో కల్ట్ లవ్ స్టోరీ మళ్ళీ థియేటర్స్ లోకి వస్తోంది. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కొడుకు రవి కిషన్ , సోనియా జంటగా కొన్నేళ్ళ క్రితం వచ్చి సూపర్ హిట్టయిన 7 /G బృందావన్ కాలనీ రీ రిలీజ్ కి రెడీ అవుతుంది. 

తాజాగా ఈ సినిమా రీల్ తీసుకొని 4 k కన్వర్షన్ పనులు మొదలు పెట్టారు. డాల్బీ సౌండ్ తో సినిమాను క్వాలిటీ మిస్ అవ్వకుండా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు వెనుక కసరత్తు జరుగుతుంది. యూత్ కి ఫేవరెట్ మూవీ కావడంతో ఈ సినిమా రీ రిలీజ్ కోసం తెలుగు ఆడియన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకూ డేట్ తెలియక ఎనౌన్స్ మెంట్ కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు తాజాగా రిలీజ్ డేట్ అప్  డేట్ అందింది. సెప్టెంబర్ 22 న 7/G బృందావన్ కాలనీ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. 

అయితే వచ్చే నెల సెప్టెంబర్ లో రామ్ ‘స్కంద’ , ప్రభాస్ ‘సలార్’ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. స్కంద సెప్టెంబర్ 15 న రిలీజ్ అవుతుండగా , ప్రభాస్ సలార్ భారీ అంచనాలతో సెప్టెంబర్ 28 న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ రెండు సినిమాల మధ్య బృందావన్ కాలనీ రీ రిలీజ్ గా వస్తుంది. మరి రామ్ సినిమా తర్వాత సలార్ కంటే ముందు వారం ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో ? రీ రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్స్ ను దాటేస్తుందా ? చూడాలి.

This post was last modified on August 19, 2023 1:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తొమ్మిది రోజులే ఉంది భగత్ గారూ !

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ వేగంగా జరిగిపోతోంది. మార్చి 26 రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ హఠాత్తుగా మార్చి…

2 hours ago

తెలివైన స్ట్రాటజీతో ఎన్టీఆర్ & నీల్

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా నిర్మాణంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్యాన్ ప్యాన్…

3 hours ago

మెడికో దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది.…

4 hours ago

స‌భ్య‌త్వం సౌండ్ లేదు సైనికా

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న జ‌న‌సేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ స‌భ్య‌త్వాన్ని గత నెల‌లోనే ప్రారంభించిన…

8 hours ago

మార‌క‌పోతే మార్చేస్తా.. త‌మ్ముళ్ల‌కు బాబు హెచ్చరిక‌

పార్టీ విధానాల‌కు, సిద్ధాంతాల‌కు అనుగుణంగా నాయ‌కులు ప‌నిచేయాల‌ని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు క‌లివిడిగా ఉండాల‌ని సీఎం చంద్ర‌బాబు టీడీపీ నాయ‌కుల‌కు సూచించారు. నంద్యాల…

10 hours ago