కంటెంట్ డ్రివెన్ సినిమా పేరుతో కేవలం నగర, పట్టణ యువతను, కుటుంబాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీస్తున్న బాలీవుడ్ నిర్మాతలకు గదర్ 2 కొత్త పాఠం నేర్పిస్తోంది. కేవలం డెబ్భై కోట్ల బడ్జెట్ తో రూపొంది వారం తిరగడం ఆలస్యం రెండు వందల యాభై కోట్ల వసూళ్లకు దగ్గరగా వెళ్లడం చూసి తలలు పండిన ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. సెప్టెంబర్ 7న షారుఖ్ ఖాన్ జవాన్ వచ్చేవరకు దీనికి అడ్డుకట్ట పడదని అంచనా వేస్తున్నారు. సోలో హీరోగా ఎప్పుడో మార్కెట్ కోల్పోయిన సన్నీ డియోల్ అరవై రెండేళ్ల వయసులో రికార్డులు నమోదు చేయడం విశేషం.
ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మాసే ఎక్కడైనా ఎప్పటికైనా మహారాజ పోషకులు. ఒక మూవీ వందల కోట్ల కలెక్షన్లు కళ్లజూడాలంటే క్లాస్ ఆడియన్స్ తో జరగని పని. అన్ని భాషలకు ఇది వర్తిస్తుంది. మొన్నొచ్చిన జైలర్ నుంచి జనవరిలో రిలీజైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల దాకా అన్నీ కమర్షియల్ చిత్రాలే. పఠాన్ సైతం మాస్ ని మెప్పించే యాక్షన్ కంటెంట్ తో రూపొందిందే. బిసి సెంటర్ల జనాన్ని మెప్పిస్తే ఎలాంటి ఓటిటిలైనా దిగదుడుపే అని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదు. నచ్చితే నెత్తినబెట్టుకునే వర్గం తాలూకు ప్రభావమది
చాలా కాలం తర్వాత ఉత్తరాది థియేటర్లలో పండగ వాతావరణం కనిపిస్తోందని బయ్యర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీక్ డేస్ లోనూ జోరు కొనసాగడం చూసి ఇలా ఉంటే థియేటర్లను అమ్మేసుకోవాలనో లేదా ఫంక్షన్ హాళ్లుగా మార్చాలనో అనిపించదని అంటున్నారు. ట్రాక్టర్లు, లారీలు వేసుకొచ్చి మరీ సినిమాలకు రావడం గదర్ 2 విషయంలో బలంగా కనిపిస్తోంది. ఇకనైనా కార్పొరేట్ ప్రపంచానికి దూరంగా పది రూపాయలు టీ తాగే సగటు సామాన్యుడికి ఎలాంటి సినిమా ఇవ్వాలో అలాంటివి రాసుకోమని మూవీ లవర్స్ కోరుతున్నారు. ట్రెండ్ కూడా దాన్నే సూచిస్తోంది మరి.
This post was last modified on August 18, 2023 4:51 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…