కంటెంట్ డ్రివెన్ సినిమా పేరుతో కేవలం నగర, పట్టణ యువతను, కుటుంబాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీస్తున్న బాలీవుడ్ నిర్మాతలకు గదర్ 2 కొత్త పాఠం నేర్పిస్తోంది. కేవలం డెబ్భై కోట్ల బడ్జెట్ తో రూపొంది వారం తిరగడం ఆలస్యం రెండు వందల యాభై కోట్ల వసూళ్లకు దగ్గరగా వెళ్లడం చూసి తలలు పండిన ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. సెప్టెంబర్ 7న షారుఖ్ ఖాన్ జవాన్ వచ్చేవరకు దీనికి అడ్డుకట్ట పడదని అంచనా వేస్తున్నారు. సోలో హీరోగా ఎప్పుడో మార్కెట్ కోల్పోయిన సన్నీ డియోల్ అరవై రెండేళ్ల వయసులో రికార్డులు నమోదు చేయడం విశేషం.
ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మాసే ఎక్కడైనా ఎప్పటికైనా మహారాజ పోషకులు. ఒక మూవీ వందల కోట్ల కలెక్షన్లు కళ్లజూడాలంటే క్లాస్ ఆడియన్స్ తో జరగని పని. అన్ని భాషలకు ఇది వర్తిస్తుంది. మొన్నొచ్చిన జైలర్ నుంచి జనవరిలో రిలీజైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల దాకా అన్నీ కమర్షియల్ చిత్రాలే. పఠాన్ సైతం మాస్ ని మెప్పించే యాక్షన్ కంటెంట్ తో రూపొందిందే. బిసి సెంటర్ల జనాన్ని మెప్పిస్తే ఎలాంటి ఓటిటిలైనా దిగదుడుపే అని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదు. నచ్చితే నెత్తినబెట్టుకునే వర్గం తాలూకు ప్రభావమది
చాలా కాలం తర్వాత ఉత్తరాది థియేటర్లలో పండగ వాతావరణం కనిపిస్తోందని బయ్యర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీక్ డేస్ లోనూ జోరు కొనసాగడం చూసి ఇలా ఉంటే థియేటర్లను అమ్మేసుకోవాలనో లేదా ఫంక్షన్ హాళ్లుగా మార్చాలనో అనిపించదని అంటున్నారు. ట్రాక్టర్లు, లారీలు వేసుకొచ్చి మరీ సినిమాలకు రావడం గదర్ 2 విషయంలో బలంగా కనిపిస్తోంది. ఇకనైనా కార్పొరేట్ ప్రపంచానికి దూరంగా పది రూపాయలు టీ తాగే సగటు సామాన్యుడికి ఎలాంటి సినిమా ఇవ్వాలో అలాంటివి రాసుకోమని మూవీ లవర్స్ కోరుతున్నారు. ట్రెండ్ కూడా దాన్నే సూచిస్తోంది మరి.
This post was last modified on August 18, 2023 4:51 pm
ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…
హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…
సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఎంతకు తెగిస్తున్నారన్న దానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు. జనసేన అధినేత, ఏపీ…