రేపు శుక్రవారం కొత్త సినిమాలు కౌంట్ పరంగా గట్టిగానే ఉన్నాయి కానీ బజ్ విషయంలో మాత్రం అన్నీ ఒకే స్థాయిలో లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నాయి. ప్రమోషన్ల పరంగా అందరూ కష్టపడుతున్నా జనంలో ఆసక్తి రేపడం కష్టమవుతోంది. సంతోష్ శోభన్ ‘ప్రేమ్ కుమార్’ పెద్దగా హడావిడి చేయకుండా సైలెంట్ గా రంగంలోకి దిగుతోంది. లక్కు తప్ప అన్నీ ఉన్న ఈ కుర్ర హీరోకి ఇది బ్రేక్ ఇవ్వకపోతే ఆపై కష్టమే. బిగ్ బాస్ ఫేమ్ సుహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఏదో డిఫరెంట్ గా ట్రై చేసింది. నిన్న ప్రత్యేకంగా గర్భిణులకు షో వేసి మరీ వాళ్ళ ఎమోషనల్ ఫీడ్ బ్యాక్ ని పబ్లిసిటీ రూపంలో వాడుతున్నారు.
నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు లాంటి క్రేజీ ఎంటర్ టైనర్స్ ఇచ్చిన దర్శకుడు విజయ్ భాస్కర్ తన కొడుకుని పరిచయం చేస్తూ తీసిన ‘జిలేబి’ టైటిల్ పరంగా స్వీట్ గా ఉన్నా అంచనాల పరంగా చప్పగా ఉంది. తమిళ డబ్బింగ్ ‘పిజ్జా 3 ది మమ్మీ’ ఏదైనా అనూహ్యం జరిగితే తప్ప కనీసం మార్నింగ్ షోలకు జనం ఉండరు. కమెడియన్ సంతానం నటించిన మరో అనువాద చిత్రం ‘డిడి భూత్ బంగ్లా’ మాస్ హారర్ ప్రియులను టార్గెట్ గా పెట్టుకుంది. ఇవి కాకుండా మరో మూడు చిన్న సినిమాలున్నాయి కానీ వీటికి చాలా చోట్ల షో దొరకడమే కష్టమైనా ఏదోలా కిందామీద పడి రిలీజ్ అవుతున్నాయి.
వీటి పరిస్థితి ఇలా ఉంటే రీ రిలీజులు రఘువరన్ బిటెక్, యోగిలకు మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. సింగల్ షోలు పడిన సెంటర్లలో హౌస్ ఫుల్స్ ఖాయమే. టికెట్ కౌంటర్ల ద్వారా అమ్మకాలు బాగుంటాయని బయ్యర్లు చెబుతున్నారు. ఆది పినిశెట్టికి మొదటి బ్రేక్ ఇచ్చిన ‘మృగం’ని సైతం రేపే మరోసారి తీసుకొస్తున్నారు. 2007లో విడుదలైనప్పుడు మాస్ సెంటర్స్ ని ఊపేసిన మృగం తర్వాత హోమ్ వీడియోలో ఎన్నో సంచలనాలు రేపింది. ఆ నమ్మకంతోనే నిర్మాతలు సాహసం చేస్తున్నారు. చూస్తుంటే కొత్త సినిమాలను పాతవి ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on August 18, 2023 1:24 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…