Movie News

కరోనాతో కీరవాణి ఆ స్థితికి వెళ్లారా?

రాజమౌళి, కీరవాణి కుటుంబాల సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి అందరికీ తెలిసిందే. సామాజిక అంశాలపై వాళ్లు చురుగ్గా స్పందిస్తుంటారు. జనాలకు ఏదైనా విషయంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నపుడు ముందుకొస్తుంటారు. ఈ మధ్య వారి కుటుంబంలో చాలామంది కరోనా బారిన పడ్డారు. రాజమౌళి, కీరవాణి కూడా కరోనా బాధితులే.

వీరి కుటుంబ సభ్యులు, డ్రైవర్లు, పనివాళ్లలో కలిపి రెండంకెల సంఖ్యలోనే కరోనా బారిన పడ్డారట. వాళ్లందరిలోకి ఎక్కువగా ఇబ్బంది పడ్డది పెద్ద వయస్కుడైన కీరవాణేనట. ఈ విషయాన్ని ప్లాస్మా దానంపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాజమౌళితో కలిసి పాల్గొన్న కీరవాణి వెల్లడించారు.

మిగతా వాళ్లందరూ ఇంటి వద్దే ఉంటూ చికిత్స తీసుకుని కోలుకోగా.. తాను ఒక్కడిని మాత్రం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం పడిందని కీరవాణి తెలిపారు. ఒక దశలో పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ప్లాస్మా ఎక్కించాల్సిన అవసరం వచ్చిందని డాక్టర్లు చెప్పారని.. ఐతే ఒక రోజు ఆగి చూద్దాం అని ఆగారని.. ఐతే తర్వాతి రోజుకు తన పరిస్థితి మెరుగుపడిందని.. తన కోసం అనుకున్న ప్లాస్మా ఇంకో ఇద్దరు ప్రాణాలు కాపాడ్డానికి ఉపయోగపడిందని కీరవాణి వెల్లడించారు.

దేవుడైన శ్రీరామ చంద్రుడికే ఒకప్పుడు ప్రాణాపాయం తలెత్తితే సంజీవని అవసరం పడిందని.. ఇప్పుడు కరోనా బాధుతలందరికీ సంజీవని ప్లాస్మానే అని.. అది ఇచ్చేవాళ్లందరూ ప్రాణ దాతలేనని.. అందుకే తమలో యాంటీబాడీస్ ఏర్పడిన వాళ్లందరం ప్లాస్మా దానం చేస్తున్నామని.. ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్న సీపీ సజ్జనార్ అభినందనీయుడని అన్నారు కీరవాణి.

This post was last modified on August 19, 2020 12:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

2 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

2 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

3 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

4 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago