రాజమౌళి, కీరవాణి కుటుంబాల సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి అందరికీ తెలిసిందే. సామాజిక అంశాలపై వాళ్లు చురుగ్గా స్పందిస్తుంటారు. జనాలకు ఏదైనా విషయంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నపుడు ముందుకొస్తుంటారు. ఈ మధ్య వారి కుటుంబంలో చాలామంది కరోనా బారిన పడ్డారు. రాజమౌళి, కీరవాణి కూడా కరోనా బాధితులే.
వీరి కుటుంబ సభ్యులు, డ్రైవర్లు, పనివాళ్లలో కలిపి రెండంకెల సంఖ్యలోనే కరోనా బారిన పడ్డారట. వాళ్లందరిలోకి ఎక్కువగా ఇబ్బంది పడ్డది పెద్ద వయస్కుడైన కీరవాణేనట. ఈ విషయాన్ని ప్లాస్మా దానంపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాజమౌళితో కలిసి పాల్గొన్న కీరవాణి వెల్లడించారు.
మిగతా వాళ్లందరూ ఇంటి వద్దే ఉంటూ చికిత్స తీసుకుని కోలుకోగా.. తాను ఒక్కడిని మాత్రం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం పడిందని కీరవాణి తెలిపారు. ఒక దశలో పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ప్లాస్మా ఎక్కించాల్సిన అవసరం వచ్చిందని డాక్టర్లు చెప్పారని.. ఐతే ఒక రోజు ఆగి చూద్దాం అని ఆగారని.. ఐతే తర్వాతి రోజుకు తన పరిస్థితి మెరుగుపడిందని.. తన కోసం అనుకున్న ప్లాస్మా ఇంకో ఇద్దరు ప్రాణాలు కాపాడ్డానికి ఉపయోగపడిందని కీరవాణి వెల్లడించారు.
దేవుడైన శ్రీరామ చంద్రుడికే ఒకప్పుడు ప్రాణాపాయం తలెత్తితే సంజీవని అవసరం పడిందని.. ఇప్పుడు కరోనా బాధుతలందరికీ సంజీవని ప్లాస్మానే అని.. అది ఇచ్చేవాళ్లందరూ ప్రాణ దాతలేనని.. అందుకే తమలో యాంటీబాడీస్ ఏర్పడిన వాళ్లందరం ప్లాస్మా దానం చేస్తున్నామని.. ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్న సీపీ సజ్జనార్ అభినందనీయుడని అన్నారు కీరవాణి.
This post was last modified on August 19, 2020 12:20 pm
బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో…
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించిన దరిమిలా.. రాజ్యసభలో గురువారం ప్రవేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ…
తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…
రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…
పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ.. ఐప్యాక్పై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏకకాలంలో గురువారం.. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఐప్యాక్ సంస్థలకు…
వేసవి సీజన్లో కొంచెం ముందుగానే రేసులోకి దిగింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. కానీ ఈ చిత్రం టాలీవుడ్కు శుభారంభాన్ని అందించలేకపోయింది.…