ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత నిరాశతో ఉన్న అభిమానులంటే అక్కినేని హీరోలను ఇష్టపడే వారే. ఈ ఫ్యామిలీ హీరోలందరూ వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా ఏఎన్నార్ తర్వాత చాలా ఏళ్ల పాటు అక్కినేని లెగసీని ముందుకు తీసుకెళ్లిన నాగార్జున.. కొన్నేళ్లుగా దారుణమైన ఫలితాలు అందుకుంటున్నారు. గత ఏడాది దసరాకు వచ్చిన నాగ్ మూవీ ది ఘోస్ట్ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే.
దీంతో నాగ్ తన తర్వాతి సినిమా విషయంలో తర్జన భర్జనలు పడుతున్నాడు. రైటర్ ప్రసన్నకుమార్ దర్శకత్వంలో చేయాలనుకున్న సినిమా కూడా పక్కకు వెళ్లిపోయింది. ఏడాదిగా షూటింగ్స్ ఏమీ లేక ఖాళీగా ఉన్నాడు కింగ్. ఆయన కొత్త సినిమా ఏదో.. అదెప్పుడు మొదలవుతుందో తెలియని అయోమయంలో ఉన్నారు ఫ్యాన్స్.
ఈ నెల 29న నాగ్ పుట్టిన రోజు సందర్భంగా కూడా ఆయన కొత్త సినిమా గురించి కబురు వినిపించే సంకేతాలేమీ కనిపించడం లేదు. కానీ ఈ విషయం నిరాశ కలిగించినా.. నాగ్ అభిమానుల్లో ఉత్సాహం నింపే అప్డేట్ బయటికి వచ్చింది. కింగ్ కెరీర్లో మరపురాని చిత్రాల్లో ఒకటైన మన్మథుడు పుట్టిన రోజు కానుకగా రీ రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థే వెల్లడించింది. రీ రిలీజ్ కూడా ఆ సంస్థ చేతుల మీదుగానే జరగనుంది. ఏడాదిగా టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటిదాకా నాగ్ ఫ్యాన్సే ఈ ట్రెండులో పార్టిసిపేట్ చేయలేదు. ఎట్టకేలకు అక్కినేని అభిమానులు కూడా ఇందులో భాగం అవుతున్నారు. మన్మథుడు పేరెత్తగానే నాగ్ అభిమానుల్లో పులకింత కలుగుతుంది. ఇందులో మాస్ హీరోయిజం ఉండదు కానీ.. అభిమానులను అలరించే మూమెంట్స్కైతే లోటు లేదు. మన్మథుడులో ఎంటర్టైన్మెంట్, నాగ్ ఛార్మ్ వేరే లెవెల్లో ఉంటాయి. నాగ్ ఫ్యాన్స్ అనే కాక సామాన్య ప్రేక్షకులు కూడా థియేటర్లలో బాగా ఎంజాయ్ చేయగల సినిమా ఇది.
This post was last modified on August 17, 2023 11:33 am
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…
సంచలనంగా మారిన అనంతపురం హనీట్రాప్ గుట్టు రట్టైంది. ప్లాన్ చేసి.. టార్గెట్ చేసి ముగ్గులోకి దించటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే…