ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత నిరాశతో ఉన్న అభిమానులంటే అక్కినేని హీరోలను ఇష్టపడే వారే. ఈ ఫ్యామిలీ హీరోలందరూ వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా ఏఎన్నార్ తర్వాత చాలా ఏళ్ల పాటు అక్కినేని లెగసీని ముందుకు తీసుకెళ్లిన నాగార్జున.. కొన్నేళ్లుగా దారుణమైన ఫలితాలు అందుకుంటున్నారు. గత ఏడాది దసరాకు వచ్చిన నాగ్ మూవీ ది ఘోస్ట్ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే.
దీంతో నాగ్ తన తర్వాతి సినిమా విషయంలో తర్జన భర్జనలు పడుతున్నాడు. రైటర్ ప్రసన్నకుమార్ దర్శకత్వంలో చేయాలనుకున్న సినిమా కూడా పక్కకు వెళ్లిపోయింది. ఏడాదిగా షూటింగ్స్ ఏమీ లేక ఖాళీగా ఉన్నాడు కింగ్. ఆయన కొత్త సినిమా ఏదో.. అదెప్పుడు మొదలవుతుందో తెలియని అయోమయంలో ఉన్నారు ఫ్యాన్స్.
ఈ నెల 29న నాగ్ పుట్టిన రోజు సందర్భంగా కూడా ఆయన కొత్త సినిమా గురించి కబురు వినిపించే సంకేతాలేమీ కనిపించడం లేదు. కానీ ఈ విషయం నిరాశ కలిగించినా.. నాగ్ అభిమానుల్లో ఉత్సాహం నింపే అప్డేట్ బయటికి వచ్చింది. కింగ్ కెరీర్లో మరపురాని చిత్రాల్లో ఒకటైన మన్మథుడు పుట్టిన రోజు కానుకగా రీ రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థే వెల్లడించింది. రీ రిలీజ్ కూడా ఆ సంస్థ చేతుల మీదుగానే జరగనుంది. ఏడాదిగా టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటిదాకా నాగ్ ఫ్యాన్సే ఈ ట్రెండులో పార్టిసిపేట్ చేయలేదు. ఎట్టకేలకు అక్కినేని అభిమానులు కూడా ఇందులో భాగం అవుతున్నారు. మన్మథుడు పేరెత్తగానే నాగ్ అభిమానుల్లో పులకింత కలుగుతుంది. ఇందులో మాస్ హీరోయిజం ఉండదు కానీ.. అభిమానులను అలరించే మూమెంట్స్కైతే లోటు లేదు. మన్మథుడులో ఎంటర్టైన్మెంట్, నాగ్ ఛార్మ్ వేరే లెవెల్లో ఉంటాయి. నాగ్ ఫ్యాన్స్ అనే కాక సామాన్య ప్రేక్షకులు కూడా థియేటర్లలో బాగా ఎంజాయ్ చేయగల సినిమా ఇది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…