ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత నిరాశతో ఉన్న అభిమానులంటే అక్కినేని హీరోలను ఇష్టపడే వారే. ఈ ఫ్యామిలీ హీరోలందరూ వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా ఏఎన్నార్ తర్వాత చాలా ఏళ్ల పాటు అక్కినేని లెగసీని ముందుకు తీసుకెళ్లిన నాగార్జున.. కొన్నేళ్లుగా దారుణమైన ఫలితాలు అందుకుంటున్నారు. గత ఏడాది దసరాకు వచ్చిన నాగ్ మూవీ ది ఘోస్ట్ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే.
దీంతో నాగ్ తన తర్వాతి సినిమా విషయంలో తర్జన భర్జనలు పడుతున్నాడు. రైటర్ ప్రసన్నకుమార్ దర్శకత్వంలో చేయాలనుకున్న సినిమా కూడా పక్కకు వెళ్లిపోయింది. ఏడాదిగా షూటింగ్స్ ఏమీ లేక ఖాళీగా ఉన్నాడు కింగ్. ఆయన కొత్త సినిమా ఏదో.. అదెప్పుడు మొదలవుతుందో తెలియని అయోమయంలో ఉన్నారు ఫ్యాన్స్.
ఈ నెల 29న నాగ్ పుట్టిన రోజు సందర్భంగా కూడా ఆయన కొత్త సినిమా గురించి కబురు వినిపించే సంకేతాలేమీ కనిపించడం లేదు. కానీ ఈ విషయం నిరాశ కలిగించినా.. నాగ్ అభిమానుల్లో ఉత్సాహం నింపే అప్డేట్ బయటికి వచ్చింది. కింగ్ కెరీర్లో మరపురాని చిత్రాల్లో ఒకటైన మన్మథుడు పుట్టిన రోజు కానుకగా రీ రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థే వెల్లడించింది. రీ రిలీజ్ కూడా ఆ సంస్థ చేతుల మీదుగానే జరగనుంది. ఏడాదిగా టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటిదాకా నాగ్ ఫ్యాన్సే ఈ ట్రెండులో పార్టిసిపేట్ చేయలేదు. ఎట్టకేలకు అక్కినేని అభిమానులు కూడా ఇందులో భాగం అవుతున్నారు. మన్మథుడు పేరెత్తగానే నాగ్ అభిమానుల్లో పులకింత కలుగుతుంది. ఇందులో మాస్ హీరోయిజం ఉండదు కానీ.. అభిమానులను అలరించే మూమెంట్స్కైతే లోటు లేదు. మన్మథుడులో ఎంటర్టైన్మెంట్, నాగ్ ఛార్మ్ వేరే లెవెల్లో ఉంటాయి. నాగ్ ఫ్యాన్స్ అనే కాక సామాన్య ప్రేక్షకులు కూడా థియేటర్లలో బాగా ఎంజాయ్ చేయగల సినిమా ఇది.
This post was last modified on August 17, 2023 11:33 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…