Movie News

అనసూయ 50 పైసల కోసం రెండు బస్టాపులు నడిచి..

అనసూయ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యాంకర్లలో ఒకరు. నంబర్ వన్ యాంకర్ సుమకు దీటుగా పారితోషకం తీసుకుంటుంది అనసూయ. టీవీల్లో జబర్దస్త్ సహా పలు కార్యక్రమాల్లో ఆమె సందడి చేస్తుంటుంది. దీనికి తోడు సినిమాల్లోనూ ఆమెకు అవకాశాలందుతున్నాయి. ఇలా రెండు చేతులా సంపాదిస్తున్న అనసూయ వార్షిక ఆదాయం కోట్లల్లో ఉంటుంది.

ఐతే ఇప్పుడీ స్థితిలో ఉన్న అనసూయ.. ఒకప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులే పడిందట. వారి కుటుంబం అద్దె పెంచినపుడల్లా ఆ భారం తట్టుకోలేక తక్కువ అద్దె ఉన్న ఇంటికి మారిపోవాల్సిన పరిస్థితి ఉండేదట. ముగ్గురు అమ్మాయిలున్న తమ కుటుంబాన్ని పోషించడానికి తన తల్లి ఇరుగు పొరుగు మహిళల చీరలకు పాల్స్ అవీ కుట్టేదట. ఇంకా అనేక రకాలుగా తాము ఇబ్బందులు పడ్డట్లు ఓ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించిందామె.

హైదరాబాద్‌లో ఆర్డినరీ బస్సులతో పోలిస్తే మెట్రో బస్సుల్లో 50 పైసలు ఛార్జీ ఎక్కువుండేదని.. ఆ యాభై పైసలు మిగల్చడం కోసం తాను రెండు బస్టాపులు నడిచి వెళ్లేదాన్నని అనసూయ వెల్లడించింది. ఇక సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్రను డబ్బు కోసం ఎంచుకున్నారా, పాత్ర నచ్చి చేశారా అని అడిగితే.. తనకు డబ్బులే కావాలనుకుంటే టీవీ ఫీల్డ్ కావాల్సినంత ఇస్తోందని.. పాత్ర నచ్చే ఆ సినిమా చేశానని అనసూయ వెల్లడించింది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్ ఎందుకు జరుగుతుంటుందని అడిగితే.. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పాట కోసం తనను అడిగితే నో చెప్పిన విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించడం మొదలు ఇలాగే జరుగుతోందని ఆమె అంది. తన జీవితంలో ఎక్కువగా థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తి అంటే.. అడివి శేషే అని చెప్పిన అనసూయ.. వార్నింగ్ ఇవ్వాల్సి వస్తే మాత్రం సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసేవాళ్లకు ఇస్తానని ఆమె అంది.

This post was last modified on August 19, 2020 10:38 am

Share
Show comments
Published by
satya
Tags: Anasuya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

7 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

8 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

9 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

9 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

10 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

12 hours ago