Movie News

అనసూయ 50 పైసల కోసం రెండు బస్టాపులు నడిచి..

అనసూయ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యాంకర్లలో ఒకరు. నంబర్ వన్ యాంకర్ సుమకు దీటుగా పారితోషకం తీసుకుంటుంది అనసూయ. టీవీల్లో జబర్దస్త్ సహా పలు కార్యక్రమాల్లో ఆమె సందడి చేస్తుంటుంది. దీనికి తోడు సినిమాల్లోనూ ఆమెకు అవకాశాలందుతున్నాయి. ఇలా రెండు చేతులా సంపాదిస్తున్న అనసూయ వార్షిక ఆదాయం కోట్లల్లో ఉంటుంది.

ఐతే ఇప్పుడీ స్థితిలో ఉన్న అనసూయ.. ఒకప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులే పడిందట. వారి కుటుంబం అద్దె పెంచినపుడల్లా ఆ భారం తట్టుకోలేక తక్కువ అద్దె ఉన్న ఇంటికి మారిపోవాల్సిన పరిస్థితి ఉండేదట. ముగ్గురు అమ్మాయిలున్న తమ కుటుంబాన్ని పోషించడానికి తన తల్లి ఇరుగు పొరుగు మహిళల చీరలకు పాల్స్ అవీ కుట్టేదట. ఇంకా అనేక రకాలుగా తాము ఇబ్బందులు పడ్డట్లు ఓ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించిందామె.

హైదరాబాద్‌లో ఆర్డినరీ బస్సులతో పోలిస్తే మెట్రో బస్సుల్లో 50 పైసలు ఛార్జీ ఎక్కువుండేదని.. ఆ యాభై పైసలు మిగల్చడం కోసం తాను రెండు బస్టాపులు నడిచి వెళ్లేదాన్నని అనసూయ వెల్లడించింది. ఇక సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్రను డబ్బు కోసం ఎంచుకున్నారా, పాత్ర నచ్చి చేశారా అని అడిగితే.. తనకు డబ్బులే కావాలనుకుంటే టీవీ ఫీల్డ్ కావాల్సినంత ఇస్తోందని.. పాత్ర నచ్చే ఆ సినిమా చేశానని అనసూయ వెల్లడించింది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్ ఎందుకు జరుగుతుంటుందని అడిగితే.. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పాట కోసం తనను అడిగితే నో చెప్పిన విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించడం మొదలు ఇలాగే జరుగుతోందని ఆమె అంది. తన జీవితంలో ఎక్కువగా థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తి అంటే.. అడివి శేషే అని చెప్పిన అనసూయ.. వార్నింగ్ ఇవ్వాల్సి వస్తే మాత్రం సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసేవాళ్లకు ఇస్తానని ఆమె అంది.

This post was last modified on August 19, 2020 10:38 am

Share
Show comments
Published by
Satya
Tags: Anasuya

Recent Posts

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

44 minutes ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

3 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

5 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

5 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

6 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

14 hours ago