ఆరెక్స్ 100తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్టు కోసం ఎదురు చూస్తున్న హీరో కార్తికేయ కొత్త సినిమా బెదురులంక 2012. షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ సరైన విడుదల తేదీ కోసం వాయిదాల మీద వాయిదాలు తిన్న ఈ విలేజ్ ఎంటర్ టైనర్ ఆగస్ట్ 25 విడుదలకు రెడీ అవుతోంది. క్లాక్స్ దర్శకత్వం వహించగా మణిశర్మ సంగీతం సమకూర్చారు. డీజే టిల్లుతో వెలుగులోకి వచ్చి ఇటీవలే రూల్స్ రంజన్ చూసేయ్ చూసేయ్ పాటతో సోషల్ మీడియా జనాల్లో బాగా నానుతున్న నేహా శెట్టి ఇందులో హీరోయిన్. ఇందాకే ట్రైలర్ లాంఛనం పూర్తి చేశారు.
కథ మొత్తం చెప్పేశారు. 2012 సంవత్సరం. చుట్టూ నీళ్లు ఉండే ఒక ద్వీపం లాంటి ఊరు బెదురులంక. సిటీలో ఉంటూ సెలవుల కాలక్షేపానికి అక్కడికి వస్తాడు శివశంకర వరప్రసాద్(కార్తికేయ). చిన్ననాటి స్నేహితురాలి(నేహా శెట్టి)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. యుగాంతం వస్తుందని టీవీ ఛానల్స్ హోరెత్తించడంతో జనాలు భయపడిపోతారు. దీన్నే అదనుగా తీసుకున్న ఊరి పెద్ద మనుషులు వాళ్ళ అమాయకత్వాన్ని స్వార్థానికి వాడుకోవడానికి తెర తీస్తారు. మత పెద్దలు రంగంలోకి దిగి వ్యాపారం మొదలెడతారు. దీనికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకుంటాడు శివ. అదెలానేదే స్టోరీ
కాన్సెప్ట్ సీరియస్ గా అనిపిస్తున్నా ప్రెజెంటేషన్ మాత్రం వినోదాత్మకంగానే అనిపిస్తోంది. చివరి గంట యాక్షన్లు ఎమోషన్లు పెట్టేసి మిగిలిదంతా నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు దర్శకుడు క్లాక్స్. కార్తికేయకు అలవాటైన పాత్రే. నేహా శెట్టి గ్లామర్ డోస్ ఇందులోనూ వాడుకున్నారు. అజయ్ ఘోష్, గోపరాజు రమణ, ఎల్బి శ్రీరామ్, సత్య, ఆటో రాంప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి చిన్నా పెద్ద ఆర్టిస్టులందరినీ పెట్టేశారు. మణిశర్మ బిజిఎం, సాయి ప్రకాష్ – సన్నీ ఛాయాగ్రహణం బాగానే కుదిరాయి. వరుణ్ తేజ్ గాండీవధారి అర్జునతో పోటీ పడబోతున్న బెదురులంక ట్రైలర్ పరంగా పాజిటివ్ గానే ఉంది మరి
This post was last modified on August 16, 2023 4:59 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…