సోషల్ మీడియా కాలంలో నిజం నింపాదిగా నిద్ర లేచే లోపు అబద్దం సిటీ మొత్తం అయిదారు రౌండ్లు కొట్టేస్తుంది. ఇది సినిమా రంగానికి ఎక్కువ వర్తిస్తుంది. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భగవంత్ కేసరి అప్పుడెప్పుడో వచ్చిన హరికృష్ణ స్వామి స్ఫూర్తితో ఉంటుందని ఒక మీమ్ ఎవరో వదిలితే అది తక్కువ వ్యవధిలోనే వైరల్ అయిపోయింది. స్వామి ఒక కవల ఆడపిల్లల హత్యకు రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఆ టైంలోనే పెద్దగా ఆడలేదు. అలాంటిది తీసుకొచ్చి అనిల్ కొత్తగా వండుకుంటాడంటే అంతకంటే కామెడీ వేరొకటి ఉండదు.
క్రమంగా ఈ న్యూస్ ఎక్కువగా పాకిపోవడంతో స్వయంగా నిర్మాణ సంస్థే అలాంటిదేమి లేదని, ఇది పూర్తిగా కొత్త కథని ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. భగవంత్ కేసరిలో బాలయ్య మధ్య వయసు దాటిన ఏజ్డ్ లుక్ తో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇదే ప్రధాన హైలైట్ గా ఉంటుందని టీమ్ ముందు నుంచి ఊరిస్తోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ అయితే మరి శ్రీలీలకు బాలకృష్ణకు పాత్ర పరంగా ఎలాంటి సంబంధం ఉంటుందనే దాని మీద పెద్దగా లీకులు లేవు. ఫ్రెండ్ కూతురనే టాక్ అయితే ఉంది ట్రైలర్ వచ్చాక ఏమైనా క్లారిటీ రావొచ్చు
అక్టోబర్ 19న విడుదల కాబోతున్న భగవంత్ కేసరికి భారీ బిజినెస్ ఆఫర్స్ జరుగుతున్నాయి. ఇంకా క్లోజ్ చేయలేదు కానీ ట్రేడ్ చెబుతున్న దాని ప్రకారం ఈసారి వీరసింహారెడ్డి కంటే ఎక్కువగా రేట్ పలుకుతుందని అంటున్నారు. హీరో డైరెక్టర్ కాంబినేషన్ క్రేజీగా ఉండటంతో ఆ మేరకు అంచనాలు ఓ రేంజ్ లో పెరుగుతున్నాయి. దసరా పండక్కు విజయ్ లియో,రవితేజ టైగర్ నాగేశ్వరరావుతో పోటీ పడబోతున్న బాలయ్య ఈసారి సంక్రాంతి కాకపోయినా మాస్ పవర్ చూపిస్తాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. విలన్ గా అర్జున్ రామ్ పాల్ దీంతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
This post was last modified on August 15, 2023 1:24 pm
మనమేదో ఆహా ఓహో అంటూ ఛాన్స్ దొరికినప్పుడంతా మలయాళం సినిమాలను తెగ పొగిడేస్తూ ఉంటాం కాని అక్కడి దర్శకులు కూడా…
టికెట్ రేటు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ.. మల్టీప్లెక్సుల్లోనే సినిమాలు చూద్దాం అనుకునే ప్రేక్షకులు పెరిగిపోయారు గత కొన్నేళ్లలో. దాని…
వైసీపీ అధినేత జగన్ పర్యటనల్లో భాగంగా ఇటీవల కాలంలో `రప్పా-రప్పా` డైలాగులు తరచుగా వినిపించేవి. రప్పా-రప్పా అని రాసున్న బ్యానర్లు,…
వరుణ్ తేజ్ ప్రస్తుతం మనసులో అనుకుంటున్న మాట ఇదే. కొరియన్ కనకరాజుకి ఒక రోజు ముందే ప్రీమియర్లు వేయడం రిస్కని…
పురాణ గాథలను తెరకెక్కించేటపుడు ఎన్నో ఇబ్బందులుంటాయి. అప్పటి వాతావరణాన్ని తెరపైకి తీసుకురావడం అంత తేలిక కాదు. ప్రతి చిన్న విషయం…
వైసీపీ అధినేత జగన్ తాజాగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించారు. ఇక్కడి పొగాకు రైతులను ఆయన పరామర్శించారు. తొలుత…