అదేంటో కొన్ని కాకతాళీయ సంఘటనలు, లింకులు విచిత్రంగా అనిపించినా నమ్మేలా ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. టాలీవుడ్ లోనే అత్యంత అదృష్టవంతుడయిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మెహర్ రమేష్ తన ట్రాక్ రికార్డుని భద్రంగా కొనసాగించాడు. అయితే దీనికి క్రికెట్ కి సంబంధం ఏమనుకుంటున్నారా. అక్కడికే వద్దాం. 2011లో శక్తి తీసినప్పుడు అదెంత కళాఖండంగా నిలబడిపోయిందో నిద్రలో అడిగినా తారక్ ఫ్యాన్స్ చెబుతారు. అదే ఏడాది సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇండియాకు ఎంఎస్ ధోని వన్ డేలో వరల్డ్ కప్ తీసుకొచ్చి దేశమంతా సంబరాలు నింపాడు.
2013లో వెంకటేష్ షాడో వచ్చింది. ఇదింకో మాస్టర్ పీస్. దగ్గుబాటి అభిమానులే బాబోయ్ అనుకున్నారు. ఈ సంవత్సరమే మన టీమ్ ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని సగర్వంగా అందుకుంది. ఆ క్షణాలను క్రీడా ప్రేమికులు మర్చిపోలేరు. కట్ చేస్తే ఇప్పుడు 2013లో భోళా శంకర్ తో మెహర్ ఫలితాన్ని మళ్ళీ రిపీట్ చేశాడు. తీరా చూస్తే ఇంకో రెండు నెలల్లో మన దేశంలోనే వరల్డ్ కప్ జరుగుతోంది. అంటే ఈసారి కూడా హిస్టరీని రిపీట్ చేస్తూ మనం ప్రపంచ కప్ సాధించవచ్చనే ఒక విచిత్రమైన అనాలసిస్ ని క్రికెట్ లవర్స్ తీసుకొచ్చారు. వినడానికి నవ్వులాటగా ఉన్నా ఇదంతా నిజమేగా.
ఒకవేళ అన్నంత పనీ జరిగిపోతే మాత్రం షాక్ తప్పదు. వీటి సంగతి పక్కన పెడితే పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని మెహర్ రమేష్ చేతులారా వృథా చేసుకున్నాడు. దీని వల్ల ఇంకో హీరో ఛాన్స్ ఇవ్వడం కలే. కీర్తి సురేష్, తమన్నాలతో ప్లాన్ చేసుకున్న ఫిమేల్ ఓరియెంటెడ్ కథ కూడా అటకెక్కినట్టే. భోళా శంకర్ దెబ్బకు పైన చెప్పిన రెండు డిజాస్టర్ల రికార్డులు సేఫ్ అయ్యాయంటే మెగాస్టార్ కి ఎంత పెద్ద షాక్ కొట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఏది ఎలా ఉన్నా ఈ సెంటిమెంట్ నిజంగా పని చేస్తే మంచిదే. ఇంకో వరల్డ్ కప్ మన ఖాతాలో పడిపోతుంది.
This post was last modified on August 14, 2023 12:20 am
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…