అదేంటో కొన్ని కాకతాళీయ సంఘటనలు, లింకులు విచిత్రంగా అనిపించినా నమ్మేలా ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. టాలీవుడ్ లోనే అత్యంత అదృష్టవంతుడయిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మెహర్ రమేష్ తన ట్రాక్ రికార్డుని భద్రంగా కొనసాగించాడు. అయితే దీనికి క్రికెట్ కి సంబంధం ఏమనుకుంటున్నారా. అక్కడికే వద్దాం. 2011లో శక్తి తీసినప్పుడు అదెంత కళాఖండంగా నిలబడిపోయిందో నిద్రలో అడిగినా తారక్ ఫ్యాన్స్ చెబుతారు. అదే ఏడాది సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇండియాకు ఎంఎస్ ధోని వన్ డేలో వరల్డ్ కప్ తీసుకొచ్చి దేశమంతా సంబరాలు నింపాడు.
2013లో వెంకటేష్ షాడో వచ్చింది. ఇదింకో మాస్టర్ పీస్. దగ్గుబాటి అభిమానులే బాబోయ్ అనుకున్నారు. ఈ సంవత్సరమే మన టీమ్ ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని సగర్వంగా అందుకుంది. ఆ క్షణాలను క్రీడా ప్రేమికులు మర్చిపోలేరు. కట్ చేస్తే ఇప్పుడు 2013లో భోళా శంకర్ తో మెహర్ ఫలితాన్ని మళ్ళీ రిపీట్ చేశాడు. తీరా చూస్తే ఇంకో రెండు నెలల్లో మన దేశంలోనే వరల్డ్ కప్ జరుగుతోంది. అంటే ఈసారి కూడా హిస్టరీని రిపీట్ చేస్తూ మనం ప్రపంచ కప్ సాధించవచ్చనే ఒక విచిత్రమైన అనాలసిస్ ని క్రికెట్ లవర్స్ తీసుకొచ్చారు. వినడానికి నవ్వులాటగా ఉన్నా ఇదంతా నిజమేగా.
ఒకవేళ అన్నంత పనీ జరిగిపోతే మాత్రం షాక్ తప్పదు. వీటి సంగతి పక్కన పెడితే పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని మెహర్ రమేష్ చేతులారా వృథా చేసుకున్నాడు. దీని వల్ల ఇంకో హీరో ఛాన్స్ ఇవ్వడం కలే. కీర్తి సురేష్, తమన్నాలతో ప్లాన్ చేసుకున్న ఫిమేల్ ఓరియెంటెడ్ కథ కూడా అటకెక్కినట్టే. భోళా శంకర్ దెబ్బకు పైన చెప్పిన రెండు డిజాస్టర్ల రికార్డులు సేఫ్ అయ్యాయంటే మెగాస్టార్ కి ఎంత పెద్ద షాక్ కొట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఏది ఎలా ఉన్నా ఈ సెంటిమెంట్ నిజంగా పని చేస్తే మంచిదే. ఇంకో వరల్డ్ కప్ మన ఖాతాలో పడిపోతుంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…