ఇంకా విడుదలకు బోలెడు టైం ఉన్నప్పటికీ 2024 ఏప్రిల్ 5 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ కీలక దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఎలాంటి ఒత్తిడి లేకుండా పక్కా ప్లానింగ్ తో కొరటాల శివ, తారక్ ఎట్టి పరిస్థితుల్లో డేట్ మిస్ కాకూడదనే టార్గెట్ తో ఉన్నారు. అనిరుద్ రవిచందర్ పాటలు ఇవ్వడం, రీ రికార్డింగ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఆలోగా యాక్షన్ ఎపిసోడ్స్, టాకీ పార్ట్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వాటి పోస్ట్ ప్రొడక్షన్ ని ఎలాంటి విఘ్నాలు లేకుండా జరిపించేస్తున్నారు.
ఇంత ముందుగా డేట్ ని బ్లాక్ చేసుకున్నప్పటికీ దేవర చుట్టూ పోటీ మేఘాలు కమ్ముకునేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో రూపొందుతున్న ఓజి ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ఈ ఏడాది డిసెంబర్ లో రావొచ్చనే వార్త వట్టి పుకారేనని తేలిపోయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నిర్మాత డివివి దానయ్య దీన్ని ఏప్రిల్ బరిలో దించాలని చూస్తున్నారట. అయితే ఎన్నికల వేడిలో పవన్ బిజీగా ఉంటాడు కాబట్టి ఆలోగా డబ్బింగ్ తో సహా మొత్తం ఫినిష్ చేసి రెడీగా ఉంచాలనే సూచన మేరకు షెడ్యూల్స్ ఆ రీతిలోనే ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. కాకపోతే తేదీ లాక్ చేయలేదు.
ఇక అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వస్తున్న పుష్ప 2 ది రూల్ సైతం సమ్మర్ నే అందులోనూ ఏప్రిల్ వైపే చూస్తోందట. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. నార్త్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి విడుదల తేదీ చెప్పమని ఒత్తిడి వస్తోంది. ఇది క్లారిటీ ఇస్తేనే భారీగా అడ్వాన్సులు వచ్చి పడతాయి. పైగా బాలీవుడ్ రిలీజులతో క్లాష్ లేకుండా జాగ్రత్తగా పడాలంటే ముందుగా కర్చీఫ్ వేసుకోవాల్సిందే. ఈ నెలాఖరున ప్రకటించబోయే నాగార్జున కొత్త మూవీ సైతం వేసవికే ఫిక్స్ చేస్తారట. సూర్య కంగువా, కమల్ హాసన్ ఇండియన్ 2 లు కూడా ఇదే నెల మీద కన్నేశాయి. చూడాలి ఏమేం జరగనుందో.
This post was last modified on August 13, 2023 2:34 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…