జైలర్ విజయంలో స్పెషల్ క్యామియోలు ఎంత కీలక పాత్ర పోషించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా శివ రాజ్ కుమార్ పంచెకట్టుతో కేవలం అయిదు నుంచి పది నిమిషాల మధ్యే కనిపించినా దాని ఇంపాక్ట్ మాత్రం ప్రేక్షకుల్లో బలంగా ఉందని సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే అర్థమైపోయింది. కర్ణాటక రాష్ట్రం మాండ్య పట్టణంలో ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసే పవర్ ఫుల్ నరసింహా క్యారెక్టర్ లో ఆయనకు చాలా తక్కువ డైలాగులు పెట్టారు . చివరి సీన్ లో కేవలం చుట్ట వెలిగించి థియేటర్లను షేక్ చేశారు. నిజానికి శాండల్ వుడ్ లో ఈయనో పెద్ద స్టార్.
కానీ బయట రాష్ట్రాల వాళ్లకు తెలిసింది తక్కువ. అందుకే శివరాజ్ కుమార్ పాత సినిమాలు చూసేందుకు ఫ్యాన్స్ వెతుకులాట మొదలుపెట్టారు. వాళ్లకు కొన్ని షాకింగ్ సంగతులు తెలుస్తున్నాయి. ఇండియాలోనే అయిదు వందలసార్లకు పైగా రీ రిలీజ్ జరుపుకున్న ఓం హీరో ఈయనే. దీన్నే తెలుగులో రాజశేఖర్ తో రీమేక్ చేశారు. దర్శకుడిగా ఉపేంద్ర సత్తా ప్రపంచానికి తెలిసింది ఈ బ్లాక్ బస్టర్ తోనే. ప్రభాస్ ఏరికోరి ముచ్చటపడి నటించిన యోగి ఒరిజినల్ వెర్షన్ జోగి కథానాయకుడు శివరాజ్ కుమారే. ఇప్పటికీ దాని పేరు మీద రికార్డులు అక్కడ భద్రంగా ఉన్నాయి.
బాలకృష్ణతో శివరాజ్ కుమార్ తో చాలా స్నేహం ఉంది. గౌతమీపుత్ర శాతకర్ణిలో అడగ్గానే బుర్రకథ పాటలో నటించానికి ఒప్పుకుని పారితోషికం తీసుకోకుండా చేశారు. ఇప్పుడీ జైలర్ వల్ల ఆయన్ను దృష్టిలో పెట్టుకుని క్యామియోలు రాస్తున్న దర్శకులు ఉన్నారట. వీరసింహారెడ్డిలో బాలయ్య పంచె గెటప్ ని శివరాజ్ కుమార్ మఫ్టీలో నుంచి తీసుకునే స్ఫూర్తి చెందామని బాలయ్య ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్ని నిముషాలు కనిపించాం అన్నది కాదు ఆడియన్స్ కి ఎంతలా గుర్తుండిపోయామన్నది ముఖ్యమనే పోకిరి పండులా నరసింహ నిలిచిపోయేలా ఉన్నాడు. అన్నట్టు ఇంత చర్చ మోహన్ లాల్ గురించి జరగకపోవడం ఫైనల్ ట్విస్టు.
This post was last modified on August 12, 2023 4:04 pm
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…