దక్షిణాది అతి పెద్ద మెగాస్టార్, సూపర్ స్టార్ సినిమాల్లో అవకాశం దక్కించుకోవడమంటే చిన్న విషయం కాదు. కీర్తి సురేష్ కి ఆ అదృష్టం దక్కింది. అయితే ఒకపక్క ఆనందపడుతూనే మరోపక్క దిగులు చెందేలా వాటి ఫలితాలు కలవరపెడుతున్నాయి. రజనీకాంత్ అన్నాతే (పెద్దన్న) ఎంత దారుణమైన డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాంట్లో సెంటిమెంట్ సీన్లు బాగానే వచ్చినా దర్శకుడు సిరుతై శివ తీసుకున్న అవుట్ డేటెడ్ కథా కథనాలు జనం థియేటర్ నుంచి పారిపోయేలా చేశాయి. దీంతో తలైవర్ తో నటించిన అనుభవం కీర్తికి సురేష్ కి బ్యాడ్ మెమరీగా నిలిచిపోయింది.
తాజాగా భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలిగా మరోసారి అలాంటి పాత్రే దక్కింది. స్క్రీన్ మీదే కాదు బయట కూడా వీళ్ళ బాండింగ్ చాలా క్యూట్ గా ఉండటం ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రేక్షకులు చూశారు. కట్ చేస్తే ఇప్పుడదే రిజల్ట్ మళ్ళీ రిపీట్ అయ్యింది. కనీసం ఏవరేజ్ అనిపించుకున్నా కొంత ఊరట దక్కేది కానీ పెద్దన్నకు ఏ మాత్రం తీసిపోని రీతీలో భోళా తిరస్కారానికి గురైంది. దీంతో ఇద్దరికీ తక్కువ గ్యాప్ లో చెల్లెలుగా యాక్ట్ చేసినందుకు సంతోషపడాలో లేక జీవితాంతం గుర్తుండిపోయేలా ఫ్లాప్ అయినందుకు బాధ పడాలో తనకే అర్థం కాకపోవడం సహజం.
పెర్ఫార్మన్స్ పరంగా కీర్తి సురేష్ ఈ రెండు సినిమాల్లో బాగానే నటించింది. కానీ తనలో మహానటిని ఆవిష్కరించే కోణం కథలు డిమాండ్ చేయలేదు. అందుకే చెప్పుకోదగ్గ స్థాయిలో ఇవి రాలేదు. గతంలో రజని, చిరులతో ఇలా ఏక కాలంలో సోదరిగా నటించిన దాఖలాలు దాదాపుగా లేనట్టుగానే కనిపిస్తున్నాయి. ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ళ క్రితం కొందరు చేసి ఉండొచ్చు కానీ కేవలం రెండేళ్ల గ్యాప్ తో ఆ ఛాన్స్ కొట్టేసింది మాత్రం కీర్తి సురేష్. దెబ్బకు ఇకపై సీనియర్ హీరోలు ఎవరైనా తనను చెల్లిగా పెట్టి రిస్క్ చేయడం కంటే హీరోయిన్ గా తీసుకుంటేనే బెటరనుకుంటారేమో. సెంటిమెంట్ మహత్యం మరి.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…