నిన్న విడుదలైన భోళా శంకర్ ఫలితం ఎన్నో పరిణామాలకు దారి తీస్తోంది. రిజల్ట్ ఏమైంది, ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారనే వాస్తవాలు చిరంజీవి దాకా ఎవరైనా తీసుకెళ్తున్నారో లేదో కానీ అభిమానుల ఘోష మాత్రం ఓ రేంజ్ లో ఉంది. చుట్టూ భజన బృందాల మాటలు నమ్మేసి సినిమాలు చేయడం వల్ల నిర్మాతల నష్టాల సంగతి తర్వాత ముందు తమ బాధ చూడమని సోషల్ మీడియా వేదికపై రకరకాలుగా వెళ్లబోసుకుంటున్నారు. ఇప్పుడిది నేరుగా నెక్స్ట్ మెగాస్టార్ తో చేయబోయే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మీద పడింది. ఈ నెలలోనే దీని ప్రకటన రానున్న సంగతి తెలిసింది.
ఇక్కడ సమస్య ఏంటంటే కళ్యాణ్ కృష్ణ సైతం భీభత్సమైన ఫామ్ లో లేడు. ఒక్క సోగ్గాడే చిన్ని నాయనతోనే బండి నెట్టుకొస్తున్నాడు. బంగార్రాజు కమర్షియల్ బాగానే ఆడింది కానీ అదేమీ మొదటి భాగమంత రేంజ్ కాదని నాగ్ ఫ్యాన్సే ఒప్పుకుంటారు. చైతుతో చేసిన రారండోయ్ వేడుక చూద్దాం హిట్టు స్టాంప్ తో బయటపడగా రవితేజ నేల టికెట్టు దారుణంగా బోల్తా కొట్టింది. ఇలాంటి ట్రాక్ రికార్డుతో కళ్యాణ్ కృష్ణకు మెగా ఆఫర్ వచ్చింది. ఇది కూడా ఒకప్పుడు చిరు ఇచ్చిన కమిట్ మెంట్లలో భాగంగా ఇప్పుడు తీరుస్తున్నదే తప్ప కొత్తగా కథ నచ్చో కాంబో కుదిరో చేస్తున్నది కాదు.
అసలే ఇది మలయాళం బ్రో డాడీ రీమేక్ అనే ప్రచారం విపరీతంగా ఉంది. ఇది మన ఆడియన్స్ కి ఎంత మాత్రం సూటవ్వని పాయింట్ తో ఉంటుంది. దాన్ని చిరు చేయడమంటే రిస్కే. కానీ ఇది పూర్తిగా వేరే సబ్జెక్టని, ప్రసన్న కుమార్ ఫ్రెష్ గా రాసిచ్చారని టీమ్ అంటోంది. నిజాలు తేలాలంటే కొంత టైం పడుతుంది. ఈలోగా స్క్రిప్ట్ ని మరోసారి పూర్తిగా వడబోసి చెక్ చేసుకోవడం చాలా అవసరం. కేవలం చిరు ఇమేజ్ ని నమ్ముకుని ఏది బడితే అది రాసుకుంటే ఏం జరుగుతోందో మెహర్ రమేష్ చూపించేశాడు. అందుకే కళ్యాణ్ కృష్ణ మీద ఆల్రెడీ ఉన్నబీ బరువు కాస్తా బండెడుగా మారిపోయింది.
This post was last modified on August 12, 2023 10:38 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…