చెప్పాపెట్టకుండా, ఎలాంటి హడావిడి చేయకుండా నిన్న ఆగస్ట్ 11 అర్ధరాత్రి నుంచి ఆదిపురుష్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేయడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది. ఆరు వందల కోట్ల బడ్జెట్ తో తీసిన గ్రాండియర్ కాబట్టి సోషల్ మీడియాలో భారీ పబ్లిసిటీ ఉంటుందని అభిమానులు ఆశించారు. కానీ అదేమీ జరగలేదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలు ప్రైమ్ లో రాగా ఒక్క హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చారు. అన్నీ ఒకే సమయంలో అందుబాటులోకి వచ్చాయి. ఇలా సైలెంట్ గా రిలీజ్ చేయడానికి కారణాలు కోణాలు ఉన్నాయి.
వాటికన్నా ముందు చెప్పాల్సిన పాయింట్ మరొకటి ఉంది. ప్రైమ్ లో ఆదిపురుష్ వచ్చింది చూడమని ట్వీట్ చేసిన దర్శకుడు ఓం రౌత్ దాని కింద కామెంట్స్ సెక్షన్ ని డిజేబుల్ చేశారు. ఆయన అంగీకరించిన స్నేహితులు, ఫాలోయర్లు తప్ప ఎవరూ మెసేజ్ పెట్టలేరు. ఇది ట్రోలింగ్ ప్రభావమే. థియేటర్లలో రిలీజైనప్పుడే విపరీతమైన విమర్శలకు గురైన ఆదిపురుష్ కి ఇంకా కోర్టు గొడవలు తీరిపోలేదు. అరకొర కేసులు నడుస్తూనే ఉన్నాయి. వాటి మీద అతి దగ్గరలో ఎంతో కొంత స్టే వచ్చే ప్రమాదం ఉండటంతో గుట్టుచప్పుడు కాకుండా ఓటిటిలో వదిలేశారని ముంబై వర్గాల కథనం.
పైగా ఇప్పుడు హెచ్డి ప్రింట్ తో ఆదిపురుష్ దొరికింది కాబట్టి సహజంగానే సీన్లు, వీడియోలతో యాంటీ ఫ్యాన్స్ విరుచుకుపడతారు. దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేకపోయినా అనవసర టాపిక్స్ కి వైరల్ కావడానికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అయినా తాను తీసిన కంటెంట్ మీద అంత నమ్మకంగా ఉన్నప్పుడు ఓం రౌత్ కామెంట్స్ ని ఓపెన్ గా పెట్టి ఉండాల్సిందని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. అయినా జరిగిపోయిన పెళ్లికి ఇప్పుడు బాజాలు ఎందుకని రెండు నెలల క్రితం వచ్చి వెళ్ళిపోయిన సినిమాకి చర్చ అవసరం లేదు కానీ ట్రోలింగే పనిగా పెట్టుకున్న బ్యాచులు ఊరికే ఉండవుగా.
This post was last modified on August 11, 2023 11:14 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…