Movie News

కొత్త ట్రోలింగుకి భయపడ్డ ఆదిపురుష్ దర్శకుడు

చెప్పాపెట్టకుండా, ఎలాంటి హడావిడి చేయకుండా నిన్న ఆగస్ట్ 11 అర్ధరాత్రి నుంచి ఆదిపురుష్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేయడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది. ఆరు వందల కోట్ల బడ్జెట్ తో తీసిన గ్రాండియర్ కాబట్టి  సోషల్ మీడియాలో భారీ పబ్లిసిటీ ఉంటుందని అభిమానులు ఆశించారు. కానీ అదేమీ జరగలేదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలు ప్రైమ్ లో రాగా ఒక్క హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చారు. అన్నీ ఒకే సమయంలో అందుబాటులోకి వచ్చాయి. ఇలా సైలెంట్ గా రిలీజ్ చేయడానికి కారణాలు కోణాలు ఉన్నాయి.

వాటికన్నా ముందు చెప్పాల్సిన పాయింట్ మరొకటి ఉంది. ప్రైమ్ లో ఆదిపురుష్ వచ్చింది చూడమని ట్వీట్ చేసిన దర్శకుడు ఓం రౌత్ దాని కింద కామెంట్స్ సెక్షన్ ని డిజేబుల్ చేశారు. ఆయన అంగీకరించిన స్నేహితులు, ఫాలోయర్లు తప్ప ఎవరూ మెసేజ్ పెట్టలేరు. ఇది ట్రోలింగ్ ప్రభావమే. థియేటర్లలో రిలీజైనప్పుడే విపరీతమైన విమర్శలకు గురైన ఆదిపురుష్ కి ఇంకా కోర్టు గొడవలు తీరిపోలేదు. అరకొర కేసులు నడుస్తూనే ఉన్నాయి. వాటి మీద అతి దగ్గరలో ఎంతో కొంత స్టే వచ్చే ప్రమాదం ఉండటంతో గుట్టుచప్పుడు కాకుండా ఓటిటిలో వదిలేశారని ముంబై వర్గాల కథనం.

పైగా ఇప్పుడు హెచ్డి ప్రింట్ తో ఆదిపురుష్ దొరికింది కాబట్టి సహజంగానే సీన్లు, వీడియోలతో యాంటీ ఫ్యాన్స్ విరుచుకుపడతారు. దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేకపోయినా అనవసర టాపిక్స్ కి వైరల్ కావడానికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అయినా తాను తీసిన కంటెంట్ మీద అంత నమ్మకంగా ఉన్నప్పుడు ఓం రౌత్ కామెంట్స్ ని ఓపెన్ గా పెట్టి ఉండాల్సిందని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. అయినా జరిగిపోయిన పెళ్లికి ఇప్పుడు బాజాలు ఎందుకని రెండు నెలల క్రితం వచ్చి వెళ్ళిపోయిన సినిమాకి చర్చ అవసరం లేదు కానీ ట్రోలింగే పనిగా పెట్టుకున్న బ్యాచులు ఊరికే ఉండవుగా.

This post was last modified on August 11, 2023 11:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago