సోషల్ మీడియాలో ఈ మధ్య డిజాస్టర్ సినిమాలపై మాస్ ట్రోలింగ్ జరుగుతుంది. ఆ వీడియోస్ చూస్తూ జనాలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మధ్య చిరంజీవి ఆచార్య పై గట్టి ట్రోల్ వీడియోస్ వచ్చాయి. పాదఘట్టం అంటూ ఫన్నీ వీడియోస్ క్రియేట్ చేసి కొరటాల , చిరంజీవిలతో మీమర్స్ సోషల్ మీడియాలో జనాలకి మంచి ఎంటర్టైన్ మెంట్ ఇచ్చారు. ఏజెంట్ , లైగర్ వంటి డిజాస్టర్స్ ను కూడా గట్టిగా ట్రోల్ చేసి వదిలారు.
ఇక మెహర్ పుణ్యమా అని ఇప్పుడు చిరు సినిమాకి మళ్ళీ మాస్ ట్రోలింగ్ జరుగుతుంది. ‘భోళా’ మొదటి రోజు మార్నింగ్ షోతోనే నిరాశ పరచడంతో మెహర్ తో ఈ సినిమాను చేసిన చిరును గట్టిగా విమర్శిస్తున్నారు ఫ్యాన్స్. అంతే కాదు భోళా శంకర్ థియేటర్స్ లో నుండి బయటికి వచ్చేశాం అంటూ అసెంబ్లీ నుండి బయటికి వెళ్లిపోతున్న జగన్ వీడియోస్ లాంటివి పోస్ట్ చేస్తున్నారు.
మెహర్ రమేష్ ను మెగా ఫ్యాన్స్ సైతం ఒక ఆట ఆడుకుంటున్నారు. చిరు మంచి అవకాశం ఇస్తే దాన్ని చేజేతులారా పాడుచేసుకున్నాడని మెగా అభిమానులు ఆగ్రహం చూపిస్తున్నారు. మెహర్ పై వస్తున్న ట్రోలింగ్ వీడియోస్ నెటిజన్లకి మంచి ఎంటర్టైన్ మెంట్ అందిస్తున్నాయి. ఏదేమైనా ఈరోజుల్లో హిట్టయిన విరూపాక్ష లాంటి సినిమాలనే రిలీజ్ తర్వాత శాసనాల గ్రంధం అంటూ చాలా ట్రోల్ చేశారు. మరి డిజాస్టర్ ను ఎలా వదిలేస్తారు ? ఏదేమైనా మెహర్ రమేష్ భోళా తో ట్రోలర్స్ కి గట్టిగా దొరికేసినట్టే.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…