సోషల్ మీడియాలో ఈ మధ్య డిజాస్టర్ సినిమాలపై మాస్ ట్రోలింగ్ జరుగుతుంది. ఆ వీడియోస్ చూస్తూ జనాలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మధ్య చిరంజీవి ఆచార్య పై గట్టి ట్రోల్ వీడియోస్ వచ్చాయి. పాదఘట్టం అంటూ ఫన్నీ వీడియోస్ క్రియేట్ చేసి కొరటాల , చిరంజీవిలతో మీమర్స్ సోషల్ మీడియాలో జనాలకి మంచి ఎంటర్టైన్ మెంట్ ఇచ్చారు. ఏజెంట్ , లైగర్ వంటి డిజాస్టర్స్ ను కూడా గట్టిగా ట్రోల్ చేసి వదిలారు.
ఇక మెహర్ పుణ్యమా అని ఇప్పుడు చిరు సినిమాకి మళ్ళీ మాస్ ట్రోలింగ్ జరుగుతుంది. ‘భోళా’ మొదటి రోజు మార్నింగ్ షోతోనే నిరాశ పరచడంతో మెహర్ తో ఈ సినిమాను చేసిన చిరును గట్టిగా విమర్శిస్తున్నారు ఫ్యాన్స్. అంతే కాదు భోళా శంకర్ థియేటర్స్ లో నుండి బయటికి వచ్చేశాం అంటూ అసెంబ్లీ నుండి బయటికి వెళ్లిపోతున్న జగన్ వీడియోస్ లాంటివి పోస్ట్ చేస్తున్నారు.
మెహర్ రమేష్ ను మెగా ఫ్యాన్స్ సైతం ఒక ఆట ఆడుకుంటున్నారు. చిరు మంచి అవకాశం ఇస్తే దాన్ని చేజేతులారా పాడుచేసుకున్నాడని మెగా అభిమానులు ఆగ్రహం చూపిస్తున్నారు. మెహర్ పై వస్తున్న ట్రోలింగ్ వీడియోస్ నెటిజన్లకి మంచి ఎంటర్టైన్ మెంట్ అందిస్తున్నాయి. ఏదేమైనా ఈరోజుల్లో హిట్టయిన విరూపాక్ష లాంటి సినిమాలనే రిలీజ్ తర్వాత శాసనాల గ్రంధం అంటూ చాలా ట్రోల్ చేశారు. మరి డిజాస్టర్ ను ఎలా వదిలేస్తారు ? ఏదేమైనా మెహర్ రమేష్ భోళా తో ట్రోలర్స్ కి గట్టిగా దొరికేసినట్టే.
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…