సోషల్ మీడియాలో ఈ మధ్య డిజాస్టర్ సినిమాలపై మాస్ ట్రోలింగ్ జరుగుతుంది. ఆ వీడియోస్ చూస్తూ జనాలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మధ్య చిరంజీవి ఆచార్య పై గట్టి ట్రోల్ వీడియోస్ వచ్చాయి. పాదఘట్టం అంటూ ఫన్నీ వీడియోస్ క్రియేట్ చేసి కొరటాల , చిరంజీవిలతో మీమర్స్ సోషల్ మీడియాలో జనాలకి మంచి ఎంటర్టైన్ మెంట్ ఇచ్చారు. ఏజెంట్ , లైగర్ వంటి డిజాస్టర్స్ ను కూడా గట్టిగా ట్రోల్ చేసి వదిలారు.
ఇక మెహర్ పుణ్యమా అని ఇప్పుడు చిరు సినిమాకి మళ్ళీ మాస్ ట్రోలింగ్ జరుగుతుంది. ‘భోళా’ మొదటి రోజు మార్నింగ్ షోతోనే నిరాశ పరచడంతో మెహర్ తో ఈ సినిమాను చేసిన చిరును గట్టిగా విమర్శిస్తున్నారు ఫ్యాన్స్. అంతే కాదు భోళా శంకర్ థియేటర్స్ లో నుండి బయటికి వచ్చేశాం అంటూ అసెంబ్లీ నుండి బయటికి వెళ్లిపోతున్న జగన్ వీడియోస్ లాంటివి పోస్ట్ చేస్తున్నారు.
మెహర్ రమేష్ ను మెగా ఫ్యాన్స్ సైతం ఒక ఆట ఆడుకుంటున్నారు. చిరు మంచి అవకాశం ఇస్తే దాన్ని చేజేతులారా పాడుచేసుకున్నాడని మెగా అభిమానులు ఆగ్రహం చూపిస్తున్నారు. మెహర్ పై వస్తున్న ట్రోలింగ్ వీడియోస్ నెటిజన్లకి మంచి ఎంటర్టైన్ మెంట్ అందిస్తున్నాయి. ఏదేమైనా ఈరోజుల్లో హిట్టయిన విరూపాక్ష లాంటి సినిమాలనే రిలీజ్ తర్వాత శాసనాల గ్రంధం అంటూ చాలా ట్రోల్ చేశారు. మరి డిజాస్టర్ ను ఎలా వదిలేస్తారు ? ఏదేమైనా మెహర్ రమేష్ భోళా తో ట్రోలర్స్ కి గట్టిగా దొరికేసినట్టే.
This post was last modified on August 11, 2023 7:12 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…