సోషల్ మీడియాలో ఈ మధ్య డిజాస్టర్ సినిమాలపై మాస్ ట్రోలింగ్ జరుగుతుంది. ఆ వీడియోస్ చూస్తూ జనాలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మధ్య చిరంజీవి ఆచార్య పై గట్టి ట్రోల్ వీడియోస్ వచ్చాయి. పాదఘట్టం అంటూ ఫన్నీ వీడియోస్ క్రియేట్ చేసి కొరటాల , చిరంజీవిలతో మీమర్స్ సోషల్ మీడియాలో జనాలకి మంచి ఎంటర్టైన్ మెంట్ ఇచ్చారు. ఏజెంట్ , లైగర్ వంటి డిజాస్టర్స్ ను కూడా గట్టిగా ట్రోల్ చేసి వదిలారు.
ఇక మెహర్ పుణ్యమా అని ఇప్పుడు చిరు సినిమాకి మళ్ళీ మాస్ ట్రోలింగ్ జరుగుతుంది. ‘భోళా’ మొదటి రోజు మార్నింగ్ షోతోనే నిరాశ పరచడంతో మెహర్ తో ఈ సినిమాను చేసిన చిరును గట్టిగా విమర్శిస్తున్నారు ఫ్యాన్స్. అంతే కాదు భోళా శంకర్ థియేటర్స్ లో నుండి బయటికి వచ్చేశాం అంటూ అసెంబ్లీ నుండి బయటికి వెళ్లిపోతున్న జగన్ వీడియోస్ లాంటివి పోస్ట్ చేస్తున్నారు.
మెహర్ రమేష్ ను మెగా ఫ్యాన్స్ సైతం ఒక ఆట ఆడుకుంటున్నారు. చిరు మంచి అవకాశం ఇస్తే దాన్ని చేజేతులారా పాడుచేసుకున్నాడని మెగా అభిమానులు ఆగ్రహం చూపిస్తున్నారు. మెహర్ పై వస్తున్న ట్రోలింగ్ వీడియోస్ నెటిజన్లకి మంచి ఎంటర్టైన్ మెంట్ అందిస్తున్నాయి. ఏదేమైనా ఈరోజుల్లో హిట్టయిన విరూపాక్ష లాంటి సినిమాలనే రిలీజ్ తర్వాత శాసనాల గ్రంధం అంటూ చాలా ట్రోల్ చేశారు. మరి డిజాస్టర్ ను ఎలా వదిలేస్తారు ? ఏదేమైనా మెహర్ రమేష్ భోళా తో ట్రోలర్స్ కి గట్టిగా దొరికేసినట్టే.
This post was last modified on August 11, 2023 7:12 pm
దేశంలో సార్వత్రిక ఎన్నికలు కీలకదశకు చేరుకున్న నేపథ్యంలో దేశంలో వివిద నియోజకవర్గాలలో నిలబడ్డ ప్రముఖులలో ఎవరు గెలుస్తారు ? అని…
ఒక హీరో వద్దన్న స్టోరీలు ఇంకొకరు తీసుకోవడం సినీ పరిశ్రమలో లెక్కలేనన్నిసార్లు జరిగి ఉంటుంది. త్రివిక్రమ్ చెప్పినప్పుడు నిద్రరాకపోయి ఉంటే…
యానిమల్ విడుదలైన టైంలో, అంతకు ముందు కబీర్ సింగ్ సమయంలో బాలీవుడ్ విమర్శకులు, కొందరు నటీనటులు అదే పనిగా దర్శకుడు…
ఎన్నికల ప్రచారంలో ఎండనక.. వాననక.. నానా కష్టాలూ పడిన రాజకీయ ప్రముఖులు, పోలింగ్ తర్వాత, కౌంటింగ్కి ముందు.. కొంత ఉపశమనం…
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పోటీకి దిగిన వైసీపీ ఎంపీ (కాకినాడ) వంగా గీత, జనసేన పార్టీలోకి…
ఏపీలో రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ఎన్నికల పోలింగ్ జరిగిన ఈ నెల 13న, ఆ రోజు తర్వాత కూడా..…