మెగాస్టార్ చిరంజీవి…తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా అభిమానులు కీర్తిస్తున్న అగ్ర నటుడు. అటు పాత తరానికి…ఇటు కొత్త తరానికి మధ్య వారధిగా నిలిచిన వాల్తేరు వీరయ్య. ఒక కుటుంబంలో తండ్రి, కొడుకు ఇద్దరూ చిరంజీవికి కరుడుగట్టిన అభిమానులుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగు తెరను దశాబ్దాల పాటు ఏలిన స్టార్ హీరోగా, రాజకీయాలలో ఎత్తుపల్లాలు చూసిన రాజకీయ నేతగా..బ్లడ్ బ్యాంక్ వంటి సేవా కార్యక్రమాలతో ఒక సామాజిక కార్యకర్తగా చిరంజీవి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు.
అందుకే సందర్భానుసారంగా చిరుపై మెగా అభిమానులు తమ అభిమానాన్ని వినూత్న తరహాలో వ్యక్తీకరిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రం విడుదల సందర్భంగా ఆయన అభిమానులు ఆయనకు ఒక పెద్ద ట్రీట్ ఇచ్చారు. చిరుపై తమ అభిమానం వెలకట్టలేనిది అని మరోసారి మెగా ఫ్యాన్స్ వినూత్న రీతిలో నిరూపించుకున్నారు. ఏకంగా గూగుల్ మ్యాప్స్ లో చిరంజీవి చిత్రాన్ని గీసి నభూతో నా భవిష్యత్తు రీతిలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. గూగుల్ మ్యాప్స్ లో ‘గ్యాంగ్ లీడర్’ ను చిత్రీకరించిన మెగా ఫాన్స్ ఐడియా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్ నగర గూగుల్ మ్యాప్స్ లో చిరంజీవి చిత్రాన్ని గీసేందుకు మెగా అభిమానులు కొందరు వినూత్న ప్రయోగాన్ని కొద్ది రోజుల క్రితం మొదలుపెట్టారు. చిరంజీవి ఫోటోను పోలిన రూట్ మ్యాప్ ను 15 రోజుల క్రితం ఎంచుకున్నారు. మొత్తం 800 కిలోమీటర్ల మేర చెక్ పాయింట్స్ పెట్టుకొని…పదుల సంఖ్యలో చిరు అభిమానులు రకరకాల వాహనాలలో గూగుల్ నావిగేషన్ ఆధారంగా ఆ రూట్లో ప్రయాణించారు. ఆ మెగా అభిమానులు ప్రయాణించిన రూట్లన్నీ కలపగా గూగుల్ మ్యాప్స్ పై మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఆవిష్కృతమైంది. దాదాపు 15 రోజులు పాటు శ్రమించి వినూత్న తరహాలో తమ అభిమానాన్ని చాటుకున్నారు మెగా ఫాన్స్.
భోళాశంకర్ విడుదల సందర్భంగా మెగాస్టార్ కు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకోవాలనే ఇలా చేశామంటున్నారు మెగా అభిమానులు. ఇక, ఈ చిత్ర విడుదల, టికెట్ల రేట్లపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ గూగుల్ మ్యాప్ ఫొటో మెగా ఫ్యాన్స్ అందరిలో కొత్త జోష్ నింపింది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
This post was last modified on August 11, 2023 3:13 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…