మెగాస్టార్ చిరంజీవి…తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా అభిమానులు కీర్తిస్తున్న అగ్ర నటుడు. అటు పాత తరానికి…ఇటు కొత్త తరానికి మధ్య వారధిగా నిలిచిన వాల్తేరు వీరయ్య. ఒక కుటుంబంలో తండ్రి, కొడుకు ఇద్దరూ చిరంజీవికి కరుడుగట్టిన అభిమానులుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగు తెరను దశాబ్దాల పాటు ఏలిన స్టార్ హీరోగా, రాజకీయాలలో ఎత్తుపల్లాలు చూసిన రాజకీయ నేతగా..బ్లడ్ బ్యాంక్ వంటి సేవా కార్యక్రమాలతో ఒక సామాజిక కార్యకర్తగా చిరంజీవి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు.
అందుకే సందర్భానుసారంగా చిరుపై మెగా అభిమానులు తమ అభిమానాన్ని వినూత్న తరహాలో వ్యక్తీకరిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రం విడుదల సందర్భంగా ఆయన అభిమానులు ఆయనకు ఒక పెద్ద ట్రీట్ ఇచ్చారు. చిరుపై తమ అభిమానం వెలకట్టలేనిది అని మరోసారి మెగా ఫ్యాన్స్ వినూత్న రీతిలో నిరూపించుకున్నారు. ఏకంగా గూగుల్ మ్యాప్స్ లో చిరంజీవి చిత్రాన్ని గీసి నభూతో నా భవిష్యత్తు రీతిలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. గూగుల్ మ్యాప్స్ లో ‘గ్యాంగ్ లీడర్’ ను చిత్రీకరించిన మెగా ఫాన్స్ ఐడియా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్ నగర గూగుల్ మ్యాప్స్ లో చిరంజీవి చిత్రాన్ని గీసేందుకు మెగా అభిమానులు కొందరు వినూత్న ప్రయోగాన్ని కొద్ది రోజుల క్రితం మొదలుపెట్టారు. చిరంజీవి ఫోటోను పోలిన రూట్ మ్యాప్ ను 15 రోజుల క్రితం ఎంచుకున్నారు. మొత్తం 800 కిలోమీటర్ల మేర చెక్ పాయింట్స్ పెట్టుకొని…పదుల సంఖ్యలో చిరు అభిమానులు రకరకాల వాహనాలలో గూగుల్ నావిగేషన్ ఆధారంగా ఆ రూట్లో ప్రయాణించారు. ఆ మెగా అభిమానులు ప్రయాణించిన రూట్లన్నీ కలపగా గూగుల్ మ్యాప్స్ పై మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఆవిష్కృతమైంది. దాదాపు 15 రోజులు పాటు శ్రమించి వినూత్న తరహాలో తమ అభిమానాన్ని చాటుకున్నారు మెగా ఫాన్స్.
భోళాశంకర్ విడుదల సందర్భంగా మెగాస్టార్ కు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకోవాలనే ఇలా చేశామంటున్నారు మెగా అభిమానులు. ఇక, ఈ చిత్ర విడుదల, టికెట్ల రేట్లపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ గూగుల్ మ్యాప్ ఫొటో మెగా ఫ్యాన్స్ అందరిలో కొత్త జోష్ నింపింది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…