Movie News

ఆ ద‌ర్శ‌కుడికి సెంటిమెంటుగా మారిన ఆ న‌టి

కొంద‌రు ద‌ర్శ‌కులు త‌మ సినిమాల్లో హీరోయిన్ల‌ను రిపీట్ చేస్తే.. కొంద‌రేమో ఫ‌లానా క‌మెడియ‌న్ త‌న ప్ర‌తి సినిమాలో ఉండాల‌ని ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. ఈ విష‌యంలో స్నేహం మాత్ర‌మే కాదు.. సెంటిమెంట్లు కూడా ఉంటాయి. టాలీవుడ్ యువ ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేనికి కూడా ఇప్పుడు ఓ న‌టి సెంటిమెంటుగా మారింది. ఆమె ఎవ‌రో కాదు.. త‌మిళ న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్. త‌మిళంలో హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసి టైం క‌లిసి రాక‌పోవ‌డంతో క్యారెక్ట‌ర్, విల‌న్ రోల్స్ వైపు మ‌ళ్లింది శ‌ర‌త్ కుమార్ త‌న‌య‌.

ఈ మ‌ధ్య త‌మిళంలో కంటే కూడా తెలుగులో ఆమెకు డిమాండ్ పెరిగింది. వ‌ర‌లక్ష్మి నెగెటివ్ రోల్స్ చేసిన సినిమాలు వ‌రుస‌గా హిట్ట‌వుతుండ‌ట‌మే అందుక్కార‌ణం. ఆమెకు డిమాండ్ పెరిగేలా చేయ‌డంలో గోపీచంద్ పాత్ర కూడా కీల‌క‌మే.
గోపీచంద్‌కు చాన్నాళ్ల త‌ర్వాత పెద్ద హిట్ అందించిన క్రాక్ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి చేసిన జ‌య‌మ్మ పాత్ర ఎంత బాగా క్లిక్ అయిందో తెలిసిందే. త‌న‌ త‌ర్వాతి సినిమా వీర‌సింహారెడ్డిలోనూ వ‌ర‌ల‌క్ష్మికి కీల‌క పాత్ర ఇచ్చాడు గోపీ. ఆ సినిమా కూడా సూప‌ర్ హిట్ అయింది.

వ‌ర‌ల‌క్ష్మి పాత్ర కూడా బాగా ప్ల‌స్ అయింది. దీంతో ఆమెను త‌న ల‌క్కీ ఛార్మ్‌గా భావించి.. త‌ర్వాతి సినిమాలోనూ త‌న‌కోసం ఒక పాత్ర క్రియేట్ చేశాడ‌ట గోపీ. డాన్ శీను, బ‌లుపు, క్రాక్ త‌ర్వాత గోపీ-ర‌వితేజ క‌ల‌యిక‌లో కొత్త సినిమా ఇటీవ‌లే అనౌన్స్ అయిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే షూటింగ్ కూడా మొద‌లు కాబోతోంది. ప్ర‌స్తుతం న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతోంది. ఈ చిత్రానికి ఇంకా క‌థానాయిక ఖ‌రార‌వ్వ‌లేదు కానీ.. వ‌ర‌ల‌క్ష్మి మాత్రం ఒక ముఖ్య పాత్రకు ఓకే అయిపోయింద‌ట‌. వీర‌సింహారెడ్డి మూవీని ప్రొడ్యూస్ చేసిన మైత్రీ మూవీ మేకర్సే ఈ సినిమాను కూడా నిర్మిస్తోంది.

This post was last modified on August 11, 2023 9:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

12 minutes ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

15 minutes ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

45 minutes ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

1 hour ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

2 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

4 hours ago