కొందరు దర్శకులు తమ సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేస్తే.. కొందరేమో ఫలానా కమెడియన్ తన ప్రతి సినిమాలో ఉండాలని పర్టికులర్గా ఉంటారు. ఈ విషయంలో స్నేహం మాత్రమే కాదు.. సెంటిమెంట్లు కూడా ఉంటాయి. టాలీవుడ్ యువ దర్శకుడు గోపీచంద్ మలినేనికి కూడా ఇప్పుడు ఓ నటి సెంటిమెంటుగా మారింది. ఆమె ఎవరో కాదు.. తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్. తమిళంలో హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసి టైం కలిసి రాకపోవడంతో క్యారెక్టర్, విలన్ రోల్స్ వైపు మళ్లింది శరత్ కుమార్ తనయ.
ఈ మధ్య తమిళంలో కంటే కూడా తెలుగులో ఆమెకు డిమాండ్ పెరిగింది. వరలక్ష్మి నెగెటివ్ రోల్స్ చేసిన సినిమాలు వరుసగా హిట్టవుతుండటమే అందుక్కారణం. ఆమెకు డిమాండ్ పెరిగేలా చేయడంలో గోపీచంద్ పాత్ర కూడా కీలకమే.
గోపీచంద్కు చాన్నాళ్ల తర్వాత పెద్ద హిట్ అందించిన క్రాక్ సినిమాలో వరలక్ష్మి చేసిన జయమ్మ పాత్ర ఎంత బాగా క్లిక్ అయిందో తెలిసిందే. తన తర్వాతి సినిమా వీరసింహారెడ్డిలోనూ వరలక్ష్మికి కీలక పాత్ర ఇచ్చాడు గోపీ. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.
వరలక్ష్మి పాత్ర కూడా బాగా ప్లస్ అయింది. దీంతో ఆమెను తన లక్కీ ఛార్మ్గా భావించి.. తర్వాతి సినిమాలోనూ తనకోసం ఒక పాత్ర క్రియేట్ చేశాడట గోపీ. డాన్ శీను, బలుపు, క్రాక్ తర్వాత గోపీ-రవితేజ కలయికలో కొత్త సినిమా ఇటీవలే అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కాబోతోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రానికి ఇంకా కథానాయిక ఖరారవ్వలేదు కానీ.. వరలక్ష్మి మాత్రం ఒక ముఖ్య పాత్రకు ఓకే అయిపోయిందట. వీరసింహారెడ్డి మూవీని ప్రొడ్యూస్ చేసిన మైత్రీ మూవీ మేకర్సే ఈ సినిమాను కూడా నిర్మిస్తోంది.
This post was last modified on August 11, 2023 9:42 am
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…