కొందరు దర్శకులు తమ సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేస్తే.. కొందరేమో ఫలానా కమెడియన్ తన ప్రతి సినిమాలో ఉండాలని పర్టికులర్గా ఉంటారు. ఈ విషయంలో స్నేహం మాత్రమే కాదు.. సెంటిమెంట్లు కూడా ఉంటాయి. టాలీవుడ్ యువ దర్శకుడు గోపీచంద్ మలినేనికి కూడా ఇప్పుడు ఓ నటి సెంటిమెంటుగా మారింది. ఆమె ఎవరో కాదు.. తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్. తమిళంలో హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసి టైం కలిసి రాకపోవడంతో క్యారెక్టర్, విలన్ రోల్స్ వైపు మళ్లింది శరత్ కుమార్ తనయ.
ఈ మధ్య తమిళంలో కంటే కూడా తెలుగులో ఆమెకు డిమాండ్ పెరిగింది. వరలక్ష్మి నెగెటివ్ రోల్స్ చేసిన సినిమాలు వరుసగా హిట్టవుతుండటమే అందుక్కారణం. ఆమెకు డిమాండ్ పెరిగేలా చేయడంలో గోపీచంద్ పాత్ర కూడా కీలకమే.
గోపీచంద్కు చాన్నాళ్ల తర్వాత పెద్ద హిట్ అందించిన క్రాక్ సినిమాలో వరలక్ష్మి చేసిన జయమ్మ పాత్ర ఎంత బాగా క్లిక్ అయిందో తెలిసిందే. తన తర్వాతి సినిమా వీరసింహారెడ్డిలోనూ వరలక్ష్మికి కీలక పాత్ర ఇచ్చాడు గోపీ. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.
వరలక్ష్మి పాత్ర కూడా బాగా ప్లస్ అయింది. దీంతో ఆమెను తన లక్కీ ఛార్మ్గా భావించి.. తర్వాతి సినిమాలోనూ తనకోసం ఒక పాత్ర క్రియేట్ చేశాడట గోపీ. డాన్ శీను, బలుపు, క్రాక్ తర్వాత గోపీ-రవితేజ కలయికలో కొత్త సినిమా ఇటీవలే అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కాబోతోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రానికి ఇంకా కథానాయిక ఖరారవ్వలేదు కానీ.. వరలక్ష్మి మాత్రం ఒక ముఖ్య పాత్రకు ఓకే అయిపోయిందట. వీరసింహారెడ్డి మూవీని ప్రొడ్యూస్ చేసిన మైత్రీ మూవీ మేకర్సే ఈ సినిమాను కూడా నిర్మిస్తోంది.
This post was last modified on August 11, 2023 9:42 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…