కోలీవుడ్ లోనే కాదు మన దగ్గరా మంచి ఫాలోయింగ్ ఉన్న ధనుష్ ఈ ఏడాదే సర్ రూపంలో టాలీవుడ్ స్ట్రెయిట్ ఎంట్రీ ఇచ్చి మొదటి విజయం అందుకున్నాడు. తమిళంలో కన్నా తెలుగులోనే బాగా ఆడిన సర్ డైరెక్టర్ వెంకీ అట్లూరికి దీనికన్నా ముందు ఫ్లాప్ ఉన్నా సరే కేవలం కథను నమ్మడం వల్లే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు మరో దర్శకుడు అదే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. విరాట పర్వంతో ప్రశంసలు దక్కించుకున్నా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ అందుకున్న వేణు ఊడుగుల ఇటీవలే ఒక లైన్ చెప్పాడట. నచ్చింది కానీ ఫుల్ వెర్షన్ కు ధనుష్ టైం ఇచ్చినట్టు తెలిసింది.
వరసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ కాంబోని సెట్ చేసే ప్రయత్నాల్లో ఉంది. టేకింగ్ పరంగా వేణు ఊడుగుల మీద కంప్లయింట్ లేకపోయినా కమర్షియల్ అంశాలను ఎలా హ్యాండిల్ చేస్తాడనే కోణంలో అనుమానాలు లేకపోలేదు. మొదటి చిత్రం నీది నాది ఒకే కథ కూడా సీరియస్ నెరేషన్ తో సాగే ఒక సోషల్ ఇష్యూ కథ. కానీ ధనుష్ తో అలాంటివి వర్కౌట్ కావు. మాస్ టచ్ ఉండాల్సిందే. ఎంత మెసేజ్ ఉన్నా సర్ లో వీటిని వెంకీ అట్లూరి చాలా తెలివిగా ఇరికించాడు. అవి బాగా పేలాయి. వేణు ఇలాంటి వాటి మీద వర్క్ చేస్తున్నారట.
కెప్టెన్ మిల్లర్ విడుదల కోసం ఎదురు చూస్తున్న ధనుష్ ఇకపై ఏడాదికి ఒక తెలుగు సినిమా ఉండేలా చూసుకుంటున్నాడు. ఎలాగూ రెండు మూడు భాషల్లో రిలీజ్ చేస్తారు కాబట్టి దర్శకుడి కన్నా ముందు కథను బాగా వడబోత పట్టి ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటున్నాడు. యుగానికి ఒక్కడు సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్వీయ దర్శకత్వంలో తన 50వ సినిమా తీసుకుంటున్న ధనుష్ తో చేతులు కలిపేందుకు మన నిర్మాతలు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి వాళ్ళు సైతం సరైన సబ్జెక్టుల కోసం చూస్తున్నారు. కాకపోతే అంత సులభంగా దొరకడం లేదు.
This post was last modified on October 8, 2023 4:32 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…