కోలీవుడ్ లోనే కాదు మన దగ్గరా మంచి ఫాలోయింగ్ ఉన్న ధనుష్ ఈ ఏడాదే సర్ రూపంలో టాలీవుడ్ స్ట్రెయిట్ ఎంట్రీ ఇచ్చి మొదటి విజయం అందుకున్నాడు. తమిళంలో కన్నా తెలుగులోనే బాగా ఆడిన సర్ డైరెక్టర్ వెంకీ అట్లూరికి దీనికన్నా ముందు ఫ్లాప్ ఉన్నా సరే కేవలం కథను నమ్మడం వల్లే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు మరో దర్శకుడు అదే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. విరాట పర్వంతో ప్రశంసలు దక్కించుకున్నా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ అందుకున్న వేణు ఊడుగుల ఇటీవలే ఒక లైన్ చెప్పాడట. నచ్చింది కానీ ఫుల్ వెర్షన్ కు ధనుష్ టైం ఇచ్చినట్టు తెలిసింది.
వరసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ కాంబోని సెట్ చేసే ప్రయత్నాల్లో ఉంది. టేకింగ్ పరంగా వేణు ఊడుగుల మీద కంప్లయింట్ లేకపోయినా కమర్షియల్ అంశాలను ఎలా హ్యాండిల్ చేస్తాడనే కోణంలో అనుమానాలు లేకపోలేదు. మొదటి చిత్రం నీది నాది ఒకే కథ కూడా సీరియస్ నెరేషన్ తో సాగే ఒక సోషల్ ఇష్యూ కథ. కానీ ధనుష్ తో అలాంటివి వర్కౌట్ కావు. మాస్ టచ్ ఉండాల్సిందే. ఎంత మెసేజ్ ఉన్నా సర్ లో వీటిని వెంకీ అట్లూరి చాలా తెలివిగా ఇరికించాడు. అవి బాగా పేలాయి. వేణు ఇలాంటి వాటి మీద వర్క్ చేస్తున్నారట.
కెప్టెన్ మిల్లర్ విడుదల కోసం ఎదురు చూస్తున్న ధనుష్ ఇకపై ఏడాదికి ఒక తెలుగు సినిమా ఉండేలా చూసుకుంటున్నాడు. ఎలాగూ రెండు మూడు భాషల్లో రిలీజ్ చేస్తారు కాబట్టి దర్శకుడి కన్నా ముందు కథను బాగా వడబోత పట్టి ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటున్నాడు. యుగానికి ఒక్కడు సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్వీయ దర్శకత్వంలో తన 50వ సినిమా తీసుకుంటున్న ధనుష్ తో చేతులు కలిపేందుకు మన నిర్మాతలు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి వాళ్ళు సైతం సరైన సబ్జెక్టుల కోసం చూస్తున్నారు. కాకపోతే అంత సులభంగా దొరకడం లేదు.
This post was last modified on October 8, 2023 4:32 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…