నిర్మాతల కంటే ఎక్కువ ప్రభాస్ బ్రాండ్ మీదే పేరు తెచ్చుకున్న యువి క్రియేషన్స్ ఆలస్యానికి పెట్టింది పేరని సినిమా ప్రేమికుల్లో ఒక అభిప్రాయం ఉంది. ఒక ట్విట్టర్ అప్డేట్ తో మొదలుపెట్టి అసలు రిలీజ్ డేట్ దాక వాయిదాలు వేస్తూనే ఉంటారని డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతుంటారు. సరే ప్యాన్ ఇండియా మూవీస్ అంటే ఇలాంటి సమస్యలు సహజం కాబట్టి ఏదోలే అనుకోవచ్చు. కానీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి మీడియం బడ్జెట్ చిత్రానికి సైతం ఇబ్బందులు తప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ఆగస్ట్ 2 ఈ జంట థియేటర్లకు రావాల్సింది.
కానీ వారం గ్యాప్ లో మెగాస్టార్ సూపర్ స్టార్ ఇద్దరూ వస్తున్నారని కారణమో లేక ప్రమోషన్లకు వచ్చేందుకు సరిపడా టైం అనుష్క వద్ద లేకపోవడమో ఏదైతేనేం మొత్తానికి పోస్ట్ పోన్ తప్పలేదు. పోనీ ఆగస్ట్ 18న ప్లాన్ చేసుకుంటే పోటీ లేని సమయం చాలా ప్లస్ అయ్యేది. కానీ వదిలేశారు. తీరా చూస్తే ఆ శుక్రవారం చెప్పుకోదగ్గ మంచి రిలీజ్ ఏదీ లేదు. సుహైల్ మిస్టర్ ప్రెగ్నెంట్ ఉన్నప్పటికీ దానికి ఎలాంటి బజ్ ఉందో తెలిసిందే. ఆపై ఆగస్ట్ 25 వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున ఉంటుంది కాబట్టి రిస్క్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇక నో ఆప్షన్ కనక సెప్టెంబర్ కు షిఫ్ట్ అవ్వాలి.
మొదటి వారం మొదటి రోజే విజయ్ దేవరకొండ ఖుషి ఉంది. దాంతో క్లాష్ ఓవర్సీస్ మార్కెట్ పరంగా అంత సేఫ్ కాదు. పోనీ సెప్టెంబర్ 7న ప్లాన్ చేసుకుందామంటే షారుఖ్ ఖాన్ జవాన్ కవ్విస్తున్నాడు. అన్ని భాషల్లో రిలీజ్ ఉండటంతో భారీ ఎత్తున మార్కెటింగ్ చేస్తున్నారు. కానీ యువి మాత్రం ఈ డేట్ కే మొగ్గు చూపుతోందని ఇన్ సైడ్ టాక్. ఎందుకంటే 15న స్కంద, చంద్రముఖి 2, మార్క్ ఆంటోనీలున్నాయి. అదింకా డేంజర్. సో ఎలా చూసుకున్నా పోలిశెట్టి జంట సెప్టెంబర్ 7నే వచ్చేలా ఉంది. టీమ్ తో మాట్లాడుకుని మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు.
This post was last modified on August 10, 2023 10:58 am
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి…
రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు సింగపూర్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన శుక్రవారం తో ముగియనుంది. మూడు రోజుల పర్యటనలో…
సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్,…
నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…