ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో ‘గుంటూరు కారం’ సినిమా మీద వచ్చినన్ని నెగెటివ్ న్యూస్లు, రూమర్లు మరే పెద్ద సినిమా మీద రాలేదంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు జరిగిన సంగతి తెలిసిందే. స్క్రిప్టు మారడమే కాక వేర్వేరు దశల్లో ఫైట్ మాస్టర్లు, హీరోయిన్, సినిమాటోగ్రాఫర్లను కూడా మార్చాల్సి వచ్చింది.
వీరితో పాటు సంగీత దర్శకుడు తమన్ కూడా సినిమా నుంచి వైదొలగనున్నట్లు ప్రచారం ఒకసారి కాదు.. రెండు మూడుసార్లు జరిగింది. కొన్ని రోజుల ముందు కూడా తమన్పై వేటు పడినట్లు జోరుగా రూమర్లు వినిపించాయి. ఐతే బుధవారం మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్లో తమన్ పేరు కనిపించడంతో ఈ ప్రచారానికి తెరపడింది. ఈ దశలో ఇక సంగీత దర్శకుడిని మార్చరనే అందరూ భావిస్తున్నారు. ఒకవేళ ఒకట్రెండు పాటలు వేరే సంగీత దర్శకుడితో చేయించుకుంటే చెప్పలేం.
ఐతే తమన్ ‘గుంటూరు కారం’లో ఉన్నాడని ధ్రువీకరించారు బాగానే ఉంది కానీ.. ఇంకో నాలుగు నెలల్లో సినిమా రిలీజ్ ఉండగా.. మహేష్ పుట్టిన రోజు లాంటి మంచి సందర్భం వచ్చినపుడు కేవలం ఒక పోస్టర్తో సరిపెట్టడం కరెక్టేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి ఈ సందర్భంలో సినిమా నుంచి ఒక పాట రిలీజ్ చేస్తారని కొన్ని రోజుల ముందు జోరుగా ప్రచారం జరిగింది. తమన్ కూడా ఆ పనిలోనే ఉన్నట్లు చెప్పుకున్నారు. ఐతే తమన్ పట్ల మహేష్ ఈ మధ్య అంత సానుకూలంగా లేని నేపథ్యంలో ఆయనకు నచ్చి ఓకే చేస్తేనే బయటికి వస్తుందని మాట్లాడుకున్నారు.
తీరా చూస్తే.. మహేష్ బర్త్డేకి పాట రాలేదు. అంటే తమన్ పాటే సిద్ధం చేయలేదా.. లేక అతను రెడీ చేసినా మహేష్కు నచ్చకపోవడంతో ఆపేశారా అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమన్ను మున్ముందు అయినా తప్పించి మరో సంగీత దర్శకుడిని పెట్టుకుంటారేమో అన్న సందేహాలు నెలకొన్నాయి. తమన్ పేరు పోస్టర్ మీద లేకుంటే ఫోకస్ అంతా దాని మీదికే మళ్లి మహేష్ పుట్టిన రోజు నాడు అనవసర రచ్చ జరుగుతుందని కూడా వివాదానికి ఆస్కారం లేకుండా తమన్ పేరు పోస్టర్ మీద వేసి ఉండొచ్చనే చర్చ కూడా నడుస్తోంది.
This post was last modified on August 9, 2023 4:54 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…