ఎంత పెద్ద స్టార్ అయినా సరే కొత్త సినిమా రిలీజ్ అవుతోందంటే అదో రకమైన ఉద్వేగం ఉంటుంది. ఫలితం ఎలా వస్తుందోననే టెన్షన్ తో సరిగా నిద్ర పట్టదు. వరుసగా ఫోన్ కాల్స్ తో నిమిషం గ్యాప్ దొరకదు. ఇక ప్రమోషన్ల కోసం ఇంటర్వ్యూలు, ఈవెంట్లు గట్రా ఎన్నో ఉంటాయి. మొదటి రోజు మార్నింగ్ షో దాకా టెన్షన్ షరా మాములే. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అవేవి పట్టవు. దర్శకుడు కోరుకున్నట్టు నటించి తన కర్తవ్యం నిర్వర్తించాను కాబట్టి ఇంకా నాకు దేనితోనూ సంబంధం లేదన్న రీతిలో వ్యవహరిస్తూ ఉంటారు. దాని నుంచి జైలర్ కు సైతం మినహాయింపు ఇవ్వలేదు.
ఇంకో ఇరవై నాలుగు గంటల్లో ప్రీమియర్లు మొదలవుతాయనగా రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లిపోయారు. తరచుగా ఈ పర్యటన ఆయనకు అలవాటే అయినా ఇటీవలి కాలంలో ఆరోగ్యం దృష్ట్యా ఎక్కువగా వెళ్ళలేదు. నాలుగేళ్లకు పైగా గ్యాప్ వచ్చిందట. అందుకే ప్రశాంతత కోసం కొన్ని రోజులు అక్కడ గడిపి వస్తారట. ఈలోగా జైలర్ ఇక్కడ ఫైనల్ రన్ పూర్తి చేసుకుని రికార్డుల లెక్క తేల్చేసి ఉంటుంది. ఇటీవలే చెన్నైలో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రజని ఇచ్చిన గంటన్నర స్పీచ్ తాలూకు వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆయన సంగతేమో కానీ అన్ని భాషల్లో జైలర్ కు మంచి బజ్ కనిపిస్తోంది. ట్రైలర్ కట్ తో పాటు అనిరుద్ పాటలు జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో భోళా శంకర్ కంటే రజనికే మంచి బుకింగ్స్ ఉండటం షాక్ కలిగిస్తోంది. రోబో తర్వాత మళ్ళీ యునానిమస్ అనిపించుకున్న అంత పెద్ద సక్సెస్ అందుకోలేకపోయిన తలైవర్ కి జైలర్ బ్లాక్ బస్టర్ కావడం చాలా కీలకం. దీని తర్వాత కూతురు దర్శకత్వంలో క్యామియో చేసిన లాల్ సలాం రిలీజ్ ఉంటుంది. జైభీం ఫేమ్ టిజె జ్ఞానవేల్ డైరెక్ట్ చేయబోయే మల్టీస్టారర్ దీపావళి నుంచి మొదలుకానుంది.
This post was last modified on August 9, 2023 4:33 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…