రీరిలీజుల ట్రెండ్ కొత్త పుంతలు తొక్కుతోంది. మొన్నామధ్య తగ్గిపోయింది జనానికి విసుగొచ్చిందనుకున్న టైంలో ఒక్కసారిగా ఆరంజ్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి నిర్మాత నాగబాబుతో సహా ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయ్యాయి. తాజాగా బిజినెస్ మెన్ కు జరుగుతున్న రచ్చ చూస్తుంటే రిలీజవుతోంది గుంటూరు కారమేమో అన్నంతగా ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు. వచ్చే నెల సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గుడుంబా శంకర్ కు ఇంతకు మించి రచ్చ చూపిస్తామని పవర్ స్టార్ ఫ్యాన్స్ అప్పుడే ఫిక్స్ అయ్యారు. రికార్డుల మేనియా ఆ స్థాయిలో ఉంది.
ఇప్పుడు నెక్స్ట్ లిస్టులో 7జి బృందావన్ కాలనీ చేరింది. ప్రస్తుతం 4కె పనులతో పాటు డాల్బీ అట్మొస్ మిక్సింగ్ జరుగుతోంది. అక్టోబర్ విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. దసరా పోటీని దృష్టిలో పెట్టుకుని పెద్ద సినిమాలు లేని టైంలో దించేందుకు నిర్మాత ఏఎం రత్నం ప్లానింగ్ లో ఉన్నారు. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ కల్ట్ క్లాసిక్ కు మాములు ఫాలోయింగ్ లేదు. హీరో రవికృష్ణ కేవలం ఈ ఒక్క మూవీతోనే యూత్ లో అలా ముద్రపడిపోయాడు. సోనియా అగర్వాల్ కు ఎనలేని గుర్తింపు వచ్చింది. ఇక యువన్ శంకర్ రాజా పాటలకు ఈ రోజుకీ తిరుగు లేదు.
ఈ వార్త రావడం ఆలస్యం డిస్ట్రిబ్యూటర్లు రత్నంని ఆఫర్లతో ఉక్కిరిబిక్కరి చేస్తున్నారట. ధనుష్ 3నే ఆ స్థాయిలో ఆదరించినప్పుడు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కి కనీసం వారం రోజులు థియేటర్లు కిక్కిరిసిపోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టే ఎంత రేట్ అయినా సరే సిద్ధమని చెబుతున్నారట. నిజంగా దీనికున్న క్రేజ్ అలాంటిది. కామెడీ, లవ్, మ్యూజిక్, ఎమోషన్స్ తో పాటు సరిపడా రొమాన్స్ కూడా ఇందులో జొప్పించారు. అందుకే మూడు గంటల నిడివిని సైతం అప్పటి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. స్టార్ హీరో లేని రీ రిలీజుల్లో ఇది కొత్త రికార్డులు సృష్టించడం పక్కానే.
This post was last modified on August 8, 2023 9:24 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…