Movie News

మంచి పాటలు చచ్చిపోతున్నాయి – మణిశర్మ

ఒకప్పుడు ఆడియో క్యాసెట్స్ రిలీజ్ చేసేవారు. శ్రోతలు ఆ క్యాసెట్స్ కొనుగోలు చేసి అన్నీ పాటలు వినే వారు. ఇంట్లోనో , కారులోనో అన్నీ పాటలు ప్లే చేస్తూ ఆస్వాదించే వారు. కానీ నేటి రోజుల్లో ఒక్కో పాటను లిరికల్ అంటూ రిలీజ్ చేస్తుండటంతో కొన్ని మిగతా మంచి పాటలు చచ్చిపోతున్నాయంటూ మణిశర్మ తన ఆవేదన బయటపెట్టాడు. 

కార్తికేయ హీరోగా తెరకెక్కిన ‘బెదురులంక 2012’  అనే సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. ఆ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా మణిశర్మతో హీరో , దర్శకుడు కలిసి ఓ చిట్ చాట్ చేశారు. అందులో మణిశర్మ తన ఆవేదన చెప్పుకున్నారు. హీరో కార్తికేయ ఒకప్పుడు సాంగ్స్ రిలీజ్ గురించి , ఆడియో క్యాసెట్స్ గురించి చెప్తుండగా.. మధ్యలో మణిశర్మ అప్పటికీ ఇప్పటికీ వ్యత్యాసం తెలిపారు. 

“కొన్ని పాటలు వినగానే నచ్చేస్తాయి. ఇంకొన్ని ఐదు సార్లు వింటే ఎక్కుతాయి. మరికొన్ని ఎక్కువ సార్లు వింటే నరనరాల్లోకి వెళ్లిపోతాయి. కానీ ఇప్పుడు అలా వినే లేదు. ఏది నచ్చిందో అదే వింటున్నారు. మిగతా పాటలు మళ్ళీ మళ్ళీ వినడం లేదు. అందువల్ల కొన్ని మిగతా మంచి పాటలు చచ్చిపోతున్నాయి.  అంతే కాదు ఇప్పుడు బెస్ట్ ఆఫ్ మణిశర్మ , బెస్ట్ ఆఫ్ దేవి అంటూ కొన్నే పాటలు పెడుతున్నారు. దాని వల్ల మిగతా పాటలు వినలేకపోతున్నారు.” చివర్లో ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో అన్నట్టుగా దండం పెట్టేశారు మణిశర్మ. 

సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పేది కరెక్టే. కానీ ఇప్పుడు నచ్చిన పాటలు మాత్రమే వినే సౌకర్యం వచ్చేసింది. దీంతో మిగతా పాటలు మళ్ళీ మళ్ళీ వినే పరిస్థితి అయితే లేదు. కాలంతో పాటే వచ్చిన ఈ మార్పును ఎంత గింజుకున్నా ఏం చేయలేం. ఈ విషయం మణిశర్మకి కూడా తెలుసు. అందుకే ఇంటర్వ్యూలో మాత్రమే ఇలా తన ఆవేదన వ్యక్తపరిచారు. మార్పు రాదని ఆయనకి తెలియనిది కాదు.

This post was last modified on August 8, 2023 6:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago