ఒకప్పటితో పోలిస్తే తెలుగులో రజనీకాంత్ మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది. బాషా, నరసింహ టైంలో ఉదృతంగా, పోటీకి మన హీరోలు జంకే పరిస్థితి ఉండేది. కానీ వరస డిజాస్టర్లు మొత్తం సీన్ ని మార్చేశాయి. కాలా, కబాలిలు 30 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ చేస్తే వాటి నష్టాలు బయ్యర్లను ఆ తర్వాత అంత పెట్టుబడి పెట్టేందుకు జంకేలా చేశాయి. పేటను పది కోట్లకే అమ్మినా బ్రేక్ ఈవెన్ చేరుకోలేకపోయింది. ఇక పెద్దన్న సంగతి సరేసరి. ఈ ప్రభావమంతా నేరుగా జైలర్ మీద పడింది. బయట ఎంత క్రేజ్ ఉన్నా తెలుగు వెర్షన్ ని మాత్రం ఏపీ తెలంగాణ కలిపి జస్ట్ 12 కోట్లకు విక్రయించారట.
జస్ట్ దీనికి ఇంకో కోటి అదనంగా వస్తే చాలు లాభాలే. ఈసారి రజనికు చాలా సానుకూలంగా మారుతున్న విషయం గురువారం రిలీజ్. బ్రో మూడు రోజుల హడావిడి తర్వాత థియేటర్లు సరైన ఫీడింగ్ లేక ఖాళీగా ఉన్నాయి. భోళాశంకర్ వచ్చేది ఫ్రైడే కాబట్టి ఒక్క రోజు గ్యాప్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని జైలర్ ని చిన్నా పెద్ద తేడా లేకుండా అత్యధిక స్క్రీన్లలో రేపు షోలు వేయబోతున్నారు. చిరుకి రిజర్వ్ చేసి పెట్టిన థియేటర్లలో తలైవర్ కి నాలుగైదు షోలు ఎల్లుండి పడిపోతాయి. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే ఆపై భోళా శంకర్ రెస్పాన్స్ ని బట్టి పెంచడమో తగ్గించడమో బయ్యర్లు డిసైడ్ చేసుకుంటారు.
ఒకవేళ జైలర్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే ఈవెనింగ్, సెకండ్ షోలతోనే గరిష్టంగా రాబట్టుకోవచ్చు. ఏషియన్, సురేష్ సంస్థల పంపిణి కావడంతో అన్ని కేంద్రాల్లోనూ జైలర్ కు మంచి ప్లానింగ్ దొరికింది. ఓవర్సీస్ తర్వాత ముందుగా షోలు పడేది ఇక్కడే. తమిళనాడులో పలు కారణాల వల్ల ఉదయం 9 కన్నా ముందు ప్రీమియర్లు వేయడం లేదు. సో ఫస్ట్ రిపోర్ట్స్, రివ్యూస్ అన్నీ పక్క రాష్ట్రాల నుంచే అరవ ఫ్యాన్స్ తెలుసుకోబోతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ కు అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చగా దీన్నో యాక్షన్ కం రివెంజ్ థ్రిలర్ గా తీర్చిదిద్దారు.
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…