Movie News

అఖిల్ కోసం ఆరు నెలల త్యాగం

ఇద్దరు వారసులు ఇండస్ట్రీలో స్టార్స్ గా అప్ కమింగ్ స్టేజిలో ఉన్నప్పుడు తండ్రిగా నాగార్జునకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది. కాకపోతే ఈ మధ్య టైం కలిసిరాక వరుస ఫ్లాపులు అక్కినేని ఫ్యామిలినే కాదు అభిమానులను కూడా బాగా ఇబ్బంది పెట్టాయి. సరైన కంబ్యాక్ కోసం ముగ్గురు ఎదురు చూస్తున్నారు. నాగ చైతన్య తండేల్(ప్రచారంలో ఉన్న టైటిల్)కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. నాగ్ రచయిత ప్రసన్నకుమార్ తో అనుకున్న ప్రాజెక్టుని రీమేక్ ప్లస్ స్క్రిప్ట్ గొడవల వల్ల పెండింగ్ పెట్టేశారు. ఆరెక్స్ 100 అజయ్ భూపతితో సినిమా ఓకే చేశారనే టాక్ ఉంది కానీ ఇంకా అఫీషియల్ కాలేదు.

నిన్న బిగ్ బాస్ సుహైల్ హీరోగా నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా వెళ్లిన నాగార్జున ఓ ఆసక్తికరమైన ముచ్చట పంచుకున్నారు. బిడ్డ పుట్టడం అనేది తల్లికి ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో అంతకన్నా బాధ్యత భర్తగా, తండ్రి వహించాల్సి ఉంటుందని చెప్పారు. హలో బ్రదర్ షూటింగ్ పూర్తయ్యాక అఖిల్ కోసం ఆరు నెలలు పూర్తిగా ఇంటి పట్టునే అమలకు తోడు ఉన్నానని, ఆ సమయంలో తాను పక్కన ఉండటం ఎంతో అవసరమని గుర్తించి ఆ మాత్రం త్యాగం చేయడం సబబేనని సెట్లకు దూరం కావాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.

మాములుగా రెండు మూడు వారాలు లీవ్ పెట్టుకోవడమే గొప్పగా ఫీలయ్యే వాళ్లకు నాగ్ ఒక మంచి విషయాన్ని చెప్పారు. ఇప్పుడు అఖిల్ పెద్దోడయ్యాడు.  హీరోగా అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఏజెంట్ దారుణంగా డిజాస్టర్ కావడం ఊహించని షాక్ ఇచ్చింది. అందుకే కొత్త సినిమాకు తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేస్తూ సబ్జెక్టుని ఒకటికి పదిసార్లు రివ్యూ చేసుకునే పనిలో ఉన్నాడని టాక్. మిస్టర్ ప్రెగ్నెంట్ టైటిల్ కు తగ్గట్టు మగాడు గర్భం దాలిస్తే ఎలా ఉంటుందనే పాయింట్ మీద రూపొందింది. బిగ్ బాస్ షో  నుంచి సొహైల్ తో ఉన్న బాండింగ్ వల్లే నాగ్ గెస్టుగా వచ్చారు. 

This post was last modified on August 6, 2023 1:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago