ఈ వారం బాక్సాఫీస్ చాలా డల్లుగా ఉంది. కొత్తగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. అయిన వాటిని ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గత వారంలో వచ్చిన ‘బ్రో’, అంతకంటే ముందు రిలీజైన ‘బేబి’ చిత్రాలే ఉన్నంతలో బాక్సాఫీస్ను ఉపయోగించుకున్నాయి. కొత్త సినిమాల కోసం ఎదురు చూసేవాళ్లందరి చూపూ వచ్చే వారం రిలీజయ్యే రెండు సినిమాల మీదే ఉంది.
అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ కాగా.. మరొకటి సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘జైలర్’. మామూలుగా రిలీజ్ వీక్లో సోమవారానికి కానీ కొత్త చిత్రాల బుకింగ్స్ ఓపెన్ కావు. కానీ ఇండిపెండెన్స్ డే వీకెండ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ‘భోళా శంకర్’, ‘జైలర్’ సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ను రిలీజ్కు వారం ముందే ఓపెన్ చేసేశారు. పెద్ద సంఖ్యలో థియేటర్లు బుకింగ్స్ మొదలుపెట్టాయి.
చిరంజీవి చివరి సినిమా ‘వాల్తేరు వీరయ్య’తో పోలిస్తే ‘భోళా శంకర్’ అడ్వాన్స్ బుకింగ్స్ అంత ఆశాజనకంగా లేవు. ఈ సినిమా మీద అంచనాలు ముందు నుంచి తక్కువగానే ఉన్నాయి. రీమేక్ మూవీ కావడం, దారుణమైన ట్రాక్ రికార్డున్న మెహర్ రమేష్ డైరెక్ట్ చేయడం.. టీజర్, ట్రైలర్ ఏమంత ఎగ్జైటింగ్గా లేకపోవడం ‘భోళా శంకర్’కు ప్రతికూలం అయ్యాయి. అందుకే బుకింగ్స్ కొంచెం స్లోగా నడుస్తున్నాయి. అలా అని చిరు ప్రభావాన్ని తక్కువగా కూడా చూడలేం. ఇలాంటి సినిమాతో కూడా ఆయన తొలి రోజు పెద్ద ఎత్తున హౌస్ ఫుల్స్ పెట్టబోతున్నాడన్నది స్పష్టం.
ఉదయం 7 గంటల నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘భోళా శంకర్’ షోలు పడబోతున్నాయి. సినిమాకు టికెట్ల ధరలేమీ పెంచలేదు. నార్మల్ రేట్లతోనే సినిమా ఓ మోస్తరు బుకింగ్స్తో నడుస్తోంది. ‘భోళా శంకర్’ కంటే ఒక రోజు ముందు, గురువారం రిలీజ్ కానున్న రజినీ సినిమా ‘జైలర్’కు తొలి రోజు పెద్ద సంఖ్యలోనే థియేటర్లిచ్చారు. ఈ సినిమాకు కూడా ఉదయం 7.30 నుంచే షోలు మొదలవుతున్నాయి. రజినీ గత సినిమాలతో పోలిస్తే దీనికి అడ్వాన్స్ బుకింగ్స్లో జోరు కనిపిస్తోంది. ‘భోళా శంకర్’కు దీటుగా థియేటర్లు ఫుల్ అయ్యేలా కనిపిస్తోంది.
తెలుగు సినిమాలకు ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తీసుకురావడం మామూలే. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ల విషయంలో ఎక్కువగా వేరే ఇండస్ట్రీల మీద…
అవసరమున్నా లేకపోయినా.. సీక్వెల్స్కు లీడ్ ఇవ్వడం అన్నది ఈ రోజుల్లో మామూలైపోయింది. అలా హింట్ ఇచ్చిన సినిమాల్లో సెకండ్ పార్ట్…
పెద్ది థియేటర్ రన్ ముగింపు దిశగా వెళ్తోంది. ఈ వీకెండ్ కాస్త పికపయ్యే అవకాశాలున్నాయి. పాత రీ రిలీజులు తప్ప…
ఇటీవలే సింగర్ సునీత మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్త్రీలు 'నా శరీరం నా ఇష్టం' అన్నప్పుడు అవతలి…
గత ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో ఆరుగురు సైనికులు వీరమరణం చెందినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. దాదాపు 13…
రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ వచ్చే సమస్య ఒకటుంది. అదే చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడకపోవడం. బాహుబలి రెండు భాగాలు,…