మెగా ఫ్యామిలీలో నాగబాబు ఎలా ఉంటారు? ఆయన మాటలు ఎలా ఉంటాయి? లాంటి ప్రశ్నలకు ప్రత్యేకంగా సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆవేశంగా మాట్లాడటం ఎంతలానో.. అంతే హ్యుమర్ పండించేలా మాట్లాడటంలోనూ దిట్ట.
భావోద్వేగాన్ని దాచుకోకుండా ఓపెన్ అయ్యే ఆయన..రియల్ జీవితంలో కూతురంటే ప్రాణం ఆయనకు. అలాంటి నాగబాబు తాజాగా ఒక కార్యక్రమంలో ఎమోషనల్ గా బరస్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన ఒక ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఒక ప్రైవేటు చానల్ లో ఆగస్టు 23న ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ లో నాగబాబు మాటలు హార్ట్ టచ్చింగ్ గా ఉండటమే కాదు.. చివర్లో తన కుమార్తె నిహారిక అంటే తనకెంత ఇష్టమన్న విషయాన్ని చెప్పిన తీరు అందరిని ఆకట్టుకోవటం ఖాయం. నాగబాబు మాటల్ని వినే ప్రతి అమ్మాయి.. ఫాదర్ అంటే ఇలా ఉండాలన్నట్లుగా ఫీలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన కుమార్తె కడుపులోనే చనిపోయిందన్న విషయాన్ని చెప్పిన ఎమోషనల్ అయిన వేళ.. నాగబాబు ఓపెన్ అయ్యారు.
నిహారిక చిన్నతనంలో చోటు చేసుకున్న ఒక ఉదంతాన్ని ప్రస్తావించారు. ‘ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ వెళ్లాం. వాడెవడో నాలాగా నల్లకోటు వేసుకున్నాడని వాడినే నాన్న అనుకొని వెళ్లిపోయింది నిహారిక. దాదాపు ఇరవై నిమిషాల పాటు కనిపించకుండా పోయింది. దీంతో.. పిచ్చెక్కిపోయింది. నాకు ఎలా అనిపించిందంటే.. మొత్తం న్యూజిలాండ్ లో ఉన్న వాళ్లందరిని చంపేద్దామనుకున్నా. వరుణ్ ను ఇంటికి పంపేసి.. నేను..పద్మ సూసైడ్ చేసుకుందామనుకున్నాం. నా కూతురు లేకపోతే.. బతికి ఉన్నా వేస్ట్ అన్నంత పిచ్చ వచ్చేసింది’’ అంటూ నాగబాబు ఎమోషనల్ అయ్యారు. అయిన భావోద్వేగానికి గురైన తీరు ఆకర్షించటమే కాదు.. ఈ ఎపిసోడ్ మీద మరిన్ని అంచనాల్ని పెంచేలా ఉందని చెప్పక తప్పదు.
This post was last modified on August 18, 2020 11:34 am
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…