మెగా ఫ్యామిలీలో నాగబాబు ఎలా ఉంటారు? ఆయన మాటలు ఎలా ఉంటాయి? లాంటి ప్రశ్నలకు ప్రత్యేకంగా సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆవేశంగా మాట్లాడటం ఎంతలానో.. అంతే హ్యుమర్ పండించేలా మాట్లాడటంలోనూ దిట్ట.
భావోద్వేగాన్ని దాచుకోకుండా ఓపెన్ అయ్యే ఆయన..రియల్ జీవితంలో కూతురంటే ప్రాణం ఆయనకు. అలాంటి నాగబాబు తాజాగా ఒక కార్యక్రమంలో ఎమోషనల్ గా బరస్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన ఒక ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఒక ప్రైవేటు చానల్ లో ఆగస్టు 23న ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ లో నాగబాబు మాటలు హార్ట్ టచ్చింగ్ గా ఉండటమే కాదు.. చివర్లో తన కుమార్తె నిహారిక అంటే తనకెంత ఇష్టమన్న విషయాన్ని చెప్పిన తీరు అందరిని ఆకట్టుకోవటం ఖాయం. నాగబాబు మాటల్ని వినే ప్రతి అమ్మాయి.. ఫాదర్ అంటే ఇలా ఉండాలన్నట్లుగా ఫీలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన కుమార్తె కడుపులోనే చనిపోయిందన్న విషయాన్ని చెప్పిన ఎమోషనల్ అయిన వేళ.. నాగబాబు ఓపెన్ అయ్యారు.
నిహారిక చిన్నతనంలో చోటు చేసుకున్న ఒక ఉదంతాన్ని ప్రస్తావించారు. ‘ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ వెళ్లాం. వాడెవడో నాలాగా నల్లకోటు వేసుకున్నాడని వాడినే నాన్న అనుకొని వెళ్లిపోయింది నిహారిక. దాదాపు ఇరవై నిమిషాల పాటు కనిపించకుండా పోయింది. దీంతో.. పిచ్చెక్కిపోయింది. నాకు ఎలా అనిపించిందంటే.. మొత్తం న్యూజిలాండ్ లో ఉన్న వాళ్లందరిని చంపేద్దామనుకున్నా. వరుణ్ ను ఇంటికి పంపేసి.. నేను..పద్మ సూసైడ్ చేసుకుందామనుకున్నాం. నా కూతురు లేకపోతే.. బతికి ఉన్నా వేస్ట్ అన్నంత పిచ్చ వచ్చేసింది’’ అంటూ నాగబాబు ఎమోషనల్ అయ్యారు. అయిన భావోద్వేగానికి గురైన తీరు ఆకర్షించటమే కాదు.. ఈ ఎపిసోడ్ మీద మరిన్ని అంచనాల్ని పెంచేలా ఉందని చెప్పక తప్పదు.
This post was last modified on August 18, 2020 11:34 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…