మెగా ఫ్యామిలీలో నాగబాబు ఎలా ఉంటారు? ఆయన మాటలు ఎలా ఉంటాయి? లాంటి ప్రశ్నలకు ప్రత్యేకంగా సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆవేశంగా మాట్లాడటం ఎంతలానో.. అంతే హ్యుమర్ పండించేలా మాట్లాడటంలోనూ దిట్ట.
భావోద్వేగాన్ని దాచుకోకుండా ఓపెన్ అయ్యే ఆయన..రియల్ జీవితంలో కూతురంటే ప్రాణం ఆయనకు. అలాంటి నాగబాబు తాజాగా ఒక కార్యక్రమంలో ఎమోషనల్ గా బరస్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన ఒక ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఒక ప్రైవేటు చానల్ లో ఆగస్టు 23న ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ లో నాగబాబు మాటలు హార్ట్ టచ్చింగ్ గా ఉండటమే కాదు.. చివర్లో తన కుమార్తె నిహారిక అంటే తనకెంత ఇష్టమన్న విషయాన్ని చెప్పిన తీరు అందరిని ఆకట్టుకోవటం ఖాయం. నాగబాబు మాటల్ని వినే ప్రతి అమ్మాయి.. ఫాదర్ అంటే ఇలా ఉండాలన్నట్లుగా ఫీలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన కుమార్తె కడుపులోనే చనిపోయిందన్న విషయాన్ని చెప్పిన ఎమోషనల్ అయిన వేళ.. నాగబాబు ఓపెన్ అయ్యారు.
నిహారిక చిన్నతనంలో చోటు చేసుకున్న ఒక ఉదంతాన్ని ప్రస్తావించారు. ‘ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ వెళ్లాం. వాడెవడో నాలాగా నల్లకోటు వేసుకున్నాడని వాడినే నాన్న అనుకొని వెళ్లిపోయింది నిహారిక. దాదాపు ఇరవై నిమిషాల పాటు కనిపించకుండా పోయింది. దీంతో.. పిచ్చెక్కిపోయింది. నాకు ఎలా అనిపించిందంటే.. మొత్తం న్యూజిలాండ్ లో ఉన్న వాళ్లందరిని చంపేద్దామనుకున్నా. వరుణ్ ను ఇంటికి పంపేసి.. నేను..పద్మ సూసైడ్ చేసుకుందామనుకున్నాం. నా కూతురు లేకపోతే.. బతికి ఉన్నా వేస్ట్ అన్నంత పిచ్చ వచ్చేసింది’’ అంటూ నాగబాబు ఎమోషనల్ అయ్యారు. అయిన భావోద్వేగానికి గురైన తీరు ఆకర్షించటమే కాదు.. ఈ ఎపిసోడ్ మీద మరిన్ని అంచనాల్ని పెంచేలా ఉందని చెప్పక తప్పదు.
This post was last modified on August 18, 2020 11:34 am
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…