నిన్న థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. కౌంట్ అయితే ఉంది కానీ దేనిలోనూ క్వాలిటీ ఉన్నట్టు అనిపించకపోవడంతో ఆడియన్స్ వాటి వైపు చూడలేదు. కానీ ఓటిటిలో మాత్రం చెప్పుకోదగ్గ కంటెంట్ వచ్చింది. అందులో ప్రధానంగా ప్రేక్షకుల దృష్టిలో పడిన వెబ్ సిరీస్ దయా. శివతో విలన్ గా పరిచయమై ఆ తర్వాత గులాబీతో హీరోగా మారి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న జెడి చక్రవర్తి చాలా గ్యాప్ తర్వాత ఒక ఫుల్ లెన్త్ రోల్ లో దర్శనమిచ్చింది దయాతోనే. ట్రైలర్ కట్ వచ్చాక అంచనాలు అమాంతం మారిపోయాయి. ఇంతకీ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందో సింపుల్ గా చూసేద్దాం
పోర్టు ఏరియాలో ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ గా పని చేసే దయా(జెడి చక్రవర్తి)కి మెషీన్ పెట్టుకుంటే కానీ వినిపించదు. భార్య(ఈషా రెబ్బా) గర్భవతి. ఓ రోజు లోడు కోసం పట్టణం వెళ్లిన దయాకు బండ్లో జర్నలిస్టు కవిత(రమ్య)శవం కనిపిస్తుంది. దాన్ని మాయం చేసేందుకు నానా తంతాడు పడతాడు. కవిత భర్త(కమల్ కామరాజు)తో పాటు స్థానిక ఎమ్మెల్యే(పృథ్విరాజ్)లకు ఈ కేసుతో సంబంధం ఉంటుంది. అసలు మంచోడైన దయా చుట్టూ ఈ పద్మవ్యూహం ఎవరు పన్నారు, అతని ఉచ్చులో నుంచి ఎలా బయట పడ్డాడు, అసలు హంతకుడు ఎవరు తదితర ప్రశ్నలకు సమాధానం స్మార్ట్ స్క్రీన్ మీదే చూడాలి.
పాతిక నిమిషాల చొప్పున మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉన్న దయాని దర్శకుడు పవన్ సాధినేని సాధ్యమైనంత మేరకు ఒరిజినల్ వెర్షన్ (తక్దీర్) లో సోల్ ని తగ్గించకుండా ఆసక్తిగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. మధ్యలో కొంత సాగతీత, నెమ్మదిగా ప్రారంభం కావడం లాంటి లోపాలున్నా మరీ బోర్ కొట్టకుండా దయా సాగింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఇంటెన్స్ గా ఉంది. జెడితో సహా ఆర్టిస్టులు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇటీవలే వచ్చిన స్ట్రెయిట్ తెలుగు సిరీస్ లలో చూసుకుంటే దయానే బాగానే ఎంగేజ్ చేయించిందని చెప్పొచ్చు. నెమ్మదిగా ఉన్నా స్థిరంగా సాగిన కథనం దయాని నిలబెట్టింది.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…