Movie News

దేవరకొండ తల్లిగా చేయను, నాగ్ అంటే క్రష్

90ల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాగానే పాపులర్ అయిన తమిళ అమ్మాయి కస్తూరి. కథానాయికగా కెరీర్ ముగిశాక పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డ ఆమె.. సోషల్ యాక్టివిస్టుగా మారింది. ఈ మధ్య మళ్లీ సినిమాల్లో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. తాజాగా కస్తూరి ఆలీ నిర్వహించే ఓ టీవీ షోకు ముఖ్య అతిథిగా హాజరైంది. దీనికి సంబంధించిన ప్రోమోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. అందులో కొన్ని అంశాలపై కస్తూరి చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్‌గా ఉండటంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

మీరు రాత్రి పడుకునే ముందు ముగ్గురు మగాళ్లకు ఫోన్ చేస్తే.. అంటూ ఆలీ ఏదో అడుగుతుండగానే కల్పించుకున్న కస్తూరి.. దీన్ని ఇలా కాదు.. ‘‘నా మంచం మీద ఎప్పుడూ ముగ్గురు మగాళ్లు ఉంటారు’’ అనొచ్చు అని కామెంట్ చేసింది. అక్కడితో ఆ అంశాన్ని కట్ చేశారు. మరోవైపు అక్కినేని నాగార్జునతో ‘అన్నమయ్య’ సినిమాలో నటించడం గురించి ఆమె మాట్లాడుతూ.. తన కెరీర్లో ఎందరో హీరోలతో నటించానని, కానీ తనకున్న ఏకైక క్రష్ నాగార్జున మాత్రమే అని చెప్పింది.

‘అన్నమయ్య’ షూటింగ్ కోసం వెళ్లినపుడు నాగ్ షేక్ హ్యాండ్ ఇచ్చాక ఆ చేతిని కడగకుండా అలాగే చూసుకుంటూ పడుకున్నానని కస్తూరి వెల్లడించింది. మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు కదా.. ఎవరైనా యంగ్ హీరోకు తల్లిగా నటిస్తారా అని అడిగితే.. ఆ హీరో ద్విపాత్రాభినయం చేసి తండ్రీ కొడుకులుగా నటించేట్లయితే తండ్రికి భార్యగా, కొడుక్కి తల్లిగా నటించడానికి సిద్ధమని అంది కస్తూరి. విజయ్ దేవరకొండతో ఇలా చేస్తారా అని అడిగితే మాత్రం ఛాన్సే లేదని.. అతనంటే తనకు చాలా ఇష్టమని ఆమె అంది.

This post was last modified on August 18, 2020 1:23 am

Share
Show comments
Published by
suman

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

1 hour ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

1 hour ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago