90ల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాగానే పాపులర్ అయిన తమిళ అమ్మాయి కస్తూరి. కథానాయికగా కెరీర్ ముగిశాక పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డ ఆమె.. సోషల్ యాక్టివిస్టుగా మారింది. ఈ మధ్య మళ్లీ సినిమాల్లో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. తాజాగా కస్తూరి ఆలీ నిర్వహించే ఓ టీవీ షోకు ముఖ్య అతిథిగా హాజరైంది. దీనికి సంబంధించిన ప్రోమోను యూట్యూబ్లో రిలీజ్ చేశారు. అందులో కొన్ని అంశాలపై కస్తూరి చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్గా ఉండటంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
మీరు రాత్రి పడుకునే ముందు ముగ్గురు మగాళ్లకు ఫోన్ చేస్తే.. అంటూ ఆలీ ఏదో అడుగుతుండగానే కల్పించుకున్న కస్తూరి.. దీన్ని ఇలా కాదు.. ‘‘నా మంచం మీద ఎప్పుడూ ముగ్గురు మగాళ్లు ఉంటారు’’ అనొచ్చు అని కామెంట్ చేసింది. అక్కడితో ఆ అంశాన్ని కట్ చేశారు. మరోవైపు అక్కినేని నాగార్జునతో ‘అన్నమయ్య’ సినిమాలో నటించడం గురించి ఆమె మాట్లాడుతూ.. తన కెరీర్లో ఎందరో హీరోలతో నటించానని, కానీ తనకున్న ఏకైక క్రష్ నాగార్జున మాత్రమే అని చెప్పింది.
‘అన్నమయ్య’ షూటింగ్ కోసం వెళ్లినపుడు నాగ్ షేక్ హ్యాండ్ ఇచ్చాక ఆ చేతిని కడగకుండా అలాగే చూసుకుంటూ పడుకున్నానని కస్తూరి వెల్లడించింది. మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు కదా.. ఎవరైనా యంగ్ హీరోకు తల్లిగా నటిస్తారా అని అడిగితే.. ఆ హీరో ద్విపాత్రాభినయం చేసి తండ్రీ కొడుకులుగా నటించేట్లయితే తండ్రికి భార్యగా, కొడుక్కి తల్లిగా నటించడానికి సిద్ధమని అంది కస్తూరి. విజయ్ దేవరకొండతో ఇలా చేస్తారా అని అడిగితే మాత్రం ఛాన్సే లేదని.. అతనంటే తనకు చాలా ఇష్టమని ఆమె అంది.
This post was last modified on August 18, 2020 1:23 am
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…