Movie News

చైతు 23 కథలో పాకిస్థాన్ లింకు

కథల ఎంపికలో ఎక్కడ పొరపాటు జరుగుతోందో గుర్తించిన నాగ చైతన్య ఈసారి ఎంత మాత్రం తొందరపడటం లేదు. గీతా ఆర్ట్స్ 2 భారీ బడ్జెట్ తో సిద్ధంగా ఉన్నప్పటికీ కథకు అనుగుణంగా తనను తాను మలుచుకోవడం కోసం ప్రత్యేకంగా దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత బన్నీ వాస్ తో కలిసి నిజ జాలర్లతో మాట్లాడుతూ వాళ్ళ జీవన విధానం మీద క్షుణ్ణంగా అవగాహన పెంచుకుంటున్నాడు. వాటి తాలూకు ఫోటోలు, వీడియోలు ఆల్రెడీ ట్విట్టర్, ఇన్స్ టాలో వైరలవుతున్నాయి. దీనికి తండేల్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ యూనిట్ దాని గురించి అధికారికంగా మాట్లాడ్డం లేదు.

ఇక కథకు సంబంధించిన ఒక కీలక క్లూ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. దాని ప్రకారం ఇది 2018 బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి గుజరాత్ కు వెళ్లే క్రమంలో 22 సభ్యులున్న ఒక చేపలు పట్టే గుంపు సముద్రంలో తప్పిపోయి పాకిస్థాన్ కు చెందిన కరాచీ అధికారులకు దొరికిపోతుంది. అక్కడ ఏడాదికి పైగా కారాగారం పాలై నరకం చవి చూశాక వాళ్ళ స్నేహితుడు, బంధువైన చైతు కాపాడేందుకు రిస్క్ చేసి పాక్ వెళ్తాడు. ఇక అక్కడి నుంచి సాహస యాత్ర మొదలవుతుంది. వాళ్ళను విడిపించుకుని ఎలా తప్పించుకున్నాడనే పాయింట్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందట.

నిర్ధారణగా ఇదే అని చెప్పలేం కానీ పాయింట్ అయితే నమ్మదగినట్టే అనిపిస్తోంది. సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్, అనిరుద్ రవిచందర్ ఇద్దరిలో ఒకరిని లాక్ చేసే పనిలో ఉన్నారు. మొదటి పేరే కన్ఫర్మ్ అని ఇన్ సైడ్ టాక్. థాంక్ యు, లాల్ సింగ్ చద్దా, కస్టడీ వరస డిజాస్టర్ల తర్వాత చైతన్య పూర్తిగా మేకోవర్ చేసుకుని తండేల్ కోసం రెడీ అవుతున్నాడు. చందూ మొండేటి కెరీర్ లోనూ ఇది అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోంది. అరవై కోట్లకు పైమాటేనని వినిపిస్తోంది కానీ రంగంలోకి దిగాక అంతకంటే చాలా ఎక్కువ కావొచ్చని దాని మీద వర్క్ చేస్తున్న వాళ్ళ కామెంట్. మొత్తానికి చైతు 23 సాలిడ్ గా ఉండబోతోంది. 

Satya

Recent Posts

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

2 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

2 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

2 hours ago

జగన్ తో అమరావతి రైతుల భేటీ నిజమేనా…?

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…

3 hours ago

ఉత్తరాది బుకింగ్స్ ఎలా ఉన్నాయి

పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…

3 hours ago

ఆంధ్రాలో గద్దర్ విగ్రహం: పవన్ కల్యాణ్

జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…

4 hours ago