బేబి అనే చిన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర కొన్ని వారాలుగా ఎలా ప్రకంపనలు రేపుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ సినిమా స్థాయికి రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించడం అన్నది ఊహకైనా అందని విషయం. ఐతే ఇప్పటికే రూ.80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం మూడో వారంలోనూ మంచి వసూళ్లతో ముందుకు సాగుతోంది. ఈ వీకెండ్లో ఆ చిత్రం ‘బ్రో’కు దీటుగా షేర్ రాబట్టబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
‘బేబి’ ఎఫెక్ట్ ఈ స్థాయిలో ఉంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు, చివరికి ఆ చిత్ర బృందంలోని ముఖ్యులు కూడా. ‘బేబి’ టీం తమ చిత్రాన్ని ప్రమోట్ చేసిన తీరు.. ఒక బెంచ్ మార్క్ లాగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. మరీ ఖర్చు పెట్టకుండానే కేవలం సోషల్ మీడియా ప్రమోషన్తోనే సినిమా మీద ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెంచడంలో చిత్ర బృందం విజయవంతం అయింది.
ఫస్ట్ లుక్ దగ్గర్నుంచి.. ప్రతిదీ పద్ధతిగా చేశారు. ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ పాట సినిమాకు సగం ప్రమోషన్ చేసి పెట్టేసింది. మిగతా పాటలు.. టీజర్.. ట్రైలర్.. ఇలా ప్రతిదీ క్లిక్ అయింది. ట్రైలర్ చూశాక జనం సినిమా చూడటానికి ఆగలేకపోయారు. ఆ తర్వాత పెయిడ్ ప్రిమియర్స్ను కూడా భలేగా ప్లాన్ చేశారు. రిలీజ్ తర్వాత మెగా ఫ్యామిలీ హీరోలు, పెద్దలను సినిమా కోసం ఉపయోగించుకున్న తీరు కూడా ‘బేబి’ టీం ప్లానింగ్కు నిదర్శనం. ముందు ఆనంద్ దేవరకొండ అన్న విజయ్ దేవరకొండ అతిథిగా ఒక ఈవెంట్ చేశారు.
ఆ తర్వాత రెండో వారంలో అల్లు అర్జున్తో, మూడో వారంలో చిరంజీవిలతో ఈవెంట్లు చేశారు. ఇది కాక అల్లు అరవింద్ పార్టీ ద్వారా కూడా సినిమాను ప్రమోట్ చేశారు. వీటికి తోడు ప్రమోషనల్ టూర్స్ కూడా సమయానుకూలంగా చేశారు. సినిమాలోని కంటెంట్కు తోడు ఈ ప్రమోషన్లు కూడా ప్లస్ అయ్యాయి. మరీ ఖర్చు పెట్టకుండానే ఒక పెద్ద సినిమాను మించి ‘బేబి’ని ప్రమోట్ చేసిన తీరును చూసి మిగతా ఫిలిం మేకర్స్ నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.
This post was last modified on August 4, 2023 3:29 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…