బేబి అనే చిన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర కొన్ని వారాలుగా ఎలా ప్రకంపనలు రేపుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ సినిమా స్థాయికి రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించడం అన్నది ఊహకైనా అందని విషయం. ఐతే ఇప్పటికే రూ.80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం మూడో వారంలోనూ మంచి వసూళ్లతో ముందుకు సాగుతోంది. ఈ వీకెండ్లో ఆ చిత్రం ‘బ్రో’కు దీటుగా షేర్ రాబట్టబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
‘బేబి’ ఎఫెక్ట్ ఈ స్థాయిలో ఉంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు, చివరికి ఆ చిత్ర బృందంలోని ముఖ్యులు కూడా. ‘బేబి’ టీం తమ చిత్రాన్ని ప్రమోట్ చేసిన తీరు.. ఒక బెంచ్ మార్క్ లాగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. మరీ ఖర్చు పెట్టకుండానే కేవలం సోషల్ మీడియా ప్రమోషన్తోనే సినిమా మీద ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెంచడంలో చిత్ర బృందం విజయవంతం అయింది.
ఫస్ట్ లుక్ దగ్గర్నుంచి.. ప్రతిదీ పద్ధతిగా చేశారు. ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ పాట సినిమాకు సగం ప్రమోషన్ చేసి పెట్టేసింది. మిగతా పాటలు.. టీజర్.. ట్రైలర్.. ఇలా ప్రతిదీ క్లిక్ అయింది. ట్రైలర్ చూశాక జనం సినిమా చూడటానికి ఆగలేకపోయారు. ఆ తర్వాత పెయిడ్ ప్రిమియర్స్ను కూడా భలేగా ప్లాన్ చేశారు. రిలీజ్ తర్వాత మెగా ఫ్యామిలీ హీరోలు, పెద్దలను సినిమా కోసం ఉపయోగించుకున్న తీరు కూడా ‘బేబి’ టీం ప్లానింగ్కు నిదర్శనం. ముందు ఆనంద్ దేవరకొండ అన్న విజయ్ దేవరకొండ అతిథిగా ఒక ఈవెంట్ చేశారు.
ఆ తర్వాత రెండో వారంలో అల్లు అర్జున్తో, మూడో వారంలో చిరంజీవిలతో ఈవెంట్లు చేశారు. ఇది కాక అల్లు అరవింద్ పార్టీ ద్వారా కూడా సినిమాను ప్రమోట్ చేశారు. వీటికి తోడు ప్రమోషనల్ టూర్స్ కూడా సమయానుకూలంగా చేశారు. సినిమాలోని కంటెంట్కు తోడు ఈ ప్రమోషన్లు కూడా ప్లస్ అయ్యాయి. మరీ ఖర్చు పెట్టకుండానే ఒక పెద్ద సినిమాను మించి ‘బేబి’ని ప్రమోట్ చేసిన తీరును చూసి మిగతా ఫిలిం మేకర్స్ నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…