‘బ్రో’ సినిమాలో శ్యాంబాబు పేరుతో తనను పోలిన క్యారెక్టర్ పెట్టి స్పూఫ్ చేయడంపై వైకాపా సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు ఎంత గొడవ చేస్తున్నారో తెలిసిందే. ముందు ఈ విషయమై కొంచెం సరదాగానే స్పందించిన అంబటి.. ఆ తర్వాాత చాలా సీరియస్ అయిపోయారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ‘బ్రో’ సినిమా అట్టర్ ఫ్లాప్ అని.. డిజాస్టర్ అని స్టేట్మెంట్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
అంతే కాక ఈ సినిమాకు సంబంధించిన పెట్టుబడుల మీద.. అలాగే పవన్ కళ్యాణ్కు ఇచ్చిన రెమ్యూనరేషన్ మీద కూడా అంబటి తీవ్ర ఆరోపణలతో ఈడీ అధికారులను కలవడానికి ఢిల్లీ వెళ్తుండటం మీద చర్చ జరుగుతోంది. అంతటితో ఆగకుండా త్రివిక్రమ్ సహా ఇండస్ట్రీ జనాలకు అంబటి చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం కూడా హాట్ టాపిక్గా మారింది. ఐతే మంత్రి స్థానంలో ఉండి అంబటి ఇలా వార్నింగ్ ఇవ్వడమేంటి అనే చర్చ జరుగుతుండగా.. అంబటికి ‘బ్రో’ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ ఇచ్చిన మాస్ వార్నింగ్ తాలూకు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘బ్రో’ సినిమాకు సంబంధించి అంబటి చేసిన ఆరోపణలు.. ఈ సినిమా రైటర్ త్రివిక్రమ్ సహా ఇండస్ట్రీకి ఇచ్చిన వార్నింగ్ గురించి ఒక ఇంటర్వ్యూలో విశ్వప్రసాద్ను అడగ్గా.. వీటిని తాను ఆరోపణలుగా భావించడం లేదని అన్నారు. వాటిని గాలి మాటలుగానే పరిగణించి లైట్ తీసుకుంటున్నానంటూ నవ్వేశారు. అలా కాకుండా తాను సీరియస్గా తీసుకుంటే మాత్రం కథ వేరుగా ఉంటుందని.. తనకు చాలా బలమైన లీగల్ టీం ఉందని.. ఆ మార్గంలో వెళ్తే అంబటిని కిందికి దించగలను (I’ll take him down) అని విశ్వప్రసాద్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
కూల్గా మాట్లాడుతూనే అంబటికి మాస్ వార్నింగ్ ఇచ్చారంటూ విశ్వప్రసాద్పై పవన్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరో ఇంటర్వ్యూలో ‘బ్రో’ పెట్టుబడులు.. పవన్ రెమ్యూనరేషన్ గురించి అడిగితే.. అది మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ ఒక న్యూస్ ఛానెల్ ప్రెజెంటర్కు విశ్వ ప్రసాద్ ఇచ్చిన కౌంటర్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి.
This post was last modified on August 3, 2023 11:08 am
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…