‘బ్రో’ సినిమాలో శ్యాంబాబు పేరుతో తనను పోలిన క్యారెక్టర్ పెట్టి స్పూఫ్ చేయడంపై వైకాపా సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు ఎంత గొడవ చేస్తున్నారో తెలిసిందే. ముందు ఈ విషయమై కొంచెం సరదాగానే స్పందించిన అంబటి.. ఆ తర్వాాత చాలా సీరియస్ అయిపోయారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ‘బ్రో’ సినిమా అట్టర్ ఫ్లాప్ అని.. డిజాస్టర్ అని స్టేట్మెంట్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
అంతే కాక ఈ సినిమాకు సంబంధించిన పెట్టుబడుల మీద.. అలాగే పవన్ కళ్యాణ్కు ఇచ్చిన రెమ్యూనరేషన్ మీద కూడా అంబటి తీవ్ర ఆరోపణలతో ఈడీ అధికారులను కలవడానికి ఢిల్లీ వెళ్తుండటం మీద చర్చ జరుగుతోంది. అంతటితో ఆగకుండా త్రివిక్రమ్ సహా ఇండస్ట్రీ జనాలకు అంబటి చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం కూడా హాట్ టాపిక్గా మారింది. ఐతే మంత్రి స్థానంలో ఉండి అంబటి ఇలా వార్నింగ్ ఇవ్వడమేంటి అనే చర్చ జరుగుతుండగా.. అంబటికి ‘బ్రో’ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ ఇచ్చిన మాస్ వార్నింగ్ తాలూకు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘బ్రో’ సినిమాకు సంబంధించి అంబటి చేసిన ఆరోపణలు.. ఈ సినిమా రైటర్ త్రివిక్రమ్ సహా ఇండస్ట్రీకి ఇచ్చిన వార్నింగ్ గురించి ఒక ఇంటర్వ్యూలో విశ్వప్రసాద్ను అడగ్గా.. వీటిని తాను ఆరోపణలుగా భావించడం లేదని అన్నారు. వాటిని గాలి మాటలుగానే పరిగణించి లైట్ తీసుకుంటున్నానంటూ నవ్వేశారు. అలా కాకుండా తాను సీరియస్గా తీసుకుంటే మాత్రం కథ వేరుగా ఉంటుందని.. తనకు చాలా బలమైన లీగల్ టీం ఉందని.. ఆ మార్గంలో వెళ్తే అంబటిని కిందికి దించగలను (I’ll take him down) అని విశ్వప్రసాద్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
కూల్గా మాట్లాడుతూనే అంబటికి మాస్ వార్నింగ్ ఇచ్చారంటూ విశ్వప్రసాద్పై పవన్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరో ఇంటర్వ్యూలో ‘బ్రో’ పెట్టుబడులు.. పవన్ రెమ్యూనరేషన్ గురించి అడిగితే.. అది మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ ఒక న్యూస్ ఛానెల్ ప్రెజెంటర్కు విశ్వ ప్రసాద్ ఇచ్చిన కౌంటర్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి.
This post was last modified on August 3, 2023 11:08 am
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…
గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…
అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా…
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…