‘బ్రో’ సినిమాలో శ్యాంబాబు పేరుతో తనను పోలిన క్యారెక్టర్ పెట్టి స్పూఫ్ చేయడంపై వైకాపా సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు ఎంత గొడవ చేస్తున్నారో తెలిసిందే. ముందు ఈ విషయమై కొంచెం సరదాగానే స్పందించిన అంబటి.. ఆ తర్వాాత చాలా సీరియస్ అయిపోయారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ‘బ్రో’ సినిమా అట్టర్ ఫ్లాప్ అని.. డిజాస్టర్ అని స్టేట్మెంట్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
అంతే కాక ఈ సినిమాకు సంబంధించిన పెట్టుబడుల మీద.. అలాగే పవన్ కళ్యాణ్కు ఇచ్చిన రెమ్యూనరేషన్ మీద కూడా అంబటి తీవ్ర ఆరోపణలతో ఈడీ అధికారులను కలవడానికి ఢిల్లీ వెళ్తుండటం మీద చర్చ జరుగుతోంది. అంతటితో ఆగకుండా త్రివిక్రమ్ సహా ఇండస్ట్రీ జనాలకు అంబటి చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం కూడా హాట్ టాపిక్గా మారింది. ఐతే మంత్రి స్థానంలో ఉండి అంబటి ఇలా వార్నింగ్ ఇవ్వడమేంటి అనే చర్చ జరుగుతుండగా.. అంబటికి ‘బ్రో’ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ ఇచ్చిన మాస్ వార్నింగ్ తాలూకు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘బ్రో’ సినిమాకు సంబంధించి అంబటి చేసిన ఆరోపణలు.. ఈ సినిమా రైటర్ త్రివిక్రమ్ సహా ఇండస్ట్రీకి ఇచ్చిన వార్నింగ్ గురించి ఒక ఇంటర్వ్యూలో విశ్వప్రసాద్ను అడగ్గా.. వీటిని తాను ఆరోపణలుగా భావించడం లేదని అన్నారు. వాటిని గాలి మాటలుగానే పరిగణించి లైట్ తీసుకుంటున్నానంటూ నవ్వేశారు. అలా కాకుండా తాను సీరియస్గా తీసుకుంటే మాత్రం కథ వేరుగా ఉంటుందని.. తనకు చాలా బలమైన లీగల్ టీం ఉందని.. ఆ మార్గంలో వెళ్తే అంబటిని కిందికి దించగలను (I’ll take him down) అని విశ్వప్రసాద్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
కూల్గా మాట్లాడుతూనే అంబటికి మాస్ వార్నింగ్ ఇచ్చారంటూ విశ్వప్రసాద్పై పవన్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరో ఇంటర్వ్యూలో ‘బ్రో’ పెట్టుబడులు.. పవన్ రెమ్యూనరేషన్ గురించి అడిగితే.. అది మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ ఒక న్యూస్ ఛానెల్ ప్రెజెంటర్కు విశ్వ ప్రసాద్ ఇచ్చిన కౌంటర్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…