హీరో ఎవరైనా ప్రతి సినిమాకు కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి. అవి పాజిటివ్ కావొచ్చు లేదా నెగటివ్ అవ్వొచ్చు. వాటికి రివర్స్ లో ఫలితాలు రావొచ్చు. ఖచ్చితంగా ముందే చెప్పలేం. భోళా శంకర్ మీద షూటింగ్ స్టేజి నుంచి ఫ్యాన్స్ లోనే ఒకరకమైన ప్రతికూల ఫీలింగ్ ఉంది. పైగా పవన్ కళ్యాణ్ బ్రో దెబ్బ తినడంతో కేవలం రెండు వారాల గ్యాప్ తో అన్నయ్య చిరంజీవి మరో రీమేక్ తో రావడం ఎంతలేదన్నా ఇబ్బంది కలిగిస్తుంది . కానీ బయ్యర్లు, నిర్మాత దీని మీద చూపిస్తున్న ఆసక్తి వేరుగా ఉంది. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య సక్సెస్ ని దృష్టిలో పెట్టుకుని రేట్ల గురించి పెద్దగా ఆలోచించడం లేదు.
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు భోళా శంకర్ 90 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ చేసింది. సైరా లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ తో పోల్చుకుంటే ఇది తక్కువే. అయినప్పటికీ వేదాళం రీమేక్, మెహర్ రమేష్ దారుణమైన ట్రాక్ రికార్డు, అంతగా కిక్ ఇవ్వని మహతి స్వరసాగర్ పాటలు వెరసి ఇన్ని నెగటివ్ పాయింట్స్ మధ్య ఈ ఫిగర్స్ తో లెక్కలు కట్టడం విశేషమే. సీడెడ్ 13 కోట్లు, ఆంధ్ర 37 కోట్లు, నైజామ్ 25 కోట్ల దాకా అమ్ముడుపోయాయట. ఓవర్సీస్ మరో 15 కోట్లు అదనం. అయితే బ్రేక్ ఈవెన్ రావాలంటే భోళా శంకర్ ఖచ్చితంగా వంద కోట్ల షేర్ దాటాల్సి ఉంటుంది.
నిర్మాత అనిల్ సుంకర తో సహా టీమ్ మొత్తం ఫలితం మీద కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ ఆదివారం 6వ తేదీ హైదరాబాద్ శిల్పా కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. అఫీషియల్ నోట్ రాలేదు. ఆచార్య, గాడ్ ఫాదర్ లకు విపరీతంగా ప్రమోషన్లు చేసిన చిరంజీవి వాల్తేరు వీరయ్యకు కొంత తగ్గించి రిజల్ట్ వచ్చాక స్పీడ్ పెంచారు. భోళా శంకర్ కోసం ఇంకా రంగంలోకి దిగలేదు. కీర్తి సురేష్ డేట్లు ఇస్తే తనతో కొన్ని ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తారు. తమన్నా, సుశాంత్ అందుబాటులో ఉండి ఒక ముఖాముఖీ పూర్తి చేశారు. మరి కొండంత ఉన్న లక్ష్యాన్ని భోళా గోరంతగా మారుస్తాడా చూడాలి.
This post was last modified on August 2, 2023 3:26 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…