హీరో ఎవరైనా ప్రతి సినిమాకు కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి. అవి పాజిటివ్ కావొచ్చు లేదా నెగటివ్ అవ్వొచ్చు. వాటికి రివర్స్ లో ఫలితాలు రావొచ్చు. ఖచ్చితంగా ముందే చెప్పలేం. భోళా శంకర్ మీద షూటింగ్ స్టేజి నుంచి ఫ్యాన్స్ లోనే ఒకరకమైన ప్రతికూల ఫీలింగ్ ఉంది. పైగా పవన్ కళ్యాణ్ బ్రో దెబ్బ తినడంతో కేవలం రెండు వారాల గ్యాప్ తో అన్నయ్య చిరంజీవి మరో రీమేక్ తో రావడం ఎంతలేదన్నా ఇబ్బంది కలిగిస్తుంది . కానీ బయ్యర్లు, నిర్మాత దీని మీద చూపిస్తున్న ఆసక్తి వేరుగా ఉంది. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య సక్సెస్ ని దృష్టిలో పెట్టుకుని రేట్ల గురించి పెద్దగా ఆలోచించడం లేదు.
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు భోళా శంకర్ 90 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ చేసింది. సైరా లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ తో పోల్చుకుంటే ఇది తక్కువే. అయినప్పటికీ వేదాళం రీమేక్, మెహర్ రమేష్ దారుణమైన ట్రాక్ రికార్డు, అంతగా కిక్ ఇవ్వని మహతి స్వరసాగర్ పాటలు వెరసి ఇన్ని నెగటివ్ పాయింట్స్ మధ్య ఈ ఫిగర్స్ తో లెక్కలు కట్టడం విశేషమే. సీడెడ్ 13 కోట్లు, ఆంధ్ర 37 కోట్లు, నైజామ్ 25 కోట్ల దాకా అమ్ముడుపోయాయట. ఓవర్సీస్ మరో 15 కోట్లు అదనం. అయితే బ్రేక్ ఈవెన్ రావాలంటే భోళా శంకర్ ఖచ్చితంగా వంద కోట్ల షేర్ దాటాల్సి ఉంటుంది.
నిర్మాత అనిల్ సుంకర తో సహా టీమ్ మొత్తం ఫలితం మీద కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ ఆదివారం 6వ తేదీ హైదరాబాద్ శిల్పా కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. అఫీషియల్ నోట్ రాలేదు. ఆచార్య, గాడ్ ఫాదర్ లకు విపరీతంగా ప్రమోషన్లు చేసిన చిరంజీవి వాల్తేరు వీరయ్యకు కొంత తగ్గించి రిజల్ట్ వచ్చాక స్పీడ్ పెంచారు. భోళా శంకర్ కోసం ఇంకా రంగంలోకి దిగలేదు. కీర్తి సురేష్ డేట్లు ఇస్తే తనతో కొన్ని ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తారు. తమన్నా, సుశాంత్ అందుబాటులో ఉండి ఒక ముఖాముఖీ పూర్తి చేశారు. మరి కొండంత ఉన్న లక్ష్యాన్ని భోళా గోరంతగా మారుస్తాడా చూడాలి.
This post was last modified on August 2, 2023 3:26 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…