సరిగ్గా ఇంకో తొమ్మిది రోజుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ విడుదల కాబోతోంది. చెన్నైలో మూడు రోజుల క్రితం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. ఇప్పటిదాకా ట్రైలర్ ఊసే లేదు. టీజర్ తో సరిపెట్టారు. అంతో ఇంతో హైప్ వచ్చిందంటే అది కేవలం తమన్నా స్టెప్పులు అదరగొట్టిన కావాలయ్యా యాయా పాట మహాత్యమే. తమిళంలో ఎలాగూ ఆయన రేంజ్ కి ఓపెనింగ్స్ కి టెన్షన్ లేదు కానీ తెలుగు వెర్షన్ నిర్మాతలు ఇంకా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. గతంలో పెద్దన్నకు సైతం అనారోగ్యం కారణంగా తలైవా ప్రత్యక్ష హాజరులో ఎలాంటి వేడుక చేయలేకపోయారు.
జైలర్ కు ఆ సమస్య లేదు. రజని బయటికి వచ్చేంత హెల్తీగానే ఉన్నారు. మరి హైదరాబాద్ లో ఓ ఈవెంట్ చేస్తే బాగుటుందని ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి భోళా శంకర్ ఎంత రీమేక్ అయినప్పటికీ మరీ తక్కువ అంచనా వేస్తే ప్రమాదమని, మాస్ సెంటర్స్ లో బలమైన పోటీ లేకపోతే ఆయన చెలరేగిపోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు. అలాంటప్పుడు జైలర్ స్పీడ్ పెంచడం చాలా అవసరం. టాలీవుడ్ లో ఎందరో సన్నిహితులు ఉన్నారు. రజని అడగాలే కానీ చీఫ్ గెస్టుగా వచ్చేందుకు ఎవరైనా సరేనంటారు. చేస్తారో లేదోనదే పెద్ద ప్రశ్న.
సన్ పిక్చర్స్ సంస్థ మాత్రం కంటెంట్ పట్ల ధీమా ఉంది. పెద్ద క్యాస్టింగ్, భారీ బడ్జెట్, ఇతర భాషల్లో నుంచి తీసుకున్న స్టార్ హీరోల క్యామియోలు, అనిరుద్ రవిచందర్ సంగీతం ఇవన్నీ చూసుకుని తమ చేతుల్లో బ్లాక్ బస్టర్ ఉందనే కాన్ఫిడెన్స్ చూపిస్తోంది. ముంబైలోనూ తమన్నాతో ప్రెస్ మీట్ చేయించారు కానీ అక్కడికి రజని వెళ్ళలేదు. కానీ ఏపీ, తెలంగాణ మార్కెట్ ని హిందీ కోణంలో చూడలేం. ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా తలైవాకు ఇక్కడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళను సంతృప్తిపరుస్తూనే ఇక్కడి మీడియాతోనో కాస్త మాటలు కలుపుకుంటే హైప్ పెరిగేందుకు దోహదపడుతుంది.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…