తీసింది తక్కువ సినిమాలే కానీ.. సంపత్ నంది అనే పేరు టాలీవుడ్లో బాగానే పాపులర్. ‘ఏమైంది ఈవేళ’ లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయినప్పటికీ.. ఆ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో ‘రచ్చ’ సినిమా తీసి.. దాన్ని సక్సెస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు సంపత్.
వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ చేసే అవకాశం అందుకోవడం మరో సంచలనం. కానీ రేండేళ్లు ఆ స్క్రిప్టు కోసం కష్టపడి చివరికి ఆ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేయడంతో వార్తల్లో నిలిచాడు. ఆ చేదు అనుభవం నుంచి బయటపడి బెంగాల్ టైగర్, గౌతమ్ నంద లాంటి సినిమాలు తీశాడు సంపత్. కానీ అవి ఆశించిన ఫలితాన్నివ్వలేదు.
దర్శకుడిగా ఒడుదొడుకుల ప్రయాణం సాగిస్తూనే నిర్మాతగా మారి.. బయటి వాళ్లకు అవకాశం ఇచ్చాడు సంపత్. అలా రెండు సినిమాలు తీశాడతను. ఆ రెంటికీ కథలు అందించింది సంపతే. అందులో ఒకటి గాలిపటం కాగా.. మరొకటి పేపర్ బాయ్. ఈ రెంటికీ మంచి బజ్ వచ్చింది. కానీ అవి రెండూ ఆడలేదు. ‘పేపర్ బాయ్’ సినిమా నచ్చి అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాత తన బేనర్ మీద రిలీజ్ చేశాడు. అయినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం సంపత్ తన దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ‘సీటీమార్’ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.
కరోనా వల్ల దాని షూటింగ్కు బ్రేక్ పడింది. లాక్ డౌన్లో దొరికిన ఖాళీలో ఓ థ్రిల్లర్ కథ రెడీ చేసిన సంపత్.. ‘బెంగాల్ టైగర్’ నిర్మాత రాధామోహన్ బేనర్లో ఆ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు. సంపత్ శిష్యుడు అశోక్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి కథతో పాటు స్క్రీన్ ప్లే, మాటలు కూడా అందిస్తున్నాడు సంపత్. ఇంకా నటీనటులెవ్వరెన్నవి వెల్లడి కాలేదు. సోమవారమే ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిపారు. మరి సంపత్ కథ ఈసారైనా విజయాన్నందిస్తుందేమో చూడాలి.
This post was last modified on August 17, 2020 11:55 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…