Movie News

రెండుసార్లు ఫెయిల్.. మరి ఈసారి?

తీసింది తక్కువ సినిమాలే కానీ.. సంపత్ నంది అనే పేరు టాలీవుడ్లో బాగానే పాపులర్. ‘ఏమైంది ఈవేళ’ లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయినప్పటికీ.. ఆ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘రచ్చ’ సినిమా తీసి.. దాన్ని సక్సెస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు సంపత్.

వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ చేసే అవకాశం అందుకోవడం మరో సంచలనం. కానీ రేండేళ్లు ఆ స్క్రిప్టు కోసం కష్టపడి చివరికి ఆ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేయడంతో వార్తల్లో నిలిచాడు. ఆ చేదు అనుభవం నుంచి బయటపడి బెంగాల్ టైగర్, గౌతమ్ నంద లాంటి సినిమాలు తీశాడు సంపత్. కానీ అవి ఆశించిన ఫలితాన్నివ్వలేదు.

దర్శకుడిగా ఒడుదొడుకుల ప్రయాణం సాగిస్తూనే నిర్మాతగా మారి.. బయటి వాళ్లకు అవకాశం ఇచ్చాడు సంపత్. అలా రెండు సినిమాలు తీశాడతను. ఆ రెంటికీ కథలు అందించింది సంపతే. అందులో ఒకటి గాలిపటం కాగా.. మరొకటి పేపర్ బాయ్. ఈ రెంటికీ మంచి బజ్ వచ్చింది. కానీ అవి రెండూ ఆడలేదు. ‘పేపర్ బాయ్’ సినిమా నచ్చి అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాత తన బేనర్ మీద రిలీజ్ చేశాడు. అయినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం సంపత్ తన దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ‘సీటీమార్’ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.

కరోనా వల్ల దాని షూటింగ్‌కు బ్రేక్ పడింది. లాక్ డౌన్‌లో దొరికిన ఖాళీలో ఓ థ్రిల్లర్ కథ రెడీ చేసిన సంపత్.. ‘బెంగాల్ టైగర్’ నిర్మాత రాధామోహన్ బేనర్లో ఆ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు. సంపత్ శిష్యుడు అశోక్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి కథతో పాటు స్క్రీన్ ప్లే, మాటలు కూడా అందిస్తున్నాడు సంపత్. ఇంకా నటీనటులెవ్వరెన్నవి వెల్లడి కాలేదు. సోమవారమే ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిపారు. మరి సంపత్ కథ ఈసారైనా విజయాన్నందిస్తుందేమో చూడాలి.

This post was last modified on August 17, 2020 11:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అర్జున్ రెడ్డి మ్యూజిక్ వివాదం….రధన్ వివరణ

టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా చెప్పుకునే అర్జున్ రెడ్డికి సంగీత దర్శకుడు రధన్ ఇచ్చిన పాటలు ఎంత…

5 minutes ago

మైత్రి రెండు గుర్రాల స్వారీ ఏ ఫలితమిస్తుందో

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థగా వెలిగిపోతున్న మైత్రి మూవీ మేకర్స్ కి ఈ రోజు చాలా కీలకం. తెలుగులో కాకుండా…

30 minutes ago

రాజీ బాటలో రోజా సక్సెస్ అయ్యారా..?

ఆర్కే రోజా పేరు వింటేనే కూటమి పార్టీలు అంతెత్తున ఎగిరి పడుతున్నాయి. వైసీపీ అదికారంలో ఉండగా.. టీడీపీ, జనసేనలపై ఓ…

4 hours ago

హెచ్‌సీయూపై కాంగ్రెస్ గేమ్ స్టార్ట్, బీఆర్ఎస్ ఆన్సర్ ఉందా..?

కంచే గచ్చిబౌలి భూముల విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా…

6 hours ago

తెలంగాణను మించిన స్పీడుతో ఏపీ

పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నట్లే కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడ కూడా ఇరు రాష్ట్రాల మధ్య…

10 hours ago

బాబు ఆనందం అంతా ఇంతా కాదు… ఎందుకంటే…

ఏపీ ముఖ్య‌మంత్రిగా కూట‌మి ప్ర‌భుత్వాన్ని చ‌క్క‌టి స‌మ‌న్వ‌యంతో ముందుకు న‌డిపిస్తున్న చంద్ర‌బాబుకు 10 నెల‌లు పూర్తయ్యాయి. గ‌త ఏడాది జూన్…

10 hours ago