నిన్న బేబీ మూడో సక్సెస్ మీట్ చిరంజీవి ముఖ్య అతిధిగా జరిగింది. దర్శకుడు సాయిరాజేష్, నిర్మాత ఎస్కెఎన్ తో సహా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మెగాస్టార్ వీర ఫాన్స్ కావడంతో సినిమా కంటే చిరు మీద పొగడ్తల పర్వమే ఎక్కువ కొనసాగింది. ఒక దశలో ఆయనకే మరీ ఇబ్బందిగా అనిపించి తన అభినందన సభలా మార్చారని సరదా చమక్కు కూడా విసిరారు. మూడో వారంలోనూ బేబీ వసూళ్లు స్టడీగా ఉండటంతో వంద కోట్ల గ్రాస్ ని టార్గెట్ గా పెట్టుకున్నారు. వేదికపై చిరు మాట్లాడుతూ హీరోయిన్ వైష్ణవి చైతన్య మీద ప్రశంసల వర్షం కురిపించారు.
సహజమైన నటనతో అచ్చం జయసుధ గారిని గుర్తు చేసిందని కితాబు ఇచ్చారు. నిజానికి ఈ తరానికి ఆవిడ ఎంత గొప్ప నటో తెలియదు. ఆ పాత సినిమాలు ఎంత మంది చూసుంటారు. కానీ అంతే పేరు తెచ్చుకున్న సొందర్యతో పోలిక చేసుంటే కరెక్ట్ గా ఉండేదని అభిమానులు అభిప్రాయపడ్డారు. చిరుతో ఆవిడకు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. రిక్షావోడు పోయినా అన్నయ్య, చూడాలని ఉంది అదిరిపోయే హిట్లు కొట్టాయి. పెర్ఫార్మన్స్ తో అదరగొట్టిన అమ్మోరు, నరసింహ, 9 నెలలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అలాంటప్పుడు ఈ జనరేషన్ కు కనెక్ట్ అయ్యేలా సౌందర్యని గుర్తు చేసుకోవాల్సింది.
అలా కాకుండా బ్లాక్ అండ్ వైట్ జమానాలో మొదలైన జయసుధ గారితో కంపేర్ చేయడం న్యాయమే అయినా వైష్ణవికి కాంప్లిమెంట్ ఇవ్వడానికి అంత వెనక్కు వెళ్లాల్సిన అవసరం లేదనేది మెజారిటీ ఒపీనియన్. ఏదైతేనేం చిరంజీవితో ఈ స్థాయిలో పొగిడించుకోవడం అంటే వైష్ణవికి పెద్ద అచీవ్ మెంటే. ఈ ఉద్వేగం స్పీచ్ లోనూ కనిపించింది. స్వయంగా తల్లి తండ్రులను తీసుకొచ్చి స్టేజి మీద పరిచయం చేసి మరీ ఫోటోలు తీయించింది. ఈవెంట్ విజయవంతమయ్యింది కానీ బేబీ కంటెంట్ కన్నా చిరు నామస్మరణతోనే ప్రాంగణం ఊగిపోయిన మాట వాస్తవం
This post was last modified on July 31, 2023 11:40 am
ఏపీలో పోలింగ్ ప్రక్రియకు మరికొన్ని గంటల ముందు.. సంచలనం చోటు చేసుకుంది. కూటమి పార్టీల ముఖ్య నేత, టీడీపీ అధినేత…
ఏపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసిపోవడంతో నాయకులు, పార్టీల అధినే తలు ఎక్కడికక్కడ సేద…
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లిలో చోటు చేసుకుంది.…
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్లో పవన్కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…
ఆంధ్రప్రదేశ్లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…
దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…