రౌడీ ఫెలో మూవీతో దర్శకుడిగా మారిన గేయ రచయిత కృష్ణచైతన్య అరంగేట్రంలోనే తన ప్రతిభను చాటుకున్నాడు. కమర్షియల్గా అనుకున్నంత సక్సెస్ కాకపోయినా అదొక ప్రత్యేక చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత ఛల్ మోహనరంగతో పర్వాలేదనిపించిన కృష్ణచైతన్య.. ఇంకో సినిమా తీయడానికి చాలా సమయమే తీసుకున్నాడు.
నితిన్తో పవర్ పేట సినిమాకు అంతా సిద్ధం చేసుకున్నాక బడ్జెట్, ఇతర సమస్యలతో అది ఆగిపోయింది. తర్వాత శర్వానంద్తో ఇదే కథను పట్టాలెక్కించాలని చేసిన ప్రయత్నమూ ఫలించలేదు. చివరికి అతడి కథ యువ కథానాయకుడు విశ్వక్సేన్ను ఓకే చేసి సినిమాను ముందుకు తీసుకెళ్లాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్ ఈ చిత్రాన్ని మంచి బడ్జెట్లో నిర్మిస్తోంది.. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ సోమవారం లాంచ్ చేయబోతున్నారు.
ఈలోపే ఈ టైటిల్ సోషల్ మీడియాలో రివీల్ అయిపోయింది. విశ్వక్సేన్ 11వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే టైటిల్ ఖరారు చేశారట. సినిమా మొదలైనపుడు లంకల రత్న అని వర్కింగ్ టైటిల్ అనుకున్నారు. కానీ దాని కంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరినే క్యాచీగా ఉంటుందని, ఆ టైటిలే ఖరారు చేసినట్లు సమాచారం. రగ్డ్ లుక్లో విశ్వక్ ఫస్ట్ లుక్ ఉండబోతోందట.
గోదావరి ప్రాంతంలోని రౌడీ గ్యాంగ్స్ చుట్టూ తిరిగే పీరియడ్ మూవీ ఇది. ఈ కథను కొన్ని భాగాలుగా తీస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పుడు ఫిక్స్ చేసిన టైటిల్ చూస్తే హిందీలో అనురాగ్ కశ్యప్ తీసిన గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ గుర్తుకు రాక మానదు. సినిమా కూడా దాన్ని గుర్తుకు చేసేలా రా అండ్ రస్టిక్గా ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రంలో అంజలి, నేహా శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.
This post was last modified on July 30, 2023 10:23 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…