క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా రూపొందిన స్లమ్ డాగ్ హస్బెండ్ ఏకంగా పవన్ కళ్యాణ్ బ్రో ఉందని తెలిసి కూడా ఒక రోజు గ్యాప్ తో రిలీజ్ కు సిద్ధపడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సరే కంటెంట్ అంత బలంగా ఉందేమో అనుకున్నారు. ట్రైలర్ గట్రా ఏదో కామెడీతో బాగానే ట్రై చేసినట్టు అనిపించింది.పైగా ప్రమోషన్లు కూడా గట్టిగా చేశారు. స్టార్లు సెలబ్రిటీలు అండగా నిలబడ్డారు. అయినా అంచనాల విషయంలో వెనుకబడిన ఈ వెరైటీ మొగుడు ఎట్టకేలకు థియేటర్లలో అడుగు పెట్టాడు. మరి టాక్ నే నమ్ముకున్న ఈ చిత్రరాజం నిజంగా నవ్వించిందా.
రోడ్ల మీద కళ్లజోళ్లు అమ్ముకునే లక్ష్మణ్(సంజయ్ రావు)కి మౌనిక(ప్రణవి) అంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి లవ్. తీరా పెళ్లి కుదిరిన సమయంలో అమ్మాయి జాతక దోషం వల్ల లక్ష్మణ్ బేబీ అనే కుక్క మెడకు తాళి కట్టాల్సి వస్తుంది. సరే అడ్డంకి తొలగిపోయింది కదాని ప్రియురాలికి మూడు ముళ్ళు వేసే సమయంలో పోలీసులు వస్తారు. సదరు కుక్క యజమాని విడాకులు ఇవ్వందే ఒప్పుకోనని కోర్టుకు వెళ్తాడు. అంతే కాదు ఇరవై లక్షలు అడుగుతాడు. దీంతో పెనం నుంచి పొయ్యిలో పడ్డ లక్ష్మణ్ చివరికి ఈ గండం నుంచి ఎలా తప్పించుకున్నాడనేదే అసలైన స్టోరీ
ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన ఏవండీ ఆవిడ వచ్చిందిలో బాబు మోహన్, కోటల కామెడీ ట్రాక్ ని తీసుకుని దర్శకుడు ఏఆర్ శ్రీధర్ ఈ కథను అల్లుకున్నాడు. అక్కడ గాడిద ఇక్కడ కుక్క అయ్యింది. అంతే తేడా. కాకపోతే అవసరానికి మించి అడల్ట్ కామెడీ, బూతులు సీన్లు జొప్పించడంతో పాటు నవ్వించలేని హాస్యంతో విపరీతమైన ల్యాగ్ సహనానికి పరీక్ష పెడుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంత మాత్రం రికమండ్ చేసేలా లేదు. క్రియేటివిటీ అంటే కొత్తగా ఆలోచించడం కానీ వింతగా కాదని కొత్త దర్శకులు గుర్తుంచుకుంటే మంచిది. ఫైనల్ గా నవ్విద్దామని వచ్చిన హస్బెండ్ చివరికి నవ్వులపాలయ్యాడు.
This post was last modified on July 30, 2023 12:49 pm
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…