క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా రూపొందిన స్లమ్ డాగ్ హస్బెండ్ ఏకంగా పవన్ కళ్యాణ్ బ్రో ఉందని తెలిసి కూడా ఒక రోజు గ్యాప్ తో రిలీజ్ కు సిద్ధపడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సరే కంటెంట్ అంత బలంగా ఉందేమో అనుకున్నారు. ట్రైలర్ గట్రా ఏదో కామెడీతో బాగానే ట్రై చేసినట్టు అనిపించింది.పైగా ప్రమోషన్లు కూడా గట్టిగా చేశారు. స్టార్లు సెలబ్రిటీలు అండగా నిలబడ్డారు. అయినా అంచనాల విషయంలో వెనుకబడిన ఈ వెరైటీ మొగుడు ఎట్టకేలకు థియేటర్లలో అడుగు పెట్టాడు. మరి టాక్ నే నమ్ముకున్న ఈ చిత్రరాజం నిజంగా నవ్వించిందా.
రోడ్ల మీద కళ్లజోళ్లు అమ్ముకునే లక్ష్మణ్(సంజయ్ రావు)కి మౌనిక(ప్రణవి) అంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి లవ్. తీరా పెళ్లి కుదిరిన సమయంలో అమ్మాయి జాతక దోషం వల్ల లక్ష్మణ్ బేబీ అనే కుక్క మెడకు తాళి కట్టాల్సి వస్తుంది. సరే అడ్డంకి తొలగిపోయింది కదాని ప్రియురాలికి మూడు ముళ్ళు వేసే సమయంలో పోలీసులు వస్తారు. సదరు కుక్క యజమాని విడాకులు ఇవ్వందే ఒప్పుకోనని కోర్టుకు వెళ్తాడు. అంతే కాదు ఇరవై లక్షలు అడుగుతాడు. దీంతో పెనం నుంచి పొయ్యిలో పడ్డ లక్ష్మణ్ చివరికి ఈ గండం నుంచి ఎలా తప్పించుకున్నాడనేదే అసలైన స్టోరీ
ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన ఏవండీ ఆవిడ వచ్చిందిలో బాబు మోహన్, కోటల కామెడీ ట్రాక్ ని తీసుకుని దర్శకుడు ఏఆర్ శ్రీధర్ ఈ కథను అల్లుకున్నాడు. అక్కడ గాడిద ఇక్కడ కుక్క అయ్యింది. అంతే తేడా. కాకపోతే అవసరానికి మించి అడల్ట్ కామెడీ, బూతులు సీన్లు జొప్పించడంతో పాటు నవ్వించలేని హాస్యంతో విపరీతమైన ల్యాగ్ సహనానికి పరీక్ష పెడుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంత మాత్రం రికమండ్ చేసేలా లేదు. క్రియేటివిటీ అంటే కొత్తగా ఆలోచించడం కానీ వింతగా కాదని కొత్త దర్శకులు గుర్తుంచుకుంటే మంచిది. ఫైనల్ గా నవ్విద్దామని వచ్చిన హస్బెండ్ చివరికి నవ్వులపాలయ్యాడు.
This post was last modified on July 30, 2023 12:49 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…