తెలుగులో అత్యంత ఉదారమైన మనస్తత్వం ఉన్న అభిమానులుగా పవర్ స్టార్ పవన్ ఫ్యాన్స్ గురించి చెప్పుకోవాలి. వేరే హీరోలతో పోలిస్తే పవన్ ఎంచుకునే కథలు చాలా సాధారణం. అలాగే పవన్ తన సినిమాల మీద పెట్టే ఎఫర్ట్స్ కూడా చాలా తక్కువ. ‘అజ్ఞాతవాసి’ లాంటి డిజాస్టర్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చిన పవన్.. అభిమానుల అభీష్టానికి వ్యతిరేకంగా ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’లో నటించాడు.
ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకించి వ్యతిరేకించి అలసిపోయి.. చివరికి రిలీజ్ టైంకి సర్దుకుపోయిన ఫ్యాన్స్.. పవన్ తెర మీద కనిపించడమే మహా భాగ్యం అన్నట్లు ఆ సినిమాను ఎగబడి చూశారు. తర్వాత ‘భీమ్లా నాయక్’ విషయంలోనూ ఇదే రిపీటైంది. ఇంకో రీమేకా అని తిట్టుకుంటూనే దానికీ హైప్ ఇచ్చారు. థియేటర్లను నింపేశారు. కరోనా టైంలో ఉన్నంతలో మంచి కలెక్లన్లే ఇచ్చారు.
ఈ రెండు సినిమాలతో పోలిస్తే ‘బ్రో’ బాగా వీక్ మూవీ. పవన్ అయితే మరీ మొక్కుబడిగా ఈ సినిమా చేసినట్లు అనిపించింది. ఏమాత్రం శ్రమ లేకుండా 20 రోజుల్లో చకచకా సినిమాను లాగించేశాడు. తనను తనే ఇమిటేట్ చేస్తూ.. తన పాటలకు తనే డ్యాన్స్ చేస్తూ అభిమానులకు కొంత కిక్ ఇవ్వడానికి చూసినా.. సినిమాలో కథాకథనాలతో పాటు అన్నీ వీక్గానే కనిపించాయి. ఇలాంటి సినిమాలతో సాధారణ ప్రేక్షకులను ఎగ్జైట్ చేయడం, ఎంగేజ్ చేయడం చాలా కష్టం.
అభిమానులు కూడా ఏదో తప్పదన్నట్లు సర్దుకుపోతున్నారే తప్ప.. వారికి ఈ సినిమా సంతృప్తినివ్వట్లేదు. పవన్ క్యాలిబర్ ఏంటి.. అతను చేస్తున్న సినిమాలేంటి అని ఫీలవుతున్నారు. తాము ఎంత సర్దుకుపోయినా సరే.. మరీ ఇలాంటి సాధారణమైన రీమేక్ సినిమాలతో పవన్ ఎంత కాలం నెట్టుకొస్తాడు అంటున్నారు. ఇకనైనా ఇలాంటివి ఆపేసి కొంచెం ఎఫర్ట్ పెట్టి బలమైన సినిమాలు ఇచ్చి అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులనూ అలరించాలని.. మరోసారి రీమేక్ వైపు చూడొద్దని వాళ్లు బలంగా కోరుకుంటున్నారు.
This post was last modified on July 30, 2023 9:29 am
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…