తెలుగులో అత్యంత ఉదారమైన మనస్తత్వం ఉన్న అభిమానులుగా పవర్ స్టార్ పవన్ ఫ్యాన్స్ గురించి చెప్పుకోవాలి. వేరే హీరోలతో పోలిస్తే పవన్ ఎంచుకునే కథలు చాలా సాధారణం. అలాగే పవన్ తన సినిమాల మీద పెట్టే ఎఫర్ట్స్ కూడా చాలా తక్కువ. ‘అజ్ఞాతవాసి’ లాంటి డిజాస్టర్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చిన పవన్.. అభిమానుల అభీష్టానికి వ్యతిరేకంగా ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’లో నటించాడు.
ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకించి వ్యతిరేకించి అలసిపోయి.. చివరికి రిలీజ్ టైంకి సర్దుకుపోయిన ఫ్యాన్స్.. పవన్ తెర మీద కనిపించడమే మహా భాగ్యం అన్నట్లు ఆ సినిమాను ఎగబడి చూశారు. తర్వాత ‘భీమ్లా నాయక్’ విషయంలోనూ ఇదే రిపీటైంది. ఇంకో రీమేకా అని తిట్టుకుంటూనే దానికీ హైప్ ఇచ్చారు. థియేటర్లను నింపేశారు. కరోనా టైంలో ఉన్నంతలో మంచి కలెక్లన్లే ఇచ్చారు.
ఈ రెండు సినిమాలతో పోలిస్తే ‘బ్రో’ బాగా వీక్ మూవీ. పవన్ అయితే మరీ మొక్కుబడిగా ఈ సినిమా చేసినట్లు అనిపించింది. ఏమాత్రం శ్రమ లేకుండా 20 రోజుల్లో చకచకా సినిమాను లాగించేశాడు. తనను తనే ఇమిటేట్ చేస్తూ.. తన పాటలకు తనే డ్యాన్స్ చేస్తూ అభిమానులకు కొంత కిక్ ఇవ్వడానికి చూసినా.. సినిమాలో కథాకథనాలతో పాటు అన్నీ వీక్గానే కనిపించాయి. ఇలాంటి సినిమాలతో సాధారణ ప్రేక్షకులను ఎగ్జైట్ చేయడం, ఎంగేజ్ చేయడం చాలా కష్టం.
అభిమానులు కూడా ఏదో తప్పదన్నట్లు సర్దుకుపోతున్నారే తప్ప.. వారికి ఈ సినిమా సంతృప్తినివ్వట్లేదు. పవన్ క్యాలిబర్ ఏంటి.. అతను చేస్తున్న సినిమాలేంటి అని ఫీలవుతున్నారు. తాము ఎంత సర్దుకుపోయినా సరే.. మరీ ఇలాంటి సాధారణమైన రీమేక్ సినిమాలతో పవన్ ఎంత కాలం నెట్టుకొస్తాడు అంటున్నారు. ఇకనైనా ఇలాంటివి ఆపేసి కొంచెం ఎఫర్ట్ పెట్టి బలమైన సినిమాలు ఇచ్చి అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులనూ అలరించాలని.. మరోసారి రీమేక్ వైపు చూడొద్దని వాళ్లు బలంగా కోరుకుంటున్నారు.
This post was last modified on July 30, 2023 9:29 am
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…
తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…
ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్.. తాజాగా వైసీపీ గూటికి చేరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం…