చిరంజీవి దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్ లో రూపొందిన భోళా శంకర్ ఆగస్ట్ 11 విడుదలకు ముస్తాబవుతోంది. నిర్మాత అనిల్ సుంకర ప్రమోషన్లను గట్టిగా ప్లాన్ చేశారు. అందులో భాగంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై ఉన్న రాజు గారి తోటలో 125 అడుగుల అతి పెద్ద కటవుట్ ని ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ హిస్టరీలో ఇంత పొడవున్న నిలువెత్తు కటవుట్ ని ఎప్పడూ పెట్టలేదని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగా ఫ్యాన్స్ షేరింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా.
గతంలో ఏజెంట్ విషయంలో అనిల్ సుంకర మరీ ఇంత పెద్దది కాకపోయినా యాభై నుంచి డెబ్భై అడుగుల కటవుట్లను పెట్టించి అక్కినేని అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చారు. తీరా ఫలితం ఏమయ్యిందో చూశాం. భోళా శంకర్ కు అలా జరగకూడదని సగటు మూవీ లవర్స్ కోరిక. భోళా శంకర్ కు ఇప్పటికే బోలెడు ప్రతికూలత ఉంది. ట్రైలర్ లో రొటీన్ కంటెంట్ ఉందని, శ్రీముఖితో రొమాన్స్ కామెడీ పెట్టడం అస్సలు బాలేదని, ఎంత తమ్ముడైనా సరే పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేయడం నచ్చలేదని సీనియర్ ఫ్యాన్సే ట్విట్టర్, ఇన్స్ టాల్లో అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇక సగటు ప్రేక్షకుల గురించి చెప్పేదేముంది. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తో జోష్ లో ఉన్న చిరంజీవి దీంతో మరో హిట్టు కొట్టాలనే నమ్మకంతో ఉన్నారు. తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, మహతి స్వర సాగర్ సంగీతం ఇలా అన్ని ఆకర్షణలు ఉన్నా మెహర్ రమేష్ దర్శకత్వం, వేదాళం రీమేక్ అనే అంశం నెగటివిటీని తెచ్చిపెట్టాయి. సో కటవుట్లు ఎంత గ్రాండ్ గా ఉన్నాయో కంటెంట్ అంతకు మించి అనేలా ఉంటే తప్ప పోటీకి దిగుతున్న రజనీకాంత్ జైలర్ ని తట్టుకోవడం ఈజీగా ఉండదు. పైగా భోళా శంకర్ పాటలు కూడా ఆశించిన స్థాయిలో స్పందన తెచ్చుకోలేదు.
This post was last modified on July 30, 2023 6:12 am
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…