సినిమాల్లో వర్తమాన రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించేలా సన్నివేశాలు, డైలాగులు పెట్టడం.. రాజకీయ నాయకులను గుర్తు తెచ్చేలా క్యారెక్టర్లను క్రియేట్ చేయడం కొత్తేమీ కాదు. అందులోనూ రాజకీయాలతో టచ్ ఉన్న ఫిలిం స్టార్లు తమ రాజకీయ భావజాలానికి తగ్గట్లు.. ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ సీన్లు రాయించుకోవడం గతంలోనూ చూశాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే చేశాడు.
బ్రో సినిమాలో సందర్భానుసారం వైసీపీ నేతలను టార్గెట్ చేశాడు. అందులో ముఖ్యంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. పృథ్వీ చేసిన శ్యామ్ బాబు పాత్రే. ముందు ఇది మామూలు పాత్రే అనుకుంటాం కానీ.. మై డియర్ మార్కండేయ పాట చూస్తే కానీ అది ఏపీ మంత్రి అంబటి రాంబాబును టార్గెట్ చేస్తూ పెట్టిన క్యారెక్టర్ అని అర్థం కాదు.
ఈ పాటలో శ్యాంబాబు పాత్ర మీద సెటైర్లు పడ్డాయి. ఈ పాటలో పృథ్వీ గెటప్, ఆయన స్టెప్పులు చూస్తే ఆటోమేటిగ్గా అంబటి రాంబాబు గుర్తుకొచ్చేస్తారు. ఈ ఏడాది సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాంబాబు వేసిన స్టెప్పుల తాలూకు వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దాదాపుగా అలాంటి టీషర్టే పృథ్వీకి వేయించి స్టెప్పులు కూడా ఇమిటేట్ చేయించారు. సడెన్గా మ్యూజిక్ ఆపించి..”శ్యాంబాబు పాట ఉన్న టెంపో ఏంటి? నువ్వు వేస్తున్న స్టెప్ ఏంటి?” అని పవన్ కళ్యాణ్ క్లాస్ తీసుకుంటాడు.
అంతే కాక పృథ్వీని ఉద్దేశించి ‘నెక్స్ట్ ఏంటి?’ అని పవన్ అడిగితే… ససెక్స్.స అంటాడు శ్యాంబాబు. దీనికి బదులుగా నీకె్పుడూ అదే ధ్యాస.. అందరూ మీలాగే ఎప్పుడూ దాని గురించే ఆలోచించరని పవన్ కౌంటర్ వేస్తాడు. అంతే కాక ఈ లలితకళల్ని వదిలేయమని ఘాటుగా చెబుతాడు. థియేటర్లో ఈ సన్నివేశాలను బంధించిన పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వైసీపీ నేతల మీద పవన్ ఇందులో మరికొన్ని పంచులు వేయడం గమనార్హం.
This post was last modified on July 29, 2023 10:10 am
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…