బ్రో రిలీజ్ వల్ల బేబీ థియేటర్లు ఈ రోజు నుంచి చాలా తగ్గిపోయాయి. స్క్రీన్లు తక్కువగా ఉన్న చోట వీకెండ్ వరకు బ్రోతో రీప్లేస్ చేసేలా నిర్మాతలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా షోలు నడుస్తున్నాయి. అలా అని బేబీ ఫైనల్ రన్ కు వచ్చిందని కాదు. డిస్ట్రిబ్యూటర్లు ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం బ్రోకు వచ్చిన డివైడ్ టాక్ తిరిగి సాయిరాజేష్ బృందానికే బూస్ట్ అవుతుందని, మళ్ళీ సోమవారం నుంచి పికప్ చూడొచ్చని అంచనా వేస్తున్నారు. ఆగస్ట్ 4 రావాల్సిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వాయిదా కలిసి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ఛాన్స్ వాడుకునేందుకు బేబీ టీమ్ రెడీ అవుతోంది. ఎడిటింగ్ లో ఇష్టం లేకపోయినా తొలగించాల్సి వచ్చిన 14 నిమిషాల ఫుటేజిని జోడించబోతున్నట్టు తెలిసింది. ఇందులో ఇప్పటిదాకా ఆడియోలో, థియేటర్లో రిలీజ్ చేయని ఏడో పాట ఉండబోతోంది. ఈ కొత్త వెర్షన్ లో ఏఏ సీన్లు ఉంటాయనేది సస్పెన్స్ గా పెట్టారు. లీక్స్ ప్రకారం చూసుకుంటే విరాజ్ అశ్విన్, నాగబాబు, ఆనంద్ తల్లి పాత్రలకు సంబంధించిన ఫినిషింగ్ సరిగా జరగలేదు కాబట్టి వాటిని జోడించవచ్చని అంటున్నారు. దాంతో పాటు వైష్ణవి చైతన్యకు సంబంధించిన కీలక సన్నివేశాలు కూడా ఉంటాయట.
ఇలా అయితే యూత్ మళ్ళీ బేబీని చూడటం ఖాయం. ఇప్పటికే కాలేజీ కుర్రాళ్లు, ప్రేమజంటలు పుణ్యమాని బోలెడు రిపీట్ రన్లు దక్కించుకుంది. రెండో వారం నుంచి ఫ్యామిలీస్ కూడా బాగా వస్తున్నాయి. అలాంటప్పుడు డైరెక్టర్స్ కట్ పేరుతో వదిలే స్పెషల్ ఎడిషన్ కి రెస్పాన్స్ ఖచ్చితంగా బాగుంటుంది. ఓటిటి హక్కులు కొన్నది ఆహానే కాబట్టి మరీ త్వరగా డిజిటల్ రిలీజ్ కాకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆగస్ట్ 10 నుంచి పెద్ద హీరోలు ఒక్కొక్కరుగా దిగుతున్న నేపథ్యంలో ఆలోగా వీలైనంత ఎక్కువ రాబట్టుకోవడమే బేబీ లక్ష్యం. ఇంకో రెండు వారాలు రన్ దొరికినట్టే.
This post was last modified on July 28, 2023 7:21 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…