సుకుమార్ ఏ ముహూర్తంలో రంగస్థలం తీసి 1985 నాటి కథ చెప్పారో అప్పటి నుంచి ఈ ట్రెండ్ ఊపందుకున్న మాట వాస్తవం. దాదాపు తెలుగు తమిళ హీరోలందరూ అలాంటి స్టోరీసే అడిగి మరీ తీయించుకుంటున్నారు. కొన్నిటిలో ఉన్న సారూప్యతలు ఆశ్చర్యం కలిగేలా ఉంటాయి. అదెలాగో చూద్దాం. ఇవాళ దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ లక్కీ భాస్కర్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనుంది. పోస్టర్ లో పాత కాలం వంద నోటుని హైలైట్ చేయడం చూస్తే ఇది ఇప్పటి బ్యాక్ డ్రాప్ కాదనే విషయం స్పష్టంగా అర్థమైపోతుంది .
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ హీరోగా రూపొందబోయే పొలిటికల్ కం మాఫియా థ్రిల్లర్ లోనూ 90ల నాటి డబ్బునే హైలైట్ చేయబోతున్నారు. నిన్న వదిలిన ప్రీ లుక్ లో అదే బయటపడింది. వరుణ్ తేజ్ మట్కా కూడా 1980 కరెన్సీ చుట్టూ తిరిగే గ్యాంబ్లింగ్ గేమ్ మీద నడుస్తుంది. కరుణ కుమార్ హైడ్రామాతో తీస్తున్నారట. ఇలా మీడియం రేంజ్ స్టార్లు ముగ్గురు తెలుగు దర్శకులతో పని చేస్తూ ఓల్డ్ కరెన్సీ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకోవడం విశేషమే. ఇవింకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాల్సి ఉంది. వచ్చే నెల నుంచి ఉంటాయి. అటు ఇటు తిరిగి ఇంచుమించు ఒకే టైంలో రిలీజైనా ఆశ్చర్యం లేదు మరి.
క్రియేటివ్ కోణంలో ఆలోచిస్తే ఇలా డిఫరెంట్ జానర్స్ ని వెలికి తీయడం వల్ల రచయితలకు ఛాలెంజింగ్ గా ఉంటుంది. అందులోనూ సీనియర్లు సేఫ్ జోన్ కోసం కమర్షియల్ ఫార్మలాకే కట్టుబడిన నేపథ్యంలో ఇలా దశాబ్దాల వెనక్కు వెళ్లడం ద్వారా ఆడియన్స్ ని థ్రిల్ చేయడానికి యూత్ స్టార్లకు కొత్త దారులు కనిపిస్తున్నాయి. పైన చెప్పిన వాటిలో ఒకరు తమిళం మరొకరు మలయాళం హీరో. కానీ తెలుగు మార్కెట్ ని సీరియస్ గా తీసుకుని మన డైరెక్టర్లతో పని చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇదీ ఒకరకంగా మంచిదే. కోలీవుడ్ అమలు చేయాలనుకుంటున్న విచిత్రమైన రూల్స్ కి ఒక సమాధానంలా ఉంటుంది.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సతీమణిగానే నిన్నటిదాకా కొనసాగిన నారా భువనేశ్వరి ఇప్పుడు సరికొత్త బాధ్యతల్లోకి ఒదిగిపోయారని…
టీడీపీ సీనియర్ నాయకుడు, దెందులూరు ఎమ్మెల్యే , ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరున్న చింతమనేని ప్రభాకర్.. తన చెయ్యి పెద్దదని…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేకెత్తించి.. అనేక అనుమానాలను కూడా సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి వ్యవహారంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కోసం ఏపీ పోలీసులు వేట సాగిస్తున్నారు. కాకాణి సొంత…
ఏపీలో కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు.. గత వారం రోజులుగా నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు . అయితే.. ప్రభుత్వం…
స్టాండప్ కామెడీ నవ్వు తెప్పించడం సంగతేమో గానీ... కట్టుబాట్లను మాత్రం చాలా సునాయసంగా దాటేస్తోంది. భారత సమాజం గుట్టుగా ఉంచే కార్యకలాపాలను…