ఈ ఏడాది ప్రారంభం సంక్రాంతికి వాల్తేరు వీరయ్య రూపంలో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి కేవలం ఏడు నెలల గ్యాప్ లో భోళా శంకర్ గా రాబోతున్నాడు. వేదాళం రీమేక్, దర్శకుడు మెహర్ రమేష్ ట్రాక్ రికార్డు ముందు నుంచి ఈ సినిమా మీద నెగటివ్ వైబ్స్ తీసుకొస్తున్నాయి. దానికి తోడు మహతి స్వరసాగర్ ఇచ్చిన మూడు పాటలు ఓకే అనిపించాయే తప్ప మ్యూజికల్ గా ఆశించిన స్థాయిలో అంచనాలు పెంచలేకపోయాయి. అందుకే హైప్ పెంచాల్సిన బాధ్యత ట్రైలర్ మీద పడింది. ఇందాక రామ్ చరణ్ ద్వారా దీని లాంచ్ ని ఆన్ లైన్ వేదికగా చేశారు.
కోల్కతాలో అమ్మాయిలు కిడ్నాపుకు గురవుతుంటారు. పోలీసులు చేరుకోలేని ఈ గ్యాంగ్ దగ్గరికి టాక్సీ డ్రైవర్ శంకర్(చిరంజీవి) వెళ్లి కాపాడతాడు. ఇలా సంఘసేవ చేస్తూ చెల్లి(కీర్తి సురేష్)తో సంతోషంగా ఉన్న శంకర్ జీవితంలోకి ఒక శత్రువు(తరుణ్ అరోరా) వస్తాడు. అతని ముఠాని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న శంకర్ అసలు ఉద్దేశం ముందు ఎవరికీ అర్థం కాదు. ఇంతకీ ఇతని లక్ష్యం ఏంటి, ఎందుకు ఊచకోతకు తెగబడ్డాడు, సోదరి వెనుక ఉన్న ప్రమాదం లాంటి ప్రశ్నలకు సమాధానం ఆగస్ట్ 11నే తేలనుంది. విజువల్స్ అన్నీ రెగ్యులర్ స్టైల్ లోనే సాగాయి.
దర్శకుడు మెహర్ రమేష్ చిరంజీవి ఎనర్జీని పూర్తిగా వాడుకున్నట్టే కనిపిస్తోంది. వేదాళంకు పెద్దగా మార్పులు చేయకపోయినా చిరు బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు సబ్జెక్టుని సెట్ చేసినట్టు అర్థమవుతోంది. యాక్టర్స్ అందరినీ రివీల్ చేశారు. నా వెనుక దునియా ఉందని చిరు చెప్పడం, రంగస్థలంలో రామ్ చరణ్ బాబులా నటిస్తున్నాడని తమన్నా చెప్పించడం వగైరా అంతా ఫ్యాన్ స్టఫ్ లా పెట్టేశారు. కంటెంట్ కు తగ్గట్టే మహతి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గట్టిగా ఉంది. మాస్ ఎంటర్ టైనర్లు రొటీన్ గా ఉన్నా హీరో స్టామినాతో దర్శకుడి తెలివితో గట్టెక్కిపోతుంటాయి. భోళా శంకర్ లోనూ ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి మరి. చూద్దాం
This post was last modified on July 27, 2023 4:36 pm
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. సభలు,…
గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో…
మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ…
'ఎక్కడున్నా భారత్కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు…
ఏపీలో ఎన్నికలు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా…
కాంగ్రెస్ హైకమాండ్ ఎంత చెప్పినా తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని తెలిసింది.…