ఎన్ని సినిమాలు తీసినా ఇప్పటి ఆడియెన్స్ కి ది కాశ్మీర్ ఫైల్స్ తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. గత ఏడాది రాధే శ్యామ్ రిలీజైన రోజే తన సినిమాని వదిలి బ్లాక్ బస్టర్ అందుకోవడం అంత ఈజీగా మర్చిపోయేది కాదు. అయితే ఈసారి కూడా సలార్ ని టార్గెట్ చేసుకుని ది వ్యాక్సిన్ వార్ ని విడుదల చేయబోతున్న సంగతీ తెలిసిందే. అయితే ప్రభాస్ కంటే తానే గొప్పవాడినని ఋజువు చేయడం కోసం కావాలనే క్లాష్ అవుతున్నాడని, ఆ మాట వివేకే అన్నట్టు నిన్నంతా సోషల్ మీడియాలో గట్టి ప్రచారమే జరిగింది. దీని గురించి ఆయనే ఓపెనయ్యాడు.
ప్రభాస్ ఒక పెద్ద మెగాస్టార్ అని, చిన్న బడ్జెట్ చిన్న స్టార్లతో సినిమాలు తీసే తాను పోలిక ఎందుకు పెట్టుకుంటానని, అలాంటి దిగజారుడు స్టేట్ మెంట్లు ఇచ్చే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టాడు. అయితే సలార్ లాంటి డైనోసర్ మూవీతో ఎందుకు తలపడుతున్నారంటే మాత్రం అది కేవలం కాకతాళీయంగా జరిగిందే తప్ప కావాలని ప్లాన్ చేసింది కాదని అన్నారు. ఇటీవలే తెరమీద దేవుళ్ళుగా కనిపించేవాళ్ళు రాత్రి మందు కొడతారని వివాదాస్పద కామెంట్లు చేసిన వివేక్ అగ్నిహోత్రి అవి ఎవరిని ఉద్దేశించి అన్నారో క్లారిటీ ఇవ్వకపోయినా మాటలు మాత్రం వైరలయ్యాయి.
ఏదో ఒక రూపంలో వివేక్ అగ్నిహోత్రి వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు. కరోనా సమయంలో భారతదేశం పోరాడిన తీరు, వ్యాక్సిన్ కనుక్కోవడంతో మన డాక్టర్లు చేసిన కృషి, ప్రభుత్వం తీసుకున్న చర్యల చుట్టూ వివేక్ ది వ్యాక్సిన్ వార్ ని రూపొందించారు. బయటికి పూర్తి వివరాలు ఇవ్వలేదు కానీ ఇందులో కూడా కాంట్రావర్సీ అంశాలు ఉంటాయని యూనిట్ నుంచి వస్తున్న టాక్. అయినా ప్రభాస్ మీద ద్వేషం ఉన్నా లేకపోయినా దాని వల్ల డార్లింగ్ కు వచ్చిన నష్టమేమీ లేదు. పైపెచ్చు ఆ పేరుని వాడుకోవడం వల్ల వివేక్ లాంటి వాళ్ళకే ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయని వేరే చెప్పాలా
ఆ పాఠశాలలో సంప్రదాయ విద్యా విధానం లేదు.. సహచర విద్యార్థుల ద్వారానే పాఠాలు నేర్చుకుంటారు… ఈ ప్రత్యేకతలు ఉన్న పాఠశాలను…
తెలుగు సినిమాల్లో సాధారణంగా ఒక సినిమాలో ఐదారు పాటలు ఉంటాయి. కొన్ని చిత్రాల్లో ఒకట్రెండు తగ్గుతుంటాయి. కొన్నింట్లో పెరుగుతుంటాయి. థ్రిల్లర్…
సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా పెద్దిలో జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఎన్నడూ లేనిది…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమ సంఘం నాయకుడు అభిజీత్ దీప్కే ఇచ్చిన పిలుపు ఫలించింది. శనివారం ఉదయం 10 గంటల…
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భవానీ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరా జయం పాలైన…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గతంలోను.. ఇప్పుడు కూడా కేటీఆర్…